కువైట్ లో గుండె పోటుతో జగిత్యాల వాసి మృతి...!
- September 19, 2024
కువైట్ సిటీ: కువైట్ లో మరో తెలంగాణ వ్యక్తి మరణించారు. కువైట్ లో అకస్మాత్తుగా గుండె పోటుతో జగిత్యాల వాసి మృతి చెందారు. జగిత్యాల జిల్లా కేంద్రానికి చెందిన సాయి కృష్ణ (37) అకస్మాత్తుగా గుండె పోటు తో మృతి చెందడం జరిగింది. సాయి కృష్ణ... కువైట్ లో పది సంవత్సరాల నుండి ఉపాధి పొందుతూ తన కుటుంబాన్ని పోషించూకుంటున్నాడు. అయితే.. రెండు సంవత్సరాలకు ఒకసారి ఇంటికి వస్తున్నారు సాయి కృష్ణ. ఇటీవలే నెల క్రితం ఇంటికి వచ్చి తన కుటుంబ సభ్యులతో కలసి తీర్థ యాత్రలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు సాయి కృష్ణ. తిరిగి మళ్ళీ బ్రతుకు తెరువు కోసం 5 రోజుల క్రితం కువెట్ వెళ్ళాడం జరిగింది. అయితే...ఈ తరుణంలోనే... ఆదివారం సాయంత్రం అకస్మాత్తుగా గుండె పోటుతో మృతి చెందారు. ఈ విషయాన్ని తన సహచర స్నేహితులు ఫోన్ ద్వారా తన కుటుంబ సభ్యులకు తెలిపారు. దీంతో ఆ కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. మృతుడి పిల్లలు రోధించిన తీరు పలువురిని కంటతడి పెట్టించింది. ఇక మృతిడికి భార్య ఒక కుమారుడు, కుమార్తె ఉన్నారు.
--సాయి కిరణ్(మాగల్ఫ్ ప్రతినిధి)
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..