పోలీసుల అదుపులో జానీ మాస్టర్..
- September 19, 2024
బెంగుళూరు: పరారీలో ఉన్న ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. సైబరాబాద్ ఎస్వోటీ పోలీసులు ఆయన్ను బెంగుళూరు ఎయిర్ పోర్ట్ సమీపంలో అదుపులోకి తీసుకుని హైదరాబాద్ తరలిస్తున్నారని సమాచారం. కాగా, తనను జానీ మాస్టర్ లైంగికంగా వేధించాడని ఆయన దగ్గర పని చేసే మహిళా కొరియోగ్రాఫర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
అలాగే మతం మార్చుకొని పెళ్లి చేసుకోమ్మని బలవంతం చేసాడు అంటూ ఆరోపణలు చేస్తూ ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసుకొని విచారణ చేపట్టారు. దీంతో టాలీవుడ్ లో జానీ మాస్టర్ కేసు చర్చగా మరింది. అయితే ఈ ఆరోపణలు వచ్చిన దగ్గర్నుంచి జానీ మాస్టర్ కనపడట్లేదు. తాజాగా నేడు జానీ మాస్టర్ ని సైబరాబాద్ ఎస్ఓటి పోలీసులు బెంగుళూరులో అదుపులోకి తీసుకున్నారు. బెంగుళూరులో జానీ మాస్టర్ ని అదుపులోకి తీసుకొని హైదరాబాద్ కి తరలిస్తున్నారు.
తాజా వార్తలు
- కామారెడ్డి బాలల సంబరాల్లో పాల్గొన్న NATS
- నిరుద్యోగులకు సీఎం రేవంత్ శుభవార్త
- టీ20 ప్రపంచకప్కి టీమిండియా జెర్సీ విడుదల
- హైదరాబాద్ నడిబొడ్డు నుంచి ఎక్స్ప్రెస్ వే..
- WTITC: గ్లోబల్ స్టూడెంట్ ఇన్నోవేషన్ ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్
- యూఏఈలో ఫేక్ ఇన్వెస్టర్లు..ఇన్వెస్టర్లకు హెచ్చరిక..!!
- గాయపడ్డ ఆసియా ప్రవాసి ఎయిర్ లిఫ్ట్..!!
- పౌరుల సంక్షేమమే ప్రభుత్వ ప్రధానం: క్రౌన్ ప్రిన్స్
- ఖతార్ మ్యూజిమ్స్ లో సాంస్కృతిక, క్రియేటివిటీ ఈవెంట్లు..!!
- బహ్రెయిన్-ఇటలీ సంబంధాలు బలోపేతం..!!







