పోలీసుల అదుపులో జానీ మాస్టర్..
- September 19, 2024
బెంగుళూరు: పరారీలో ఉన్న ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. సైబరాబాద్ ఎస్వోటీ పోలీసులు ఆయన్ను బెంగుళూరు ఎయిర్ పోర్ట్ సమీపంలో అదుపులోకి తీసుకుని హైదరాబాద్ తరలిస్తున్నారని సమాచారం. కాగా, తనను జానీ మాస్టర్ లైంగికంగా వేధించాడని ఆయన దగ్గర పని చేసే మహిళా కొరియోగ్రాఫర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
అలాగే మతం మార్చుకొని పెళ్లి చేసుకోమ్మని బలవంతం చేసాడు అంటూ ఆరోపణలు చేస్తూ ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసుకొని విచారణ చేపట్టారు. దీంతో టాలీవుడ్ లో జానీ మాస్టర్ కేసు చర్చగా మరింది. అయితే ఈ ఆరోపణలు వచ్చిన దగ్గర్నుంచి జానీ మాస్టర్ కనపడట్లేదు. తాజాగా నేడు జానీ మాస్టర్ ని సైబరాబాద్ ఎస్ఓటి పోలీసులు బెంగుళూరులో అదుపులోకి తీసుకున్నారు. బెంగుళూరులో జానీ మాస్టర్ ని అదుపులోకి తీసుకొని హైదరాబాద్ కి తరలిస్తున్నారు.
తాజా వార్తలు
- ఇన్స్టాగ్రామ్ లో కొత్త ఫీచర్...
- ఎనిమిది బోర్డులకు డెవలప్మెంట్ అవార్డ్స్ ప్రకటించిన ICC
- హైమా నుండి నిజ్వాకు క్షతగాత్రుల ఎయిర్ లిఫ్ట్..!!
- డిపొర్టీస్ యూఏఈకి తిరిగి రావచ్చా? దరఖాస్తు ఎలా?
- శాశ్వతంగా కన్నుమూసిన ‘స్లీపింగ్ ప్రిన్స్’..!!
- ప్రపంచ వ్యాపార కేంద్రంగా సౌదీ అరేబియా..నైపుణ్య-ఆధారిత వర్క్ పర్మిట్..!!
- ప్రపంచంలోనే అతిపెద్ద ఉద్యానవనం.. "అతీన్ స్క్వేర్" ప్రారంభం..!!
- ఆకస్మిక తనిఖీలు.. 10 టన్నుల కుళ్లిన సీ ఫుడ్ సీజ్..!!
- తెలంగాణ సచివాలయంలో ఈ-పాస్ విధానం..
- హైదరాబాద్లో ఆగస్టు 10న 'రన్ ఫర్ SMA–2025'