శర్వానంద్ సైలెంట్ అయిపోయాడేం.!
- September 19, 2024
మినిమమ్ గ్యారంటీ హీరోల్లో శర్వానంద్ ఒకడు. ఒకప్పుడు విలక్షణ కథల్ని ఎంచుకునే శర్వానంద్ ‘రన్ రాజా రన్’ సినిమాతో ట్రాక్ మార్చేశాడు.
కామెడీ హీరో అవతారమెత్తాడు. సక్సెస్లూ చవి చూశాడు. అయితే వివాహానంతరం శర్వానంద్ కెరీర్ స్లో అయ్యింది. పెళ్లి తర్వాత పెద్దగా కొత్త ప్రాజెక్టులేమీ సైన్ చేసినట్లు లేడు.
ఇక, రీసెంట్గా వచ్చిన ‘మనమే’ని డిజాస్టర్ అనాలో, ఫెయిల్యూర్ అనాలో తెలియని పరిస్థితి. ధియేటర్లలో రిలీజైంది కానీ, నెలలు గడుస్తున్నా.. ఈ సినిమా ఎందుకో ఓటీటీలో రిలీజ్ కాలేదు. నిర్మాతల మధ్య గొడవలే ఇందుకు కారణంగా చెబుతున్నారు.
చిన్న సినిమాలు సైతం ఓటీటీలో ఈజీగా రిలీజ్ అవుతున్నాయ్. ధియేటర్లలో చెప్పుకోదగ్గ ఆదరణ పొందలేకపోయినప్పటికీ, ఓటీటీ ప్రేక్షకులు నచ్చితే బ్రహ్మరధం పడుతున్నారు.
అలాంటిది శర్వానంద్ సినిమా ఓటీటీలో ఇంతవరకూ రాకపోవమేంటో అర్ధం కావడం లేదు. ఆ సంగతి అటుంచితే, శర్వా కొత్త ప్రాజెక్ట్ సంపత్ నంది దర్శకత్వంలో వుండబోతోందనీ తెలుస్తోంది. ఇంత స్లోగా వుంటే కష్టమే మరి, శర్వా కాస్త స్పీడు పెంచాలని ఆయన అభిమానులు సూచిస్తున్నారు.
తాజా వార్తలు
- CBSE 12వ తరగతి బోర్డు పరీక్షలు వాయిదా..!!
- ఇరాన్ సుప్రీం లీడర్ నియామకంపై గందరగోళం
- గద్దర్ ఫిలిం అవార్డ్స్: విజేతల పూర్తి జాబితా ఇదే!
- బెంగళూరుకు రెండో అంతర్జాతీయ విమానాశ్రయం!
- సీఎం సమక్షంలో 124 మంది మావోయిస్టుల లొంగుబాటు
- క్షమించడండి అంటూ ఇరాన్ అధ్యక్షుడి కీలక ప్రకటన
- *బ్రేకింగ్: విమాన సర్వీసులను పునరుద్ధరించిన ఎమిరేట్స్! కన్ఫర్మ్డ్ టికెట్ ఉన్న ప్రయాణీకులకే!
- క్షతగాత్రులను పరామర్శించిన యుఏఈ అధ్యక్షుడు
- దుబాయ్ ఎయిర్పోర్ట్లో ఎటువంటి ప్రమాదాలు జరగలేదు: వదంతులను కొట్టిపారేసిన అధికారులు!
- అనుమతి లేకుండా ధరలు మారిస్తే.. QR1,000,000 ఫైన్..!!









