శర్వానంద్ సైలెంట్ అయిపోయాడేం.!
- September 19, 2024
మినిమమ్ గ్యారంటీ హీరోల్లో శర్వానంద్ ఒకడు. ఒకప్పుడు విలక్షణ కథల్ని ఎంచుకునే శర్వానంద్ ‘రన్ రాజా రన్’ సినిమాతో ట్రాక్ మార్చేశాడు.
కామెడీ హీరో అవతారమెత్తాడు. సక్సెస్లూ చవి చూశాడు. అయితే వివాహానంతరం శర్వానంద్ కెరీర్ స్లో అయ్యింది. పెళ్లి తర్వాత పెద్దగా కొత్త ప్రాజెక్టులేమీ సైన్ చేసినట్లు లేడు.
ఇక, రీసెంట్గా వచ్చిన ‘మనమే’ని డిజాస్టర్ అనాలో, ఫెయిల్యూర్ అనాలో తెలియని పరిస్థితి. ధియేటర్లలో రిలీజైంది కానీ, నెలలు గడుస్తున్నా.. ఈ సినిమా ఎందుకో ఓటీటీలో రిలీజ్ కాలేదు. నిర్మాతల మధ్య గొడవలే ఇందుకు కారణంగా చెబుతున్నారు.
చిన్న సినిమాలు సైతం ఓటీటీలో ఈజీగా రిలీజ్ అవుతున్నాయ్. ధియేటర్లలో చెప్పుకోదగ్గ ఆదరణ పొందలేకపోయినప్పటికీ, ఓటీటీ ప్రేక్షకులు నచ్చితే బ్రహ్మరధం పడుతున్నారు.
అలాంటిది శర్వానంద్ సినిమా ఓటీటీలో ఇంతవరకూ రాకపోవమేంటో అర్ధం కావడం లేదు. ఆ సంగతి అటుంచితే, శర్వా కొత్త ప్రాజెక్ట్ సంపత్ నంది దర్శకత్వంలో వుండబోతోందనీ తెలుస్తోంది. ఇంత స్లోగా వుంటే కష్టమే మరి, శర్వా కాస్త స్పీడు పెంచాలని ఆయన అభిమానులు సూచిస్తున్నారు.
తాజా వార్తలు
- తెలంగాణతో భాగస్వామ్యానికి గూగుల్ ఆసక్తి
- భారతీయ పారిశ్రామికవేత్తలతో ట్రంప్ సమావేశం
- మీ డ్రైవింగ్ లైసెన్స్లో మొబైల్ నంబర్ను ఆన్లైన్లో ఎలా మార్చాలో తెలుసా?
- పెట్టుబడులకు ఏపీకి మించిన రాష్ట్రం లేదు..దావోస్లో సీఎం చంద్రబాబు
- ఇంటి నుంచే FIR? తెలంగాణ పోలీసుల కొత్త నిర్ణయం
- రియాద్ సీజన్.. 14 మిలియన్లు దాటిన విజిటర్స్..!!
- షార్జాలో పెట్రోల్ స్టేషన్లపై పోలీసుల నిఘా..!!
- ఇండియా నుంచి చేపల దిగుమతికి అనుతించండి..!!
- ఖలీఫా బ్రిడ్జిపై ట్రక్ నిషేధం పొడిగింపు..ట్రాఫిక్ అథారిటీ క్లారిటీ..!!
- కేరళ పౌల్ట్రీ దిగుమతుల పై ఒమన్ నిషేధం..!!







