మెగాస్టార్ చిరంజీవికి మరో జాతీయ పురస్కారం
- September 20, 2024
హైదరాబాద్: మెగాస్టార్ చిరంజీవికి తన కెరీర్లో మరో మైలురాయి చేరుకున్నారు. ఆయనకు ఈ సంవత్సరం ఏయన్నార్ అవార్డు లభించింది. ఈ అవార్డును అమితాబ్ బచ్చన్ చేతుల మీదుగా అక్టోబర్ 28న అక్కినేని నాగేశ్వరరావు గారి కుమారుడైన నాగార్జున ప్రదానం చేయనున్నారు.
ఈ సందర్భంగా, నాగార్జున ఒక ముఖ్యమైన ప్రకటన చేశారు. ఇకపై, ఏయన్నార్ జాతీయ పురస్కారాన్ని ప్రతి రెండేళ్లకు ఒకసారి అందజేస్తామని తెలిపారు. ఈ అవార్డు భారతీయ సినిమా రంగంలో విశేష కృషి చేసిన వ్యక్తులకు గౌరవార్థం ఇవ్వబడుతుంది. చిరంజీవి ఈ అవార్డును పొందడం ఆయన అభిమానులకు మరియు తెలుగు సినిమా పరిశ్రమకు గర్వకారణం అని చిరంజీవిని పొగిడారు.
ఈ అవార్డును చిరంజీవికి అందించడం ద్వారా ఆయన చేసిన కృషికి మరింత గుర్తింపు లభిస్తుందని, అలాగే ఈ అవార్డు మరింత ప్రతిష్టాత్మకంగా మారుతుందని నాగార్జున అభిప్రాయపడ్డారు. ఈ ప్రకటనతో చిరంజీవి అభిమానులు మరియు తెలుగు సినిమా ప్రేమికులు ఎంతో ఆనందం వ్యక్తం చేశారు.
ఈ ప్రకటనను నాగార్జున సెప్టెంబర్ 15న హైదరాబాద్లోని అన్నపూర్ణ స్టూడియోస్లో నిర్వహించిన ఒక ప్రత్యేక కార్యక్రమంలో తెలిపారు.ఈ కార్యక్రమంలో సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖులు, మీడియా ప్రతినిధులు, మరియు అభిమానులు హాజరయ్యారు.
--వేణు పేరుమాళ్ల(మాగల్ఫ్ ప్రతినిధి)
తాజా వార్తలు
- తెలంగాణ: 'ఆర్థిక ఇబ్బందులున్నా వడ్డీ లేని రుణాలు'
- రైల్వే ప్రయాణికులకు బిగ్ రిలీఫ్..
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?