ఓటుకు నోటు కేసులో సీఎం రేవంత్కు రిలీఫ్
- September 20, 2024
హైదరాబాద్: ఓటుకు నోటు కేసులో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఊరట లభించింది. ఈ కేసులో బీఆర్ఎస్ నేత జగదీష్ రెడ్డి వేసిన పిటిషన్ కేవలం అపోహల మీద ఆధారపడి దాఖలైందని సుప్రీం కోర్టు పేర్కొంది. విచారణను ప్రభావితం చేశారనడానికి సరైన ఆధారాలు, సాక్ష్యాలు లేవని న్యాయస్థానం స్పష్టం చేసింది.
సుప్రీం కోర్టు, ఈ దశలో పిటిషన్ను ఎంటర్టైన్ చేయడం లేదని వెల్లడించింది. రేవంత్ రెడ్డి విచారణను ప్రభావితం చేస్తారన్న అపోహ తప్ప, ఆధారాలు లేవని పేర్కొంది. భవిష్యత్తులో సీఎం రేవంత్ రెడ్డి జోక్యం చేసుకుంటే పిటిషనర్ మళ్లీ సుప్రీం కోర్టును ఆశ్రయించవచ్చునని తీర్పునిచ్చింది.
అలాగే, ఈ కేసు ప్రాసిక్యూషన్లో సీఎం రేవంత్ జోక్యం చేసుకోవద్దని ఆదేశించింది. ఏసీబీ కూడా ఈ కేసు, ప్రాసిక్యూషన్కి సంబంధించి రేవంత్ రెడ్డికి రిపోర్ట్ చేయవద్దని స్పష్టం చేసింది. స్పెషల్ ప్రాసిక్యూటర్కి ఏసీబీ పూర్తి సహకారం ఇవ్వాలని తెలిపింది.
సుప్రీం కోర్టు జడ్జి పర్యవేక్షణలో ప్రాసిక్యూటర్ పనిచేయాలన్న అభ్యర్థనను కూడా తోసిపుచ్చింది. రేవంత్ రెడ్డి హోంమంత్రిగా ఉన్నారని, ఏసీబీ నేరుగా ఆయన పరిధిలోనే ఉంటుందన్న వాదనను సుప్రీం కోర్టు తిరస్కరించింది. ఈ తీర్పుతో సీఎం రేవంత్ రెడ్డి, ఆయన అనుచరులు ఊరట పొందారు. ఈ కేసు విచారణలో మరింత స్పష్టత రావాలని ఆశిస్తున్నారు.
--వేణు పెరుమాళ్ళ(మా గల్ఫ్ ప్రతినిధి)
తాజా వార్తలు
- ఏపీకి రెయిన్ అలర్ట్..ఈ జిల్లాల్లో భారీ వర్షాలు..
- ఇరాన్ డ్రోన్ దాడుల్లో గాయపడిన సైనికులను పరామర్శించిన కువైట్ ఆర్మీ చీఫ్
- ‘అమృత్ భారత్’ రైల్వే స్టేషన్లు ప్రారంభించిన ప్రధాని మోదీ
- మోదీ, చంద్రబాబు పాలనను ప్రశంసించిన కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్
- ఇరాన్ వైమానిక దాడులను భగ్నం చేసిన బహ్రెయిన్ రక్షణ దళం
- ఇరాన్ దాడితో కువైట్ విద్యుత్, నీటి డిస్టిలేషన్ ప్లాంట్కు నష్టం
- తిరుమలలో భక్తుల రద్దీ.. శ్రీవారి దర్శనానికి 30 గంటల నిరీక్షణ
- అమ్మ, నాన్నల ప్రోత్సాహంతో నీట్ లో 423 ర్యాంక్
- 230 కి.మీ. వేగంతో దూసుకెళ్లిన డ్రైవర్.. 50 వేల దిర్హామ్ జరిమానా..!!
- సౌదీ అరేబియాలో ఇద్దరు యెమెన్ ప్రవాసులు అరెస్ట్..!!







