TTD కార్యనిర్వహణ అధికారి శ్యామలరావు గురించి తెలుసుకుందాం...
- September 22, 2024
ఒక గొప్ప మెరిట్ స్టూడెంట్ ఆయన, ఎలా అంటే ఎంసెట్ లో 29 th ర్యాంక్.. తర్వాత కాకినాడ JNTU లో బీటెక్ ,అదవగానే IIT Mumbai నుండి ఎంటెక్... క్యాంపస్ సెలెక్షన్స్ లో BPCL లో ఉద్యోగం ,కొద్దిరోజుల్లోనే IES కి సెలెక్ట్ అయ్యారు. చదువే లక్ష్యం గెలవడమే తన ఆశయం అని కష్టపడితే తప్ప ఒక స్టూడెంట్ కి ఇవన్నీ సాధ్యం కాదు.కొన్నాళ్ళు AIR లో పనిచేసారు తర్వాత సౌత్ సెంట్రల్ రైల్వే కి వచ్చారు.97 లో ఐఏఎస్ కి సెలెక్ట్ అయ్యారు అదీ ఆల్ ఇండియా 34 th ర్యాంక్ . సివిల్స్ లో మేథ్స్ తీసుకున్న ఈయన స్కోర్ 100/100 .ఇప్పటి వరకూ ఈ ట్రాక్ రికార్డుకు చేరుకున్నవాళ్ళు లేరు.
అసోంలో పనిచేసారు తర్వాత ఆంధ్రప్రదేశ్ కి వచ్చారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో వైజాగ్ కలెక్టర్ గా పనిచేసి తర్వాత హైద్రాబాద్ మెట్రో వాటర్ బోర్డు ఎండీ గా చేసారు.ఆ తర్వాత కమర్షియల్ టాక్స్ కమిషనర్ గా చేసారు. వైజాగ్ కలెక్టర్ గా చేస్తునప్పుడు జెనిరీక్ మెడిసిన్స్ మీద అవగాహన పెంచి అందుబాటులోకి వచ్చేలా కృషి చేస్తే 3 లక్షల ఇంజెక్షన్ 70 వేలకి వచ్చింది అప్పుడు.ఆయన వాటికి "జీవనాధార" అని పేరు పెడితే తర్వాత రోజుల్లో ఆయుష్ అయ్యింది.
ఇండియా లో బయోమెట్రిక్ రావడం కోసం కష్టపడ్డారు ఎందుకంటే రిమోట్ ఏరియాలో స్కూల్స్ లో అటెండెన్స్ మానిటర్ చెయ్యడం కోసం.ఇంతటి విజయాలని తన ఖాతాలో గర్వం గా వేసుకున్న వ్యక్తి అతి సామాన్యం గా కనిపించే J.శ్యామలరావు టీటీడీ ఈవో.
తాజా వార్తలు
- ఇద్దరు ఇరానియన్ రివల్యూషనరీ గార్డ్ సెల్స్ అరెస్ట్: ఖతార్
- 166 మిస్సైల్స్, డ్రోన్లను ధ్వంసం చేశాం: బహ్రెయిన్
- కువైట్ పై దాడులకు తెగబడ్డ ఇరాన్..!!
- కువైట్లో సైనికుల మృతి పట్ల ఒమన్ సంతాపం..!!
- దౌత్యాధికారులకు ఇఫ్తార్ విందు ఇచ్చిన సౌదీ అరేబియా..!!
- డిస్టెన్స్ లెర్నింగ్ మార్చి 6 వరకు పొడిగించిన యూఏఈ..!!
- 1,000 కి పైగా ఇరానియన్ దాడులు: యూఏఈ
- అమెరికా కాన్సులేట్ పై డ్రోన్ అటాక్ పై దుబాయ్ క్లారిటీ..!!
- శరవేగంగా భోగాపురం, విజయవాడ ఎయిర్పోర్ట్లు.. కేంద్ర మంత్రి సమీక్ష
- 37 లక్షల మంది లబ్ధిదారులకు రూ.2,000 ప్రత్యేక నిధిని ప్రకటించిన స్టాలిన్









