చాద్ ఫీల్డ్ హాస్పిటల్పై దుర్వినియోగ ఆరోపణలు..తీవ్రంగా ఖండించిన ఎమిరేట్స్ రెడ్ క్రెసెంట్..!!
- September 28, 2024
యూఏఈ: చాద్లోని యుఎఇ ఫీల్డ్ హాస్పిటల్ దుర్వినియోగానికి పాల్పడుతుందన్న ఆరోపణలను ఎమిరేట్స్ రెడ్ క్రెసెంట్ (ఇఆర్సి) తీవ్రంగా ఖండించింది. చాడియన్ నగరమైన అమ్జారస్లోని ఆసుపత్రి "మానవతా కార్యకలాపాలకు కాకుండా ఇతర కార్యకలాపాలకు ఉపయోగించబడుతోంది" అని ఒక వార్తా కథనం పేర్కొంది. ERC మానవతా, స్వచ్ఛంద ప్రయత్నాలపై తప్పుడు ఆరోపణలు రావడం, రాజకీయం చేయడం కలవరపెడుతోందని ఒక ప్రకటనలో రెడ్ క్రెసెంట్ తెలిపింది.
ఇంటర్నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ రెడ్క్రాస్ అండ్ రెడ్ క్రెసెంట్ సొసైటీస్ (IFRC) అమ్జారస్ సౌకర్యాన్ని యాక్సెస్ చేయడానికి చేసిన అభ్యర్థనలను తిరస్కరించినట్లు ఆరోపణలను కూడా ERC తిరస్కరించింది. హాస్పిటల్ ప్రాంతానికి యాక్సెస్ హోస్ట్ దేశంలోని స్థానిక అధికారుల అధికార పరిధిలోకి వస్తుందన్నారు. జూలై 2023లో ఏర్పాటైన అమ్జాడ్రాస్ సదుపాయం వారి స్వదేశంలో సంఘర్షణ నుండి పారిపోతున్న సూడానీస్ శరణార్థులతో సహా బలహీన జనాభాకు మద్దతునిస్తోందన్నారు. ఏప్రిల్ 2023లో సుడాన్లో సంక్షోభం చెలరేగిన వెంటనే ఇది ఏర్పాటు చేయబడిందని ERC తెలిపింది. ఆసుపత్రిలో ఇప్పటివరకు 8,808 సూడానీస్, 19,658 చాడియన్లకు చికిత్స అందించినట్టు పేర్కొంది.
తాజా వార్తలు
- వెనిజులాలో భూకంపాల విధ్వంసం..మృతుల సంఖ్య 1,430కు చేరిక
- కరీంనగర్లో తొలి స్పేస్ ల్యాబ్ ప్రారంభించిన పారమిత హెరిటేజ్ పాఠశాల
- వాహనాల నిర్వహణను నిర్లక్ష్యం చేయొద్దు..దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- కార్మికుల భద్రతకు దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం
- సౌదీ అరేబియాకు వెళ్లే ప్రయాణికులకు బంగారం పై కొత్త నిబంధనలు
- కువైట్లో అతిపెద్ద వలస కార్మిక వర్గంగా భారతీయులు..!!
- హోర్ముజ్ లో నౌకాయాన స్వేచ్ఛపై సౌదీతో ఒమన్ చర్చలు..!!
- మరో 8మంది భారతీయుల మృతదేహాలు స్వదేశానికి తరలింపు..!!
- యూఏఈ మీడియేషన్ విజయాన్ని స్వాగతించిన బహ్రెయిన్..!!
- వెనిజులాకు యూఏఈ 10 మిలియన్ డాలర్ల తక్షణ సహాయం..!!







