ఖతార్ లో నేషనల్ పేషెంట్ సేఫ్టీ ఈవెంట్ రిపోర్టింగ్ సిస్టమ్ ప్రారంభం..!!
- September 29, 2024
దోహా: రోగులకు హాని కలిగించే సంఘటనలను విశ్లేషించడానికి, వాటి నుండి నేర్చుకోవడానికి నేషనల్ పేషెంట్ సేఫ్టీ ఈవెంట్ రిపోర్టింగ్ సిస్టమ్ను ప్రవేశపెట్టడానికి ప్రజారోగ్య మంత్రిత్వ శాఖ (MoPH) సిద్ధమవుతోంది. జాతీయ రిపోర్టింగ్ సిస్టమ్ రోగి భద్రతా సమస్యలను తెలసుకొని మెరుగైన చికిత్సలను అందజేయడానికి డాటా ఉపయోగపడుతుందని MoPH వద్ద నేషనల్ పేషెంట్ సేఫ్టీ ప్రోగ్రాం లీడ్ డాక్టర్ షిమోస్ మొహమ్మద్ తెలిపారు. కొత్త వ్యవస్థ జాతీయ స్థాయిలో మంత్రిత్వ శాఖకు స్థిరమైన రిపోర్టింగ్ను అనుమతిస్తుందని డాక్టర్ మహమ్మద్ అన్నారు. మొదటి దశలో నేషనల్ ఇన్సిడెంట్ లెర్నింగ్ రిపోర్టింగ్ సిస్టమ్ ఆరోగ్య నిపుణుల కోసం ఉంటుందని, అయితే రాబోయే దశలో ఇది ప్రజలకు అందుబాటులోకి తెస్తామని తెలిపారు. రోగుల భద్రతకు సంబంధించిన అన్ని రంగాల్లో చెప్పుకోదగ్గ పురోగతి ఉందని డాక్టర్ మహమ్మద్ వివరించారు.
తాజా వార్తలు
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..
- మోడీ కి ఘనంగా విషెస్ తెలిపిన బుర్జ్ ఖలీఫా
- సామాన్యుడి సైతం అందుబాటులో విమాన ప్రయాణం: కేంద్ర మంత్రి రామ్మోహన్
- సౌదీ అరేబియాలో నాలుగేళ్లలో వచ్చే బ్యాంకు సెలవులు..!!
- డ్యూటీ ఫ్రీ డ్రా.. $1 మిలియన్ గెలుచుకున్న కేరళ వాసి..!!
- యూనివర్శిటీ స్ట్రీట్లో రోడ్డు మూసివేత: అష్ఘల్
- కువైట్ లో భారత రాయబారి పనితీరుపై ప్రశంసలు..!!
- AI లో ఇండియా-బహ్రెయిన్ మధ్య సహకారం..!!
- మాదకద్రవ్యాల వాడకాన్ని తగ్గించేందుకు 'హయా' ప్లాట్ఫామ్..!!