సిరియా పై అమెరికా వైమానిక దాడులు..
- September 29, 2024
లెబనాన్లో ఇజ్రాయెల్ దాడులతో పశ్చిమాసియాలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఈ ఆందోళనల నేపథ్యంలో సిరియాలో అమెరికా బలగాలు వరుస వైమానిక దాడులతో విరుచుకుపడ్డాయి. యూఎస్ వైమానిక దాడుల్లో 37 మంది ఉగ్రవాదులను మట్టుబెట్టింది.
ఈ మేరకు యూఎస్ మిలటరీ ప్రకటించింది. తీవ్రవాద ఇస్లామిక్ స్టేట్ గ్రూప్, అల్ ఖైదాతో సంబంధం ఉన్న గ్రూపుతో అనుబంధంగా ఉన్న ఉగ్రవాదులను హతమార్చాయని మిలటరీ పేర్కొంది. హతమైన ఉగ్రవాదుల్లో ఇద్దరు సీనియర్ ఉగ్రవాదులేనని అమెరికా సెంట్రల్ కమాండ్ తెలిపింది.
అల్ఖైదాతో అనుబంధం ఉన్న హుర్రాస్ అల్-దీన్ గ్రూపునకు చెందిన సీనియర్ మిలిటెంట్తో పాటు మరో 8 మందిని లక్ష్యంగా చేసుకుని వాయువ్య సిరియాపై దాడి చేసినట్లు సైన్యం తెలిపింది. సైనిక కార్యకలాపాలను పర్యవేక్షించే బాధ్యత అతనిదేనని వెల్లడించింది. ఈ నెల ప్రారంభంలో సెప్టెంబరు 16 నుంచి వైమానిక దాడులను ప్రకటించారు. సెంట్రల్ సిరియాలోని రిమోట్ ప్రదేశంలో ఐఎస్ఐఎస్ శిక్షణా శిబిరంపై పెద్ద ఎత్తున వైమానిక దాడిని నిర్వహించారు.
అమెరికా వైమానిక దాడిలో కనీసం 8 సిరియన్ నాయకులు సహా 28 మంది తీవ్రవాదులు హతమయ్యారు. “అమెరికా ప్రయోజనాలకు, అలాగే మా మిత్రదేశాలు, భాగస్వాములకు వ్యతిరేకంగా కార్యకలాపాలు నిర్వహించే ఐఎస్ఐఎస్ సామర్థ్యానికి వైమానిక దాడి విఘాతం కలిగిస్తుంది” అని ప్రకటన పేర్కొంది. సిరియాలో దాదాపు 900 మంది సైనిక బలగాలను అమెరికా మోహరించింది. 2014లో ఇరాక్, సిరియాల మీదుగా విస్తరించి, పెద్ద భూభాగాన్ని స్వాధీనం చేసుకుంది.
తాజా వార్తలు
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ..
- ఖతర్లో భారతీయ రాయబారిగా తెలుగు దౌత్యవేత్త శ్రీకర్ రెడ్డి!
- సౌదీ అరేబియాతో 30 ఏళ్ల పౌర అణు ఒప్పందానికి డొనాల్డ్ ట్రంప్ ఆమోదం!
- గ్లోబల్ ఐకాన్స్ ఫోరం సొసైటీకి ఐఎస్వో 9001:2015 ప్రమాణీకృత సంస్థ గుర్తింపు
- కువైట్లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!







