బహ్రెయిన్ లో టూరిస్ట్ రెస్టారెంట్ల మూసివేత పై కొత్త నిబంధనలు..!!
- September 30, 2024
మనామా: కొత్త నిబంధనల ప్రకారం బహ్రెయిన్ టూరిజం రెస్టారెంట్లు 3:00 AM లోపు మూసివేయాల్సి ఉంటుంది. ప్రమాణాలు, భద్రతను మెరుగుపరచడానికి కఠినమైన లైసెన్సింగ్ నియమాలను అమలు చేస్తునట్టు అధికారులు తెలిపారు. హోటళ్లు, ఇండిపెండెంట్ టూరిస్ట్ రెస్టారెంట్లలో ఆహార పానీయాల సేవలు నిర్ణీత సమయంలోపు తమ కార్యకలాపాలను నిలిపివేయాలని పర్యాటక మంత్రి ఫాతిమా బింట్ అల్ సైరాఫీ సూచించారు.
కొత్త నిబంధనల ప్రకారం.. పర్యాటక సౌకర్యాలు నిర్ణీత సమయానికి అన్ని కార్యకలాపాలను నిలిపివేయాలి. ఒకటి నుండి ఆరు కేటగిరీలకు ఉదయం 2:30 నుండి ఉదయం 12:00 గంటల వరకు, ఏడు కేటగిరీలకు ఉదయం 2:30 నుండి సాయంత్రం 6:00 గంటల వరకు ప్రత్యక్ష ప్రదర్శనలను నిలిపివేయాలి. అలాగే, స్వతంత్ర పర్యాటక రెస్టారెంట్లు తమ కార్యకలాపాలు ప్రారంభించే ముందు తప్పనిసరిగా బహ్రెయిన్ టూరిజం అండ్ ఎగ్జిబిషన్స్ అథారిటీ (BTEA) నుండి లైసెన్స్ పొందాలని ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు.
తాజా వార్తలు
- బాసర ఆలయాభివృద్ధి పనులకు సీఎం రేవంత్ భూమిపూజ |
- ఖతార్ ప్రధానికి భారత విదేశాంగ మంత్రి జైశంకర్ ఫోన్
- ఏప్రిల్ 10 నుంచి యూపీఐ తప్పనిసరి
- తారామతి బారాదరిలో ‘మోర్ దేన్ ఫ్రెండ్స్’ పార్టీ పై ఈగల్ పోలీసుల దాడులు
- భారత్-ఇజ్రాయెల్ విమాన సర్వీసుల నిలిపివేత
- సెయింట్ లూయిస్ ఫుడ్ బ్యాంక్లో ‘NATS’ సేవలు
- మోసగాళ్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని ఆర్ఓపి హెచ్చరిక..!!
- Metrash ద్వారా రెసిడెన్స్ పర్మిట్ పునరుద్ధరించే విధానం..!!
- డ్రోన్ దాడిలో దెబ్బతిన్న ప్రాంతాలను పరిశీలించిన ఆర్థిక మంత్రి..!!
- భారీ బడ్జెట్ తో స్మార్ట్ క్లాస్రూమ్ ప్రాజెక్ట్ ను ప్రారంభించిన ISB..!!









