మీ ఇంట్లో వాడే నెయ్యి శుద్ధమేనా తెలుసుకోవడమెలా.?
- September 30, 2024
ఈ మధ్య తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదానికి సంబంధించి జరుగుతున్న వివాదం బహుశా అందరికీ తెలిసిందే. దేశాన్నే కుదిపేసిన అంశమిది. హిందూ సనాతన ధర్మానికి మాయని మచ్చలా తయారైన దుస్థితి.
పరమ పవిత్రమైన తిరుమల లడ్డూ ప్రసాదంలో జంతువుల కొవ్వు అవశేషాలు కలిసాయని నివేదికలో తేలడంతో ఈ విషయం దేశాన్ని అతలాకుతలం చేసింది. ప్రతీ హిందువుకీ రక్తం మరిగిపోయింది.
తనవంతుగా ఈ అంశానికి సంబంధించి గొంతుక వినిపించారు. ఆ సంగతి అటుంచితే.. ఒకప్పుడు నెయ్యి ఇంట్లోనే తయారు చేసుకునేవాళ్లం. కానీ, ఇప్పుడు పరిస్థితి వేరే. మార్కెట్లో లభించే రకరకాల బ్రాండెడ్ నెయ్యిని కొనుగోలు చేసి వినియోగించుకోవల్సి వస్తోంది.
అయితే, మనం కొనే నెయ్యి ఎంత మాత్రం సేఫ్.? ఎలా గుర్తించడం.? అందుకోసం కొన్ని టిప్స్ ఇప్పుడు తెలుసుకుందాం.
స్వచ్ఛమైన నెయ్యికి మంచి సువాసన వుంటుంది. అది తెలిసిన సంగతే. అలాగే, స్వచ్ఛమైన నెయ్యి వేడి చేయగానే తొందరగా కరిగిపోతుంది. కానీ, కల్తీ నెయ్యి వేడి చేసినా అంత త్వరగా కరగదు. అలాగే వేడి చేసిన నెయ్యి ఎల్లో కలర్లోకి మారితే అది కల్లీ నెయ్యి కిందే భావించాలి. స్వచ్ఛమైన నెయ్యివేడి చేయగానే బ్రౌన్ రంగులోకి మారుతుంది.
కొద్దిగా నెయ్యి తీసుకుని అందులో కొంచెం సాల్ట్ వేసి చూస్తే.. కలర్ మారకపోతే అది స్వచ్ఛమైన నెయ్యి. సాల్ట్ వేసిన చోట నీలి రంగులోకి మారితే.. ఆ నెయ్యి కల్తీ అయ్యిందని అర్ధం.
అలాగే కాచి చల్లార్చిన నెయ్యిని ఫ్రిజ్లో పెడితే, కాస్సేపటికి దానిపై ఓ లేయర్లా ఫామ్ అవుతుంది. అది కూడా కల్తీ నెయ్యిగానే భావించాలి. నీటితోనూ కల్తీ నెయ్యిని కనిపెట్టొచ్చు. ఓ గ్లాస్ నీటిలో కొన్ని చుక్కలు నెయ్యి వేసి చూస్తే.. నెయ్యి వెంటనే తేలితే అది స్వచ్చమైనదిగా గుర్తించొచ్చు.
స్వచ్ఛమైన నెయ్యిని తింటే ఎలాంటి ఆరోగ్య సమస్యలుండవ్. కానీ, కల్తీ నేతిని తినడం వల్ల జీర్ణ సంబంధిత సమస్యలతో పాటూ, గుండె సంబంధిత సమస్యలు కూడా వచ్చే ప్రమాదముంది. సో, తస్మాత్ జాగ్రత్త.!
తాజా వార్తలు
- ఏపీకి రెయిన్ అలర్ట్..ఈ జిల్లాల్లో భారీ వర్షాలు..
- ఇరాన్ డ్రోన్ దాడుల్లో గాయపడిన సైనికులను పరామర్శించిన కువైట్ ఆర్మీ చీఫ్
- ‘అమృత్ భారత్’ రైల్వే స్టేషన్లు ప్రారంభించిన ప్రధాని మోదీ
- మోదీ, చంద్రబాబు పాలనను ప్రశంసించిన కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్
- ఇరాన్ వైమానిక దాడులను భగ్నం చేసిన బహ్రెయిన్ రక్షణ దళం
- ఇరాన్ దాడితో కువైట్ విద్యుత్, నీటి డిస్టిలేషన్ ప్లాంట్కు నష్టం
- తిరుమలలో భక్తుల రద్దీ.. శ్రీవారి దర్శనానికి 30 గంటల నిరీక్షణ
- అమ్మ, నాన్నల ప్రోత్సాహంతో నీట్ లో 423 ర్యాంక్
- 230 కి.మీ. వేగంతో దూసుకెళ్లిన డ్రైవర్.. 50 వేల దిర్హామ్ జరిమానా..!!
- సౌదీ అరేబియాలో ఇద్దరు యెమెన్ ప్రవాసులు అరెస్ట్..!!







