అమెరికా వెళ్లే భారతీయులకు శుభవార్త..
- September 30, 2024
అమెరికా:అమెరికా వెళ్లాలని అనుకునే భారతీయులకు అగ్రరాజ్యం మరో గుడ్ న్యూస్ చెప్పింది. అదనంగా 2.5 లక్షల వీసా అపాయింట్మెంట్లను అందుబాటులో ఉంచుతున్నట్లు తెలిపింది.
పర్యటకులు, నైపుణ్యం కలిగిన కార్మికులతో పాటు స్టూడెంట్స్ కు ఇవి దోహదం చేస్తాయని చెప్పుకొచ్చింది. ఈ మేరకు భారత్లోని అమెరికా రాయబార కార్యాలయం సోషల్ మీడియా వేదికగా ఓ ప్రకటనను రిలీజ్ చేసింది.
కాగా, తాజాగా రిలీజ్ చేసిన స్లాట్ల వల్ల వేలాది మంది భారతీయులు సకాలంలో ఇంటర్వ్యూలు పొందడానికి హెల్ప్ చేస్తుందని అమెరికా రాయబార కార్యాలయం చెప్పుకొచ్చింది. అంతేకాకుండా అమెరికా- భారత్ సంబంధాలను మరింత బలోపేతం చేయడంతో పాటు ప్రయాణాన్ని సులభతరం చేస్తుందని తెలిపింది. వరుసగా రెండో ఏడాది కూడా పది లక్షలకు పైగా నాన్ ఇమ్మిగ్రెంట్ వీసా అపాయింట్మెంట్లను యూఎస్ ఎంబసీ చేపట్టింది. ప్రస్తుతం కుటుంబీకులు, బిజినెస్, పర్యటకులపై అమెరికా దృష్టి సారించింది.
అలాగే, గతేడాది మాదిరిగానే ఈసారి కూడా భారీ సంఖ్యలో విద్యార్థి వీసాలు జారీ చేయబోతున్నట్లు అమెరికా రాయబార కార్యాలయం చెప్పుకొచ్చింది. అయితే, ఇప్పటి వరకు ఎన్ని జారీ చేసిందనే విషయంపై యూఎస్ ఎంబసీ క్లారిటీ ఇవ్వలేదు. 2023లో మాత్రం 1.4 లక్షల మంది ఇండియన్ స్టూడెంట్స్ కు వీసాలు ఇచ్చింది అమెరికా.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో నాలుగేళ్లలో వచ్చే బ్యాంకు సెలవులు..!!
- డ్యూటీ ఫ్రీ డ్రా.. $1 మిలియన్ గెలుచుకున్న కేరళ వాసి..!!
- యూనివర్శిటీ స్ట్రీట్లో రోడ్డు మూసివేత: అష్ఘల్
- కువైట్ లో భారత రాయబారి పనితీరుపై ప్రశంసలు..!!
- AI లో ఇండియా-బహ్రెయిన్ మధ్య సహకారం..!!
- మాదకద్రవ్యాల వాడకాన్ని తగ్గించేందుకు 'హయా' ప్లాట్ఫామ్..!!
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!