అమెరికా వెళ్లే భారతీయులకు శుభవార్త..
- September 30, 2024
అమెరికా:అమెరికా వెళ్లాలని అనుకునే భారతీయులకు అగ్రరాజ్యం మరో గుడ్ న్యూస్ చెప్పింది. అదనంగా 2.5 లక్షల వీసా అపాయింట్మెంట్లను అందుబాటులో ఉంచుతున్నట్లు తెలిపింది.
పర్యటకులు, నైపుణ్యం కలిగిన కార్మికులతో పాటు స్టూడెంట్స్ కు ఇవి దోహదం చేస్తాయని చెప్పుకొచ్చింది. ఈ మేరకు భారత్లోని అమెరికా రాయబార కార్యాలయం సోషల్ మీడియా వేదికగా ఓ ప్రకటనను రిలీజ్ చేసింది.
కాగా, తాజాగా రిలీజ్ చేసిన స్లాట్ల వల్ల వేలాది మంది భారతీయులు సకాలంలో ఇంటర్వ్యూలు పొందడానికి హెల్ప్ చేస్తుందని అమెరికా రాయబార కార్యాలయం చెప్పుకొచ్చింది. అంతేకాకుండా అమెరికా- భారత్ సంబంధాలను మరింత బలోపేతం చేయడంతో పాటు ప్రయాణాన్ని సులభతరం చేస్తుందని తెలిపింది. వరుసగా రెండో ఏడాది కూడా పది లక్షలకు పైగా నాన్ ఇమ్మిగ్రెంట్ వీసా అపాయింట్మెంట్లను యూఎస్ ఎంబసీ చేపట్టింది. ప్రస్తుతం కుటుంబీకులు, బిజినెస్, పర్యటకులపై అమెరికా దృష్టి సారించింది.
అలాగే, గతేడాది మాదిరిగానే ఈసారి కూడా భారీ సంఖ్యలో విద్యార్థి వీసాలు జారీ చేయబోతున్నట్లు అమెరికా రాయబార కార్యాలయం చెప్పుకొచ్చింది. అయితే, ఇప్పటి వరకు ఎన్ని జారీ చేసిందనే విషయంపై యూఎస్ ఎంబసీ క్లారిటీ ఇవ్వలేదు. 2023లో మాత్రం 1.4 లక్షల మంది ఇండియన్ స్టూడెంట్స్ కు వీసాలు ఇచ్చింది అమెరికా.
తాజా వార్తలు
- యూఏఈలో ఆన్లైన్ ట్రేడింగ్ స్కామ్లకు బలవుతున్న ఇన్వెస్టర్లు..!!
- ఇరాన్పై ఇజ్రాయెల్ దాడి.. తీవ్రంగా ఖండించిన ఒమన్..!!
- సార్ కారు ప్రమాదం.. మూడుకు చెరిన మృతుల సంఖ్య..!!
- స్పెషల్ ఆపరేషన్.. ఖైతాన్లో 20 మంది ప్రవాసులు అరెస్టు..!!
- యూఏఈ ఉద్దేశపూర్వకంగా 3 నౌకలను ఎందుకు ముంచివేసిందంటే..!!
- సౌదీ అరేబియాలో 2,400 మందికి పైగా స్మగ్లర్లు అరెస్టు..!!
- ఈ కార్ రేసు కేసులో కెటిఆర్ కు ఎసిబి పిలుపు
- మొబైల్ వినియోగదారులకి టెలికాం శాఖ గుడ్ న్యూస్
- హైదరాబాద్ లో రెచ్చిపోతున్న రాజస్థాన్ దొంగలు
- ఇరాన్పై ఇజ్రాయెల్ వార్..ముడి చమురు ధరలకు రెక్కలు!