తిరుమలకు చేరుకున్న డిప్యూటీ సీఎం..
- October 01, 2024
తిరుమల: తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి వారి దర్శనార్ధం డిప్యూటి సీఎం పవన్కళ్యాణ్ మంగళవారం సాయంత్రం రేణిగుంట విమానాశ్రం చేరుకున్నారు. అక్కడి నుంచి ఆయన రోడ్డు మార్గాన అలిపిరికి చేరుకున్నారు. అక్కడ వందలాదిగా గుమికూడిన అభిమాలను చూసి కొంతసేపు ఆలోచించి యాత్రికుల ఇబ్బందుల గురించి అధికారులతో చర్చించారు.
అనంతరం మొక్కు తీర్చుకోవాలనే ఉద్దేశ్యంతో అలిపిరి మెట్లమార్గాన తిరుమలకు బయలుదేరి రాత్రికి తురుమలకు చేరుకున్నారు. కాగా అక్కడక్కడా నడకదారిలో అలిసిసొలసిపోయారు. గాలిగోపురం వద్ద నడవడానికి కొంతమేర ఇబ్బందులు పడ్డారు. కొంతమంది భక్తబృందం ఆంజనేయస్వామి జెండాను గాలిగోపురం వద్ద డిప్యూటి సీఎంకు అందించారు.
అలిపిరి నడకమార్గంలో డిప్యూటి సీఎం జై శ్రీరామ్, గోవింద గోవింద అంటూ నామస్మరణ చేసుకుంటూ రాత్రి 9.30 గంటలకు వచ్చారు. పద్మావతి అతిథిగృహాలలోని గాయిత్రి అతిథిగృహం వద్ద డిప్యూటి సీఎంకు రిసెప్షన్ అధికారులు పుష్పగుచ్చం అందచేసి ఘనంగా స్వాగతం పలికారు.
రాత్రి ఆయన తిరుమలలోనే బసచేసి బుధవారం ఉదయం శ్రీవారిని దర్శించుకుని ప్రాయశ్చిత్త దీక్ష విరమణ చేస్తారు. అనంతరం వెంగమాంబ అన్నప్రసాద కేంద్రంలో ఆహారం తీసుకుని, లడ్డూలకు అవసమైన ముడిసరుకులు నిల్వవుంచే గోదామును పరిశీలించనున్నారు. కాగా పవన్కళ్యాణ్ను చూసేందుకు భారీసంఖ్యలో అభిమానులు గుమికూడారు.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో నాలుగేళ్లలో వచ్చే బ్యాంకు సెలవులు..!!
- డ్యూటీ ఫ్రీ డ్రా.. $1 మిలియన్ గెలుచుకున్న కేరళ వాసి..!!
- యూనివర్శిటీ స్ట్రీట్లో రోడ్డు మూసివేత: అష్ఘల్
- కువైట్ లో భారత రాయబారి పనితీరుపై ప్రశంసలు..!!
- AI లో ఇండియా-బహ్రెయిన్ మధ్య సహకారం..!!
- మాదకద్రవ్యాల వాడకాన్ని తగ్గించేందుకు 'హయా' ప్లాట్ఫామ్..!!
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!