తిరుమలకు చేరుకున్న డిప్యూటీ సీఎం..
- October 01, 2024
తిరుమల: తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి వారి దర్శనార్ధం డిప్యూటి సీఎం పవన్కళ్యాణ్ మంగళవారం సాయంత్రం రేణిగుంట విమానాశ్రం చేరుకున్నారు. అక్కడి నుంచి ఆయన రోడ్డు మార్గాన అలిపిరికి చేరుకున్నారు. అక్కడ వందలాదిగా గుమికూడిన అభిమాలను చూసి కొంతసేపు ఆలోచించి యాత్రికుల ఇబ్బందుల గురించి అధికారులతో చర్చించారు.
అనంతరం మొక్కు తీర్చుకోవాలనే ఉద్దేశ్యంతో అలిపిరి మెట్లమార్గాన తిరుమలకు బయలుదేరి రాత్రికి తురుమలకు చేరుకున్నారు. కాగా అక్కడక్కడా నడకదారిలో అలిసిసొలసిపోయారు. గాలిగోపురం వద్ద నడవడానికి కొంతమేర ఇబ్బందులు పడ్డారు. కొంతమంది భక్తబృందం ఆంజనేయస్వామి జెండాను గాలిగోపురం వద్ద డిప్యూటి సీఎంకు అందించారు.
అలిపిరి నడకమార్గంలో డిప్యూటి సీఎం జై శ్రీరామ్, గోవింద గోవింద అంటూ నామస్మరణ చేసుకుంటూ రాత్రి 9.30 గంటలకు వచ్చారు. పద్మావతి అతిథిగృహాలలోని గాయిత్రి అతిథిగృహం వద్ద డిప్యూటి సీఎంకు రిసెప్షన్ అధికారులు పుష్పగుచ్చం అందచేసి ఘనంగా స్వాగతం పలికారు.
రాత్రి ఆయన తిరుమలలోనే బసచేసి బుధవారం ఉదయం శ్రీవారిని దర్శించుకుని ప్రాయశ్చిత్త దీక్ష విరమణ చేస్తారు. అనంతరం వెంగమాంబ అన్నప్రసాద కేంద్రంలో ఆహారం తీసుకుని, లడ్డూలకు అవసమైన ముడిసరుకులు నిల్వవుంచే గోదామును పరిశీలించనున్నారు. కాగా పవన్కళ్యాణ్ను చూసేందుకు భారీసంఖ్యలో అభిమానులు గుమికూడారు.
తాజా వార్తలు
- రేపు కూటమి సర్కార్ తొలి వార్షికోత్సవ సభ
- ఒమాన్లో 2028 నుండి 5% వ్యక్తిగత ఆదాయ పన్ను
- ముంబై విమానాశ్రయంలో భారీగా బంగారం సీజ్..
- రాజకీయ ప్రవేశం పై ఊహాగానాలకు తెరదించిన సౌరవ్ గంగూలీ
- ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధం: స్థిరంగా యూఏఈ ఎయిర్ ట్రాఫిక్..సౌదీలో రెట్టింపు..!!
- సంక్షోభంలో మానవత్వం..ఇరాన్పై అమెరికా దాడిని ఖండించిన ప్రపంచ దేశాలు..!!
- ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధంలోకి అమెరికా ఎంట్రీ.. 3 అణు కేంద్రాలపై దాడులు..!!
- విలాయత్ బర్కాలో అగ్నిప్రమాదం..సీడీఏఏ
- ప్రపంచవ్యాప్తంగా పాస్వర్డ్లు హ్యాక్.. ఐటీ భద్రతను పెంచాలన్న కంపెనీలు..!!
- ఇరాన్పై ఇజ్రాయెల్ ది దురాక్రమణ..సౌదీ అరేబియా