నిహాన్ హిడాంక్యో సంస్థకు నోబెల్ శాంతి బహుమతి-2024
- October 11, 2024
టోక్యో: జపాన్కు చెందిన నిహాన్ హిడాంక్యో సంస్థకు ఈ ఏడాది నోబెల్ శాంతి బహుమతి దక్కింది. అణ్వాయుధ రహితంగా ప్రపంచాన్ని మార్చేందుకు ఆ సంస్థ చేసిన ప్రయత్నాలకుగాను ఈ బహుమతి అందుకోనుంది.ఆ సంస్థకు నోబెల్ శాంతి బహుమతి ఇస్తున్నట్లు స్టాక్హోంలోని కరోలిన్స్కా ఇన్స్టిట్యూట్ నోబెల్ టీమ్ ప్రకటన చేసింది.
నోబెల్ శాంతి బహుమతిని ప్రకటిస్తూ.. గతంలో హిరోషిమా, నాగసాకిలో అణుబాంబు దాడి నుంచి ప్రాణాలతో బయటపడ్డవారిని గుర్తుచేసుకుంది. వారు పొందిన ఆ అనుభవం ద్వారా శాంతి స్థాపన కోసం ఆశను పెంపొందించారని చెప్పింది.
కాగా, గత ఏడాది నోబెల్ శాంతి బహుమతి నర్గేస్ మొహమ్మదీకి దక్కిన విషయం తెలిసిందే. ఇరాన్లో మహిళలపై అణచివేతకు వ్యతిరేకంగా ఆమె పోరాటం చేయడం, మానవ హక్కులు, అందరికీ స్వేచ్ఛను ప్రోత్సహించడానికి ఆమె చేసిన ప్రయత్నాలకు ఈ బహుమతి దక్కించుకున్నారు.అతి పిన్న వయసు(17 ఏళ్ల వయసులో)లో నోబెల్ శాంతి బహుమతి అందుకున్న వ్యక్తిగా మలాలా యూసఫ్జాయ్ కొనసాగుతున్నారు.
తాజా వార్తలు
- అటల్ స్మతిన్యాస్ సొసైటీ కార్యచరణ గురించి పలువురితో చర్చించిన వెంకయ్య నాయుడు
- భారీ నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు
- విలువలతో కూడిన రాజకీయాల్లోకి యువత రావాలి: వెంకయ్య నాయుడు
- అమరావతిలో బిట్స్ పిలాని నిర్మాణ ప్లాన్ లను పరిశీలించిన మంత్రి లోకేష్
- అమెరికా విమానం కూలిన ఘటనలో నలుగురు మృతి
- కువైట్లో ఉరుములతో కూడిన వర్షాలు..!!
- చార్టర్డ్ విమానాలను నిర్వహిస్తున్న ఇండియన్ అసొసియేషన్స్..!!
- ఆహార వస్తువుల సరఫరా, ధరలపై ఆందోళన వద్దు..!!
- యాస్ ఐలాండ్ లో అటానమస్ టాక్సీల విస్తరణ..!!
- మక్కా, మదీనాలోని భవన యజమానులకు హెచ్చరిక జారీ..!!









