నిహాన్ హిడాంక్యో సంస్థకు నోబెల్ శాంతి బహుమతి-2024
- October 11, 2024
టోక్యో: జపాన్కు చెందిన నిహాన్ హిడాంక్యో సంస్థకు ఈ ఏడాది నోబెల్ శాంతి బహుమతి దక్కింది. అణ్వాయుధ రహితంగా ప్రపంచాన్ని మార్చేందుకు ఆ సంస్థ చేసిన ప్రయత్నాలకుగాను ఈ బహుమతి అందుకోనుంది.ఆ సంస్థకు నోబెల్ శాంతి బహుమతి ఇస్తున్నట్లు స్టాక్హోంలోని కరోలిన్స్కా ఇన్స్టిట్యూట్ నోబెల్ టీమ్ ప్రకటన చేసింది.
నోబెల్ శాంతి బహుమతిని ప్రకటిస్తూ.. గతంలో హిరోషిమా, నాగసాకిలో అణుబాంబు దాడి నుంచి ప్రాణాలతో బయటపడ్డవారిని గుర్తుచేసుకుంది. వారు పొందిన ఆ అనుభవం ద్వారా శాంతి స్థాపన కోసం ఆశను పెంపొందించారని చెప్పింది.
కాగా, గత ఏడాది నోబెల్ శాంతి బహుమతి నర్గేస్ మొహమ్మదీకి దక్కిన విషయం తెలిసిందే. ఇరాన్లో మహిళలపై అణచివేతకు వ్యతిరేకంగా ఆమె పోరాటం చేయడం, మానవ హక్కులు, అందరికీ స్వేచ్ఛను ప్రోత్సహించడానికి ఆమె చేసిన ప్రయత్నాలకు ఈ బహుమతి దక్కించుకున్నారు.అతి పిన్న వయసు(17 ఏళ్ల వయసులో)లో నోబెల్ శాంతి బహుమతి అందుకున్న వ్యక్తిగా మలాలా యూసఫ్జాయ్ కొనసాగుతున్నారు.
తాజా వార్తలు
- ఈద్ అల్-అధా శుభాకాంక్షలు తెలిపిన భారత రాయబారి పరామిత త్రిపాఠి..!!
- సుల్తాన్ ఖబూస్ మస్జీదులో ఈద్ ప్రార్థనలు చేసిన సుల్తాన్..!!
- మినాలో భద్రతను సమీక్షించిన ఇంటీరియర్ మినిస్టర్..!!
- లుసైల్ ప్యాలెస్లో ఈద్ అల్-అధా వేడుకల్లో పాల్గొన్న అమీర్..!!
- మనామా సూక్లో ఈద్ సందడి..జోరుగా సాగిన కొనుగోళ్లు..!!
- ఈద్ అల్ అదా వేడుకలకు కొత్త వెలుగులు నింపిన నవజాత శిశువులు..!!
- తెలంగాణలో 3 రోజులు రెడ్ అలర్ట్
- సరికొత్త డిజిటల్ హంగులతో ‘మహానాడు 2026’ జెండా ఆవిష్కరించిన సీఎం చంద్రబాబు!
- శ్రీలంక వెళ్లే భారతీయులకు గుడ్ న్యూస్
- డ్రైవింగ్ చేస్తూ ఈద్ శుభాకాంక్షలు పంపొద్దు: అబుదాబి పోలీసుల హెచ్చరిక









