నిహాన్ హిడాంక్యో సంస్థకు నోబెల్ శాంతి బహుమతి-2024
- October 11, 2024
టోక్యో: జపాన్కు చెందిన నిహాన్ హిడాంక్యో సంస్థకు ఈ ఏడాది నోబెల్ శాంతి బహుమతి దక్కింది. అణ్వాయుధ రహితంగా ప్రపంచాన్ని మార్చేందుకు ఆ సంస్థ చేసిన ప్రయత్నాలకుగాను ఈ బహుమతి అందుకోనుంది.ఆ సంస్థకు నోబెల్ శాంతి బహుమతి ఇస్తున్నట్లు స్టాక్హోంలోని కరోలిన్స్కా ఇన్స్టిట్యూట్ నోబెల్ టీమ్ ప్రకటన చేసింది.
నోబెల్ శాంతి బహుమతిని ప్రకటిస్తూ.. గతంలో హిరోషిమా, నాగసాకిలో అణుబాంబు దాడి నుంచి ప్రాణాలతో బయటపడ్డవారిని గుర్తుచేసుకుంది. వారు పొందిన ఆ అనుభవం ద్వారా శాంతి స్థాపన కోసం ఆశను పెంపొందించారని చెప్పింది.
కాగా, గత ఏడాది నోబెల్ శాంతి బహుమతి నర్గేస్ మొహమ్మదీకి దక్కిన విషయం తెలిసిందే. ఇరాన్లో మహిళలపై అణచివేతకు వ్యతిరేకంగా ఆమె పోరాటం చేయడం, మానవ హక్కులు, అందరికీ స్వేచ్ఛను ప్రోత్సహించడానికి ఆమె చేసిన ప్రయత్నాలకు ఈ బహుమతి దక్కించుకున్నారు.అతి పిన్న వయసు(17 ఏళ్ల వయసులో)లో నోబెల్ శాంతి బహుమతి అందుకున్న వ్యక్తిగా మలాలా యూసఫ్జాయ్ కొనసాగుతున్నారు.
తాజా వార్తలు
- మనీలాండరింగ్ కేసు..ఇంటర్పోల్ రెడ్ నోటీసుతో UAEలో అంతర్జాతీయ ముఠా నాయకుడి అరెస్ట్
- షార్జాలో మహిళ మృతి.. నేరపూరిత ఘటనకు ఆధారాలు లేవన్న పోలీసులు
- విదేశీ పెట్టుబడులను ఆకర్షించేందుకు ‘సిటీ’ సరికొత్త సేవలకు శ్రీకారం
- సౌదీలో డ్రోన్ను అడ్డుకునే క్రమంలో శకలాలు పడి ఒకరి మృతి
- మచిలీపట్నంలో ఘనంగా ప్రధాని మోదీ జన్మదిన వేడుకలు..
- షేక్ జాయెద్ గ్రాండ్ మసీద్ సందర్శనకు కొత్త ప్రవేశ రుసుము
- మహనీయుల పోరాటాలు యువతకు స్ఫూర్తిదాయకం: ఉపరాష్ట్రపతి
- దుబాయ్లో కొత్త 80 కి.మీ రోడ్డు కారిడార్.. ట్రాఫిక్ రద్దీకి చెక్
- ఖతార్లో చికెన్, కొన్ని కూరగాయలపై కస్టమ్స్ డ్యూటీ పెంపు..!!
- బహ్రెయిన్లో తెలియని వాట్సాప్ ఛారిటీకి డబ్బులు పంపొద్దు..!!







