భారత్-బహ్రెయిన్ బంధం బలోపేతం..పెట్టుబడుల్లో పెరుగుదల..!!
- October 11, 2024
మనామా: బహ్రెయిన్లోని భారత రాయబార కార్యాలయం, బహ్రెయిన్ ఇండియా సొసైటీ (BIS)తో కలిసి మనామాలోని క్రౌన్ ప్లాజాలో “ద్వైపాక్షిక పెట్టుబడులపై దృష్టి పెట్టడం” అనే కార్యక్రమాన్ని నిర్వహించింది. ప్రారంభోత్సవ కార్యక్రమంలో భారత రాయబారి వినోద్ కె జాకబ్ మాట్లాడుతూ.. 2024లో భారతదేశం-బహ్రెయిన్ ద్వైపాక్షిక సంబంధాలు విజయవంతంగా ముందుకు సాగుతున్నాయని తెలియజేసారు. 2019 నుండి పెట్టుబడులలో 40 శాతం పెరుగుదల ఉందని, ప్రస్తుతం $1.62 బిలియన్లు దాటిందన్నారు. 2023 Q2 నుండి 2024 Q2 వరకు ఒక సంవత్సరం కాలంలో భారతీయ పెట్టుబడులు $265 మిలియన్లు దాటగా.. 2023 Q1 నుండి 2024 Q1 వరకు భారతీయ పెట్టుబడి $200 మిలియన్ల స్థాయికి చేరుకుందని హర్షం వ్యక్తం చేశారు. భారతీయ బ్రాండ్ లకు బహ్రెయిన్ లో ఆదరణ లభిస్తుందన్నారు. డిపార్ట్మెంట్ ఆఫ్ కామర్స్ ఆఫ్ ఇండియా గణాంకాల ప్రకారం.. ఏప్రిల్ 2023 నుండి మార్చి 2024 వరకు రెండు దేశాల మధ్య వ్యాపారం $1.73 బిలియన్లకు చేరుకుంది.
తాజా వార్తలు
- యాదాద్రిలో గవర్నర్ దంపతులు
- తమిళనాడులో వీకే శశికళ కొత్త పార్టీ ప్రారంభం
- తెలుగు రాష్ట్రాల్లో భానుడి ప్రతాపం..తీవ్ర వడగాలులు
- ఇక ఆన్లైన్లోనే వాహనాల రిజిస్ట్రేషన్
- బీసీసీఐ సంచలన నిర్ణయం..ఐపీఎల్ జట్లకు ప్రాక్టీస్ విషయంలో కొత్త రూల్స్
- ఆంధ్ర ప్రదేశ్: టెన్త్ విద్యార్థుల పరీక్షలకు సర్వం సిద్ధం
- పదవ తరగతి పరీక్షలకు హాజరవుతున్న విద్యార్థులకు తెలంగాణ గవర్నర్ శుభాకాంక్షలు
- సంగారెడ్డిలో హెల్త్ కార్డుల పంపిణీ.. ప్రభుత్వం కీలక నిర్ణయం!
- ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ప్రమాణ స్వీకారం చేసిన లిసా గిల్
- అడోబ్ సీఈవో పదవికి శంతను నారాయణ్ రాజీనామా!









