భారత్-బహ్రెయిన్ బంధం బలోపేతం..పెట్టుబడుల్లో పెరుగుదల..!!
- October 11, 2024
మనామా: బహ్రెయిన్లోని భారత రాయబార కార్యాలయం, బహ్రెయిన్ ఇండియా సొసైటీ (BIS)తో కలిసి మనామాలోని క్రౌన్ ప్లాజాలో “ద్వైపాక్షిక పెట్టుబడులపై దృష్టి పెట్టడం” అనే కార్యక్రమాన్ని నిర్వహించింది. ప్రారంభోత్సవ కార్యక్రమంలో భారత రాయబారి వినోద్ కె జాకబ్ మాట్లాడుతూ.. 2024లో భారతదేశం-బహ్రెయిన్ ద్వైపాక్షిక సంబంధాలు విజయవంతంగా ముందుకు సాగుతున్నాయని తెలియజేసారు. 2019 నుండి పెట్టుబడులలో 40 శాతం పెరుగుదల ఉందని, ప్రస్తుతం $1.62 బిలియన్లు దాటిందన్నారు. 2023 Q2 నుండి 2024 Q2 వరకు ఒక సంవత్సరం కాలంలో భారతీయ పెట్టుబడులు $265 మిలియన్లు దాటగా.. 2023 Q1 నుండి 2024 Q1 వరకు భారతీయ పెట్టుబడి $200 మిలియన్ల స్థాయికి చేరుకుందని హర్షం వ్యక్తం చేశారు. భారతీయ బ్రాండ్ లకు బహ్రెయిన్ లో ఆదరణ లభిస్తుందన్నారు. డిపార్ట్మెంట్ ఆఫ్ కామర్స్ ఆఫ్ ఇండియా గణాంకాల ప్రకారం.. ఏప్రిల్ 2023 నుండి మార్చి 2024 వరకు రెండు దేశాల మధ్య వ్యాపారం $1.73 బిలియన్లకు చేరుకుంది.
తాజా వార్తలు
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!
- వాణిజ్య స్థలాల అద్దెపై కువైట్ ఫైర్ ఫోర్స్ కీలక సూచనలు..!!
- పర్యావరణ పరిరక్షణలో ఒమన్కు అంతర్జాతీయ గుర్తింపు..!!
- సోషల్ మీడియా బ్యాన్.. క్రియేటర్ ఎకానమీపై ప్రభావంపై యూఏఈ క్లారిటీ..!!
- డొమెస్టిక్ వర్కర్ ను వేధించిన మహిళకు మూడేళ్ల జైలు..!!
- ధోఫార్ ఖరీఫ్ సీజన్.. వినియోగదారుల రక్షణకు 52 మంది అధికారుల నియామకం..!!
- కలర్వర్స్ ఎక్స్పీరియన్స్తో కుటుంబాలకు వినూత్న వినోదం..!!
- జెడ్డాలో భారీగా పట్టుబడ్డ నకిలీ బ్రాండెడ్ దుస్తులు..!!
- కొత్త మల్టిపుల్ ఎంట్రీ వీసాను ప్రవేశపెట్టిన సౌదీ..!!







