భారత్-బహ్రెయిన్ బంధం బలోపేతం..పెట్టుబడుల్లో పెరుగుదల..!!
- October 11, 2024
మనామా: బహ్రెయిన్లోని భారత రాయబార కార్యాలయం, బహ్రెయిన్ ఇండియా సొసైటీ (BIS)తో కలిసి మనామాలోని క్రౌన్ ప్లాజాలో “ద్వైపాక్షిక పెట్టుబడులపై దృష్టి పెట్టడం” అనే కార్యక్రమాన్ని నిర్వహించింది. ప్రారంభోత్సవ కార్యక్రమంలో భారత రాయబారి వినోద్ కె జాకబ్ మాట్లాడుతూ.. 2024లో భారతదేశం-బహ్రెయిన్ ద్వైపాక్షిక సంబంధాలు విజయవంతంగా ముందుకు సాగుతున్నాయని తెలియజేసారు. 2019 నుండి పెట్టుబడులలో 40 శాతం పెరుగుదల ఉందని, ప్రస్తుతం $1.62 బిలియన్లు దాటిందన్నారు. 2023 Q2 నుండి 2024 Q2 వరకు ఒక సంవత్సరం కాలంలో భారతీయ పెట్టుబడులు $265 మిలియన్లు దాటగా.. 2023 Q1 నుండి 2024 Q1 వరకు భారతీయ పెట్టుబడి $200 మిలియన్ల స్థాయికి చేరుకుందని హర్షం వ్యక్తం చేశారు. భారతీయ బ్రాండ్ లకు బహ్రెయిన్ లో ఆదరణ లభిస్తుందన్నారు. డిపార్ట్మెంట్ ఆఫ్ కామర్స్ ఆఫ్ ఇండియా గణాంకాల ప్రకారం.. ఏప్రిల్ 2023 నుండి మార్చి 2024 వరకు రెండు దేశాల మధ్య వ్యాపారం $1.73 బిలియన్లకు చేరుకుంది.
తాజా వార్తలు
- ఈద్ అల్-అధా శుభాకాంక్షలు తెలిపిన భారత రాయబారి పరామిత త్రిపాఠి..!!
- సుల్తాన్ ఖబూస్ మస్జీదులో ఈద్ ప్రార్థనలు చేసిన సుల్తాన్..!!
- మినాలో భద్రతను సమీక్షించిన ఇంటీరియర్ మినిస్టర్..!!
- లుసైల్ ప్యాలెస్లో ఈద్ అల్-అధా వేడుకల్లో పాల్గొన్న అమీర్..!!
- మనామా సూక్లో ఈద్ సందడి..జోరుగా సాగిన కొనుగోళ్లు..!!
- ఈద్ అల్ అదా వేడుకలకు కొత్త వెలుగులు నింపిన నవజాత శిశువులు..!!
- తెలంగాణలో 3 రోజులు రెడ్ అలర్ట్
- సరికొత్త డిజిటల్ హంగులతో ‘మహానాడు 2026’ జెండా ఆవిష్కరించిన సీఎం చంద్రబాబు!
- శ్రీలంక వెళ్లే భారతీయులకు గుడ్ న్యూస్
- డ్రైవింగ్ చేస్తూ ఈద్ శుభాకాంక్షలు పంపొద్దు: అబుదాబి పోలీసుల హెచ్చరిక









