ఒమన్-ఉక్రెయిన్ సంబంధాలు బలోపేతం..మస్కట్లో ఉక్రేనియన్ ఎంబసీ ప్రారంభం..!!
- October 24, 2024
మస్కట్: మస్కట్లో ఉక్రెయిన్ రాయబార కార్యాలయాన్ని..ఒమన్ విదేశాంగ మంత్రి సయ్యద్ బదర్ హమద్ అల్ బుసైదీ సమక్షంలో ఉక్రెయిన్ విదేశాంగ మంత్రి ఆండ్రీ సైబిహా ప్రారంభించారు. ద్వైపాక్షిక సంబంధాలను పెంపొందించుకోవడం, వివిధ రంగాలలో ఉమ్మడి సహకారాన్ని విస్తరించడం వంటి ఫ్రేమ్వర్క్లో రాయబార కార్యాలయం ప్రారంభం అవుతుందని అధికారులు తెలిపారు. ఒమన్ - ఉక్రెయిన్ మధ్య దౌత్య, ఆర్థిక సంబంధాలను పెంపొందించే దిశగా అడుగులు పడ్డాయని ఉక్రెయిన్ మంత్రి తెలిపారు. వాణిజ్యం, ఇంధనం, వ్యవసాయం వంటి వివిధ రంగాలలో సహకారాన్ని పెంపొందించుకోవడం పట్ల తాము ఆసక్తిగా ఉన్నామని పేర్కొన్నారు. ప్రారంభోత్సవ వేడుకల్లో పలువురు అధికారులు, అరబ్, ఇతర దేశాల రాయబారులు పాల్గొన్నారు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







