ఒమన్-ఉక్రెయిన్ సంబంధాలు బలోపేతం..మస్కట్లో ఉక్రేనియన్ ఎంబసీ ప్రారంభం..!!
- October 24, 2024
మస్కట్: మస్కట్లో ఉక్రెయిన్ రాయబార కార్యాలయాన్ని..ఒమన్ విదేశాంగ మంత్రి సయ్యద్ బదర్ హమద్ అల్ బుసైదీ సమక్షంలో ఉక్రెయిన్ విదేశాంగ మంత్రి ఆండ్రీ సైబిహా ప్రారంభించారు. ద్వైపాక్షిక సంబంధాలను పెంపొందించుకోవడం, వివిధ రంగాలలో ఉమ్మడి సహకారాన్ని విస్తరించడం వంటి ఫ్రేమ్వర్క్లో రాయబార కార్యాలయం ప్రారంభం అవుతుందని అధికారులు తెలిపారు. ఒమన్ - ఉక్రెయిన్ మధ్య దౌత్య, ఆర్థిక సంబంధాలను పెంపొందించే దిశగా అడుగులు పడ్డాయని ఉక్రెయిన్ మంత్రి తెలిపారు. వాణిజ్యం, ఇంధనం, వ్యవసాయం వంటి వివిధ రంగాలలో సహకారాన్ని పెంపొందించుకోవడం పట్ల తాము ఆసక్తిగా ఉన్నామని పేర్కొన్నారు. ప్రారంభోత్సవ వేడుకల్లో పలువురు అధికారులు, అరబ్, ఇతర దేశాల రాయబారులు పాల్గొన్నారు.
తాజా వార్తలు
- అమరావతి మీదుగా హైదరాబాద్-చెన్నై బుల్లెట్ ట్రైన్
- ప్రముఖ ఆలయాల పరిసరాల్లో తిరుమల తరహా నిబంధనలు: సీఎం రేవంత్
- అడ్రస్ ప్రూఫ్ లేకున్నా గ్యాస్ సిలిండర్..కేంద్రం కొత్త రూల్స్
- అమరావతి నిర్మాణ పనులపై సీఎం చంద్రబాబు సమీక్ష
- ఖతార్ పర్యటనకు ఇటలీ ప్రధాన మంత్రి..!!
- కువైట్ లోని పోర్ట్ కార్యకలాపాలపై అత్యవసర సమావేశం..!!
- బహ్రెయిన్ అధ్యక్షతన కైరో చర్చలు..!!
- వరుస మోటార్సైకిళ్ల చోరీలు..ఏడుగురు అరెస్టు..!!
- శాంతి కోసం..దుబాయ్ నుండి రాస్ అల్ ఖైమా వరకు బైక్ ర్యాలీ..!!
- జెడ్డాలో ఇటలీ ప్రధానితో యువరాజు భేటీ..!!









