మాల్ ఆఫ్ ఎమిరేట్స్, సిటీ సెంటర్ దీరా, సిటీ సెంటర్ మిర్డిఫ్లో పార్కింగ్ ఫీజు పెంపు రద్దు..!!
- October 25, 2024
దుబాయ్: మాల్ ఆఫ్ ఎమిరేట్స్, సిటీ సెంటర్ దీరా, సిటీ సెంటర్ మిర్డిఫ్లను సందర్శించే వాహనదారులు, దుకాణదారులకు పార్కింగ్ రుసుములు పెంచే ఆలోచన లేదని దుబాయ్ అంతటా అనేక మాల్స్, రిటైల్ అవుట్లెట్లను నిర్వహిస్తున్న మజిద్ అల్ ఫుట్టైమ్ స్పష్టం చేసింది. ఈ మేరకు ఎమిరేట్లో చెల్లింపు పబ్లిక్ పార్కింగ్ సౌకర్యాలు, సేవలను అందించే అతిపెద్ద ప్రొవైడర్ పార్కిన్తో ఐదు సంవత్సరాల ఒప్పందంపై సంతకం చేసినట్లు తెలిపింది. ప్రతి సంవత్సరం ఈ మూడు మాల్స్ గుండా వెళ్ళే 20 మిలియన్లకు పైగా కార్లకు పార్కింగ్ను అమలు చేయడానికి ఇది వీలు కల్పిస్తుందని తెలిపింది. ఈ ఒప్పందం జనవరి 2025 నుండి అమల్లోకి వస్తుందని, ప్రస్తుతం ఫీజులు మారలేదని, తమకు ఫీజులను పెంచే ఆలోచన లేదని మజిద్ అల్ ఫుట్టైమ్ అసెట్ మేనేజ్మెంట్ CEO ఖలీఫా బిన్ బ్రైక్ అన్నారు. "మాల్ ఆఫ్ ఎమిరేట్స్లో మొదటి నాలుగు గంటలు ఉచితం. సిటీ సెంటర్ దీరాలో మొదటి మూడు గంటల పాటు ఉచితంగా కొనసాగుతుంది. మీరు అంతకు మించి ఉండి మా స్టోర్లలో ఒకదానిలో లావాదేవీలు జరిపితే, మీ టిక్కెట్ని చూపించిన పక్షంలో రుసుములను రద్దు చేస్తున్నాము." అని బిన్ బ్రైక్ అన్నారు. అలాగే సిటీ సెంటర్ మిర్డిఫ్లో పార్కింగ్ ఉచితం అని ఆయన స్పష్టం చేశారు. మాల్లోని కొన్ని VIP స్థలాలకు ప్రస్తుతం పార్కింగ్ సమస్య ఉందన్నారు. పార్కిన్ వ్యవస్థను స్వాధీనం చేసుకున్న తర్వాత అమల్లో ఉన్న ఆంక్షలు తొలగిస్తారని పేర్కొన్నారు. “మాల్ ఆఫ్ ఎమిరేట్స్లోకి వాహనాల పరంగా సుమారుగా 15 నుండి 20 శాతం పెరుగుదల ఉంటుందని అంచనా. వారపు రోజులో మాల్కు దాదాపు 30 వేల వస్తాయి. వారాంతంలో ఈ సంఖ్య 36 వేలకు చేరుకుంటుందని బిన్ బ్రైక్ వివరించారు.
తాజా వార్తలు
- యూఏఈ 5 సంవత్సరాల మల్టిపుల్ ఎంట్రీ టూరిస్ట్ వీసా...
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించిన మొదటి EU దేశంగా ఫ్రాన్స్
- హైడ్రోజన్ రైళ్లు పట్టాలపై కొత్త మలుపు
- సౌదీ విదేశాంగ మంత్రితో ఇటలీ, స్పెయిన్ చర్చలు..!!
- వెయిట్ లాస్ సర్జరీ విషాదం..దర్యాప్తునకు ఎంపీ డిమాండ్..!!
- ఇండియన్ స్కూళ్లలో ఔట్ డోర్ కార్యకలాపాలు నిలిపివేత..!!
- ఖతార్లో అల్ రవాబీ ‘షాప్ అండ్ విన్’ ఆఫర్ ప్రారంభం..!!
- కువైట్ లో భారతీయులే అతిపెద్ద ప్రవాస కమ్యూనిటీ..!!
- దుబాయ్లో భారతీయ పాస్పోర్ట్ కేంద్రాల వద్ద రద్దీ..!!
- కొత్త రూల్స్ తెచ్చిన బీసీసీఐ..







