మాల్ ఆఫ్ ఎమిరేట్స్, సిటీ సెంటర్ దీరా, సిటీ సెంటర్ మిర్డిఫ్లో పార్కింగ్ ఫీజు పెంపు రద్దు..!!
- October 25, 2024
దుబాయ్: మాల్ ఆఫ్ ఎమిరేట్స్, సిటీ సెంటర్ దీరా, సిటీ సెంటర్ మిర్డిఫ్లను సందర్శించే వాహనదారులు, దుకాణదారులకు పార్కింగ్ రుసుములు పెంచే ఆలోచన లేదని దుబాయ్ అంతటా అనేక మాల్స్, రిటైల్ అవుట్లెట్లను నిర్వహిస్తున్న మజిద్ అల్ ఫుట్టైమ్ స్పష్టం చేసింది. ఈ మేరకు ఎమిరేట్లో చెల్లింపు పబ్లిక్ పార్కింగ్ సౌకర్యాలు, సేవలను అందించే అతిపెద్ద ప్రొవైడర్ పార్కిన్తో ఐదు సంవత్సరాల ఒప్పందంపై సంతకం చేసినట్లు తెలిపింది. ప్రతి సంవత్సరం ఈ మూడు మాల్స్ గుండా వెళ్ళే 20 మిలియన్లకు పైగా కార్లకు పార్కింగ్ను అమలు చేయడానికి ఇది వీలు కల్పిస్తుందని తెలిపింది. ఈ ఒప్పందం జనవరి 2025 నుండి అమల్లోకి వస్తుందని, ప్రస్తుతం ఫీజులు మారలేదని, తమకు ఫీజులను పెంచే ఆలోచన లేదని మజిద్ అల్ ఫుట్టైమ్ అసెట్ మేనేజ్మెంట్ CEO ఖలీఫా బిన్ బ్రైక్ అన్నారు. "మాల్ ఆఫ్ ఎమిరేట్స్లో మొదటి నాలుగు గంటలు ఉచితం. సిటీ సెంటర్ దీరాలో మొదటి మూడు గంటల పాటు ఉచితంగా కొనసాగుతుంది. మీరు అంతకు మించి ఉండి మా స్టోర్లలో ఒకదానిలో లావాదేవీలు జరిపితే, మీ టిక్కెట్ని చూపించిన పక్షంలో రుసుములను రద్దు చేస్తున్నాము." అని బిన్ బ్రైక్ అన్నారు. అలాగే సిటీ సెంటర్ మిర్డిఫ్లో పార్కింగ్ ఉచితం అని ఆయన స్పష్టం చేశారు. మాల్లోని కొన్ని VIP స్థలాలకు ప్రస్తుతం పార్కింగ్ సమస్య ఉందన్నారు. పార్కిన్ వ్యవస్థను స్వాధీనం చేసుకున్న తర్వాత అమల్లో ఉన్న ఆంక్షలు తొలగిస్తారని పేర్కొన్నారు. “మాల్ ఆఫ్ ఎమిరేట్స్లోకి వాహనాల పరంగా సుమారుగా 15 నుండి 20 శాతం పెరుగుదల ఉంటుందని అంచనా. వారపు రోజులో మాల్కు దాదాపు 30 వేల వస్తాయి. వారాంతంలో ఈ సంఖ్య 36 వేలకు చేరుకుంటుందని బిన్ బ్రైక్ వివరించారు.
తాజా వార్తలు
- రేషన్ కార్డు సేవలు ఇక మీ ఫోన్లోనే
- గూగుల్ మ్యాప్స్లో సరికొత్త AI ఫీచర్లు
- ఇండిగో ప్రయాణికులకు ‘ఇంధన’ భారం
- అటల్ స్మతిన్యాస్ సొసైటీ కార్యచరణ గురించి పలువురితో చర్చించిన వెంకయ్య నాయుడు
- భారీ నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు
- విలువలతో కూడిన రాజకీయాల్లోకి యువత రావాలి: వెంకయ్య నాయుడు
- అమరావతిలో బిట్స్ పిలాని నిర్మాణ ప్లాన్ లను పరిశీలించిన మంత్రి లోకేష్
- అమెరికా విమానం కూలిన ఘటనలో నలుగురు మృతి
- కువైట్లో ఉరుములతో కూడిన వర్షాలు..!!
- చార్టర్డ్ విమానాలను నిర్వహిస్తున్న ఇండియన్ అసొసియేషన్స్..!!









