మాదకద్రవ్యాల అక్రమ రవాణా కేసులో బెంగుళూరుకు చెందిన ఓ మోడల్
- June 23, 2016
మాదకద్రవ్యాల అక్రమ రవాణా కేసులో బెంగుళూరుకు చెందిన ఓ మోడల్ అరెస్టయ్యింది. కర్ణాటక నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో(ఎన్సీబీ) అధికారులు ఆమెను కొద్ది రోజుల క్రితం అదుపులోకి తీసుకున్నట్లు బెంగళూరు పోలీసులు ఈరోజు వెల్లడించారు. అరెస్టయిన మోడల్ను దర్శిత్మితా గౌడగా గుర్తించారు. ఆమెను మాదకద్రవ్యాలకు సంబంధించిన చట్టం కింద అరెస్ట్ చేశారు. ఎన్సీబీ అధికారులు ఆమె ఇంట్లో దాడులు చేసి వంద గ్రాముల కొకైన్, 19 గ్రాముల వీడ్ తదితర డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు.దాడుల సమయంలో దర్శిత్మితా ఇంట్లో లేదు. ఇంట్లో ఉన్న ఆమె స్నేహితుడిని కూడా అధికారులు అదుపులోకి తీసుకున్నారు.బెంగళూరు సహా కొన్ని ప్రాంతాలకు తాను, దర్శిత్మితా ఓ గ్యాంగ్తో కలిసి డ్రగ్స్ అక్రమరవాణా చేస్తున్నట్లు అరెస్టయిన వ్యక్తి విచారణలో వెల్లడించినట్లు పోలీసులు తెలిపారు. కళాశాల విద్యార్థులు, తదితర చాలా మందికి డ్రగ్స్ సరఫరా చేస్తున్నట్లు చెప్పాడు. దర్శిత్మితా స్వస్థలం కర్ణాటకలోని చిక్మగ్ళూరు.
తాజా వార్తలు
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ..
- ఖతర్లో భారతీయ రాయబారిగా తెలుగు దౌత్యవేత్త శ్రీకర్ రెడ్డి!
- సౌదీ అరేబియాతో 30 ఏళ్ల పౌర అణు ఒప్పందానికి డొనాల్డ్ ట్రంప్ ఆమోదం!
- గ్లోబల్ ఐకాన్స్ ఫోరం సొసైటీకి ఐఎస్వో 9001:2015 ప్రమాణీకృత సంస్థ గుర్తింపు
- కువైట్లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!







