మాదకద్రవ్యాల అక్రమ రవాణా కేసులో బెంగుళూరుకు చెందిన ఓ మోడల్
- June 23, 2016
మాదకద్రవ్యాల అక్రమ రవాణా కేసులో బెంగుళూరుకు చెందిన ఓ మోడల్ అరెస్టయ్యింది. కర్ణాటక నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో(ఎన్సీబీ) అధికారులు ఆమెను కొద్ది రోజుల క్రితం అదుపులోకి తీసుకున్నట్లు బెంగళూరు పోలీసులు ఈరోజు వెల్లడించారు. అరెస్టయిన మోడల్ను దర్శిత్మితా గౌడగా గుర్తించారు. ఆమెను మాదకద్రవ్యాలకు సంబంధించిన చట్టం కింద అరెస్ట్ చేశారు. ఎన్సీబీ అధికారులు ఆమె ఇంట్లో దాడులు చేసి వంద గ్రాముల కొకైన్, 19 గ్రాముల వీడ్ తదితర డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు.దాడుల సమయంలో దర్శిత్మితా ఇంట్లో లేదు. ఇంట్లో ఉన్న ఆమె స్నేహితుడిని కూడా అధికారులు అదుపులోకి తీసుకున్నారు.బెంగళూరు సహా కొన్ని ప్రాంతాలకు తాను, దర్శిత్మితా ఓ గ్యాంగ్తో కలిసి డ్రగ్స్ అక్రమరవాణా చేస్తున్నట్లు అరెస్టయిన వ్యక్తి విచారణలో వెల్లడించినట్లు పోలీసులు తెలిపారు. కళాశాల విద్యార్థులు, తదితర చాలా మందికి డ్రగ్స్ సరఫరా చేస్తున్నట్లు చెప్పాడు. దర్శిత్మితా స్వస్థలం కర్ణాటకలోని చిక్మగ్ళూరు.
తాజా వార్తలు
- యూఏఈ లాటరీ: లక్కీ డే డ్రాలో 4,034 మందికి బహుమతులు..!!
- ట్యాంకర్ నుండి ప్రమాదకర పదార్థాలు లీకేజీ..డ్రైవర్ మృతి..!!
- హవల్లీలో ఫుడ్ కోర్ట్ మూసివేసిన ఫుడ్ అథారిటీ..!!
- హోర్ముజ్ జలసంధిలో భారత నౌకల పై దాడి..
- గ్లోబల్ విలేజ్ మళ్లీ సందర్శకులకు స్వాగతం పలకనుంది
- IPL 2026: చెన్నై పై హైదరాబాద్ విజయం
- ‘రన్ ఫర్ ది నేషన్’లో 25 వేల మంది పాల్గొనడంతో ఐక్యతకు ప్రతీక
- స్పైస్జెట్లో భారీ లేఆఫ్స్…500 మందికి షాక్
- హోర్ముజ్, లెబనాన్ సీజ్ ఫైర్ పై అమెరికా, సౌదీ చర్చలు..!!
- ఇరాన్ ఎయిర్ స్పేస్ పాక్షికంగా రీ ఓపెన్..!!









