భారత్తో కువైట్ విమానయాన సహకారం.. కీలక చర్చలు..!!
- October 27, 2024
కువైట్ః కువైట్లోని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA) హెడ్ షేక్ హుమూద్ ముబారక్ అల్-హుమూద్ అల్-జాబర్ అల్-సబాహ్.. భారత పౌర విమానయాన అథారిటీ అండర్ సెక్రటరీ అసంగ్బా చుబాతో సమావేశమయ్యారు. వీలైనంత త్వరగా కార్యకలాపాలను పెంచడానికి ఒప్పందంపై సంతకం చేయడానికి కువైట్ విదేశాంగ మంత్రిత్వ శాఖతో భారత అధికారులు సమన్వయం చేసుకోవాల్సిన అవసరం ఉందని తెలిపారు. భారతదేశం - కువైట్ మధ్య విమాన కార్యకలాపాలను పెంచడం కువైట్ ఎయిర్లైన్స్కు అత్యున్నత ప్రాధాన్యత అని పేర్కొన్నారు. మలేషియాలోని కౌలాలంపూర్లో జరిగిన ఇంటర్నేషనల్ సివిల్ ఏవియేషన్ కాన్ఫరెన్స్ (ICAO 2024) వార్షిక సమావేశం ముగింపు సమావేశాల సందర్భంగా ఈ సమావేశం జరిగింది. అదేవిధంగా ఉగాండా, రువాండా, డొమినికన్ రిపబ్లిక్, ఒమన్తో సహా విమానయాన పరిశ్రమ అధికారులతో షేక్ హుమూద్ సమావేశమయ్యారు.
తాజా వార్తలు
- అల్-సువేదాలో సంక్షోభ పరిష్కార రోడ్మ్యాప్ను స్వాగతించిన ఖతార్..!!
- ఇజ్రాయెల్ దురాక్రమణను తీవ్రంగా ఖండించిన సౌదీ క్యాబినెట్..!!
- బహ్రెయిన్ సోషల్ ఇన్సూరెన్స్ ఫ్రాడ్ కేసు.. పది మందిని దోషులుగా తేల్చిన కోర్టు..!!
- వీడియో వైరల్.. కార్ అద్దె కంపెనీ సిబ్బంది అరెస్టు..!!
- బిగ్ టికెట్ వీక్లీ డ్రాలో విజేతలుగా నలుగురు భారతీయులు..!!
- కువైట్లో కొత్త విద్యా సంవత్సరం ప్రారంభం.. ట్రాఫిక్ సమస్యలపై సమీక్ష..!!
- ప్రధాని మోదీ జన్మదిన వేడుకల్లో రక్తదాన మహోత్సవం
- ప్రభుత్వ సలహాదారుగా NVS రెడ్డి
- నేడు లండన్లో మంత్రి నారా లోకేశ్ నేతృత్వంలో రోడ్ షో
- సౌదీ అరేబియాలో భారీగా మాదకద్రవ్య పిల్స్ సీజ్..!!