బహ్రెయిన్ ఇంటర్నేషనల్ ఎయిర్షో 2024..ఒకే వేదికపై రక్షణ, భద్రతా ఆవిష్కరణలు..!!
- October 28, 2024
మనామా: బహ్రెయిన్ ఇంటర్నేషనల్ ఎయిర్షో (BIAS) 2024కు ఏర్పాట్లు జరుగుతున్నాయి. రక్షణ, భద్రతకు సంబంధించిన ప్రపంచ ఆవిష్కరణలకు ఇది కేరాఫ్ గా నిలువనుంది. నవంబర్ 13-15 వరకు ఈ ప్రతిష్టాత్మక ఈవెంట్ జరుగనుంది. రాయల్ బహ్రెయిన్ ఎయిర్ ఫోర్స్ (RBAF) సహకారంతో బహ్రెయిన్ రవాణా, టెలికమ్యూనికేషన్ మంత్రిత్వ శాఖ ద్వారా దీనిని నిర్వహిస్తున్నారు. సందర్శకులు కోసం ప్రపంచంలోని అత్యంత అధునాతన ఆవిష్కరణలు తరలిరానున్నాయి. లైనప్ లో లాక్హీడ్ మార్టిన్, రోల్స్ రాయిస్, థేల్స్ వంటి పరిశ్రమ దిగ్గజాలు ఉన్నాయి. ఇందులో సైనిక జెట్లు, అధునాతన వాణిజ్య విమానాల డైనమిక్ ఫ్లయింగ్ షోకేస్లు ఉన్నాయి. ఈ ఈవెంట్లో రెడ్ ఆరోస్, యూఏఈ అల్ ఫుర్సాన్, సౌదీ హాక్స్ పాల్గొంటున్నాయి. ఈ ప్రదర్శన సందర్భంగా ప్రభుత్వ అధికారులు, పరిశ్రమల, రక్షణ సాంకేతిక నిపుణులతో కాన్ఫరెన్స్ ఎజెండాలో ఉంది. రక్షణ, సైబర్ భద్రత, మానవరహిత వైమానిక వ్యవస్థలు, అభివృద్ధి చెందుతున్న రక్షణ సాంకేతికతలలో కృత్రిమ మేధస్సు కీలకాంశాలుగా చర్చలు జరుగనున్నాయి.
తాజా వార్తలు
- ఎలిమినేటర్లో హైదరాబాద్కు బిగ్ షాక్..
- ఫైటర్ జెట్ల తయారీకి గ్రీన్ సిగ్నల్
- ఎవరెస్ట్ శిఖరం పై హైదరాబాదీ మృతి..
- ఏపీ ప్రభుత్వంతో BYST ఒప్పందం!
- ప్రధాని మోదీతో ముగిసిన సీఎం విజయ్ సమావేశం
- ఈద్ అల్-అధా శుభాకాంక్షలు తెలిపిన భారత రాయబారి పరామిత త్రిపాఠి..!!
- సుల్తాన్ ఖబూస్ మస్జీదులో ఈద్ ప్రార్థనలు చేసిన సుల్తాన్..!!
- మినాలో భద్రతను సమీక్షించిన ఇంటీరియర్ మినిస్టర్..!!
- లుసైల్ ప్యాలెస్లో ఈద్ అల్-అధా వేడుకల్లో పాల్గొన్న అమీర్..!!
- మనామా సూక్లో ఈద్ సందడి..జోరుగా సాగిన కొనుగోళ్లు..!!









