బహ్రెయిన్ లో ప్రైవేట్ రంగ కార్మికులకు మరింత రక్షణ.. కీలక ప్రతిపాదనలపై చర్చ..!!
- October 29, 2024
మనామా: బహ్రెయిన్ లో ప్రైవేట్ సెక్టార్లోని యజమానులు కార్మికులను సస్పెండ్ చేసే ముందు అధికారులకు తెలియజేయవలసి ఉంటుంది. తొలగించబడిన ఉద్యోగులు పరిహారం క్లెయిమ్లను దాఖలు చేయడానికి ఇప్పుడు ఎక్కువ సమయం పొందవచ్చు. ఈ మేరకు బహ్రెయిన్ పార్లమెంట్ కొత్త నిబంధనలపై చర్చిస్తుందని అధికార యంత్రాంగం తెలిపింది. ప్రభుత్వ ముసాయిదా చట్టాన్ని కౌన్సిల్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ స్పీకర్ అహ్మద్ బిన్ సల్మాన్ అల్ ముసల్లంకు సమర్పించారు. బహ్రెయిన్ లేబర్ చట్టానికి రెండు ప్రధాన అప్ డేట్ లను ప్రతిపాదించింది. తీవ్రమైన దుష్ప్రవర్తనకు కార్మికులను సస్పెండ్ చేయడానికి ముందు యజమానులు అధికారులకు తెలియజేయాలని ఒక ప్రతిపాదన చేశారు. ఈ మేరకు చట్టంలో కొత్త నిబంధనను చేర్చనున్నారు.
ప్రస్తుతం, యజమానులకు హాని లేదా తీవ్రమైన నేరాలు జరిగినప్పుడు తాత్కాలికంగా ఉద్యోగిని సస్పెండ్ చేయడానికి కొంత విచక్షణ అధికారం కల్పించారు. అయితే ఈ సర్దుబాటు వారు ముందుగా సంబంధిత అధికారులకు తెలియజేయాలని, అటువంటి సందర్భాలలో స్వతంత్రంగా వ్యవహరించే యజమానుల తమ వాదనను నిరూపించుకోవాల్సి ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. మరొక ప్రతిపాదిత ప్రకారం..కార్మికులు తమ ఉద్యోగాన్ని కోల్పోయిన తర్వాత క్లెయిమ్ దాఖలు చేయడానికి కాలపరిమితిని 30 రోజుల నుండి 60కి పొడిగించనున్నారు. ఈ అదనపు సమయం కార్మికులకు బలమైన కేసులను సిద్ధం చేయడంలో సహాయపడుతుందని చెబుతున్నారు.
ఈ మార్పులు కార్మికుల రక్షణలు, కార్యాలయ సమతుల్యతకు భంగం కలిగించవచ్చని ప్రభుత్వం తన మెమోలో ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేసింది. సస్పెన్షన్ల కోసం యజమానులు అధికారులకు తెలియజేయాలని కోరడం వల్ల దుష్ప్రవర్తనను నిర్వహించడం కష్టతరం అవుతుందని, ఇది పని వాతావరణాన్ని అశాంతికి గురి చేస్తుందని అధికారులు వాదిస్తున్నారు. పొడిగించిన దావా వ్యవధి సాక్ష్యాలను ప్రభావితం చేసే అవకాశం ఉందన్నారు.
మరోవైపు, పబ్లిక్ ప్రాసిక్యూషన్ ద్వారా దర్యాప్తుపై ప్రతిపాదిత మూడు నెలల పరిమితిని కూడా ప్రభుత్వం ప్రశ్నిస్తుంది. ప్రాసిక్యూటర్లపై టైమ్ పీరియడ్ విధించడం ద్వారా న్యాయవ్యవస్థ స్వతంత్రతను ఉల్లంఘించవచ్చని వాదించింది. కార్మికుల హక్కులను బలోపేతం చేయాలన్న పార్లమెంటు లక్ష్యాన్ని గుర్తిస్తున్నామని, అదే సమయంలో కంపెనీల హక్కులను బ్యాలెన్స్ చేసేలా కొత్త విధానాన్ని ప్రభుత్వం సూచిస్తుంది.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







