బహ్రెయిన్ లో మొబైల్ ఫోన్ విక్రయాలపై కఠిన నిబంధనలు..!!
- October 30, 2024
మనామా: మొబైల్ ఫోన్ విక్రయాలపై కఠిన నిబంధనలు అమలు చేసే దిశగా బహ్రెయన్ సిద్ధమవుతోంది. ఈ మేరకు ఐదుగురు బహ్రెయిన్ పార్లమెంట్ సభ్యులు (MPలు) నివాసితులు, సందర్శకులకు మొబైల్ ఫోన్ లైన్లను విక్రయించడం, బదిలీ చేయడంపై కఠినమైన నిబంధనలను అమలు చేయాలని కోరుతూ ఒక ప్రతిపాదనను సమర్పించారు. ఎంపీలు బాస్మా ముబారక్, మహ్మద్ అల్ అహ్మద్, జలీలా అల్ సయ్యద్, హనన్ ఫర్దాన్, బాదర్ అల్ తమీమీ ప్రతిపాదించిన ప్రతిపాదన.. ఈ సమస్యను పరిష్కరించడంలో జాతీయ భద్రత, ప్రజా ప్రయోజనాల ప్రాముఖ్యతను తెలియజేసింది. వివిధ నేరాలలో మొబైల్ ఫోన్ల వినియోగం పెరుగుతున్న నేపథ్యలో ఈ చర్యలు అత్యవసరమని ఎంపీలు వెల్లడించారు.
అధునాతన సాంకేతికత, కమ్యూనికేషన్ యుగంలో ప్రజల భద్రతకు గణనీయమైన ముప్పు ఏర్పడుతుందని ఎంపీలు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ క్రమంలో మొబైల్ ఫోన్ లైన్ల కొనుగోలు, అమ్మకాలపై కఠినమైన నియంత్రణలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. ముఖ్యంగా ఇతర దేశాలలో విజయవంతంగా అమలవుతున్న నివాసితులు, సందర్శకుల కోసం కఠినమైన నిబంధనలను బహ్రెయిన్ అనుసరించాలని ఎంపీలు కోరారు. సైబర్ క్రైమ్లను అరికట్టేందుకు, ఇటీవల పెరుగుతున్న చోరీ, ఫ్రాడ్ కేసులను అడ్డుకునేందుకు ఈ ప్రతిపాదన గణనీయంగా దోహదపడుతుందని ఎంపీలు వాదిస్తున్నారు.
తాజా వార్తలు
- పలు కార్యక్రమాల్లో పాల్గొన్న సీఎం చంద్రబాబు
- 'మన శంకర వర ప్రసాద్ గారు’ ప్రీమియర్ను నిర్వహించిన జనసేన గల్ఫ్సేన
- అంధుల మహిళా క్రికెట్ జట్టు కెప్టెన్ దీపికకు అరుదైన గౌరవం
- ఓల్డ్ దోహా పోర్ట్ ఫిషింగ్ పోటీ..QR 600,000 బహుమతులు..!!
- సౌదీలో SR977 బిలియన్లు దాటిన విదేశీ పెట్టుబడులు..!!
- నో క్యాష్.. నో టిక్కెట్.. DXB, సాలిక్ ఒప్పందం..!!
- కువైట్ లో 2026 చివరి నాటికి స్మార్ట్ మీటర్ల ఇన్ స్టాలేషన్..!!
- సీబ్ వేర్ హౌజ్ లో అగ్నిప్రమాదం..!!
- బహ్రెయిన్-కువైట్ మధ్య దౌత్య సంబంధాలు ప్రత్యేకం..!!
- జయశంకర్ విశ్వనాథన్కు చెంబై సంగీత సంరక్షక పురస్కారం ప్రదానం..!!







