బహ్రెయిన్ లో మొబైల్ ఫోన్ విక్రయాలపై కఠిన నిబంధనలు..!!
- October 30, 2024
మనామా: మొబైల్ ఫోన్ విక్రయాలపై కఠిన నిబంధనలు అమలు చేసే దిశగా బహ్రెయన్ సిద్ధమవుతోంది. ఈ మేరకు ఐదుగురు బహ్రెయిన్ పార్లమెంట్ సభ్యులు (MPలు) నివాసితులు, సందర్శకులకు మొబైల్ ఫోన్ లైన్లను విక్రయించడం, బదిలీ చేయడంపై కఠినమైన నిబంధనలను అమలు చేయాలని కోరుతూ ఒక ప్రతిపాదనను సమర్పించారు. ఎంపీలు బాస్మా ముబారక్, మహ్మద్ అల్ అహ్మద్, జలీలా అల్ సయ్యద్, హనన్ ఫర్దాన్, బాదర్ అల్ తమీమీ ప్రతిపాదించిన ప్రతిపాదన.. ఈ సమస్యను పరిష్కరించడంలో జాతీయ భద్రత, ప్రజా ప్రయోజనాల ప్రాముఖ్యతను తెలియజేసింది. వివిధ నేరాలలో మొబైల్ ఫోన్ల వినియోగం పెరుగుతున్న నేపథ్యలో ఈ చర్యలు అత్యవసరమని ఎంపీలు వెల్లడించారు.
అధునాతన సాంకేతికత, కమ్యూనికేషన్ యుగంలో ప్రజల భద్రతకు గణనీయమైన ముప్పు ఏర్పడుతుందని ఎంపీలు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ క్రమంలో మొబైల్ ఫోన్ లైన్ల కొనుగోలు, అమ్మకాలపై కఠినమైన నియంత్రణలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. ముఖ్యంగా ఇతర దేశాలలో విజయవంతంగా అమలవుతున్న నివాసితులు, సందర్శకుల కోసం కఠినమైన నిబంధనలను బహ్రెయిన్ అనుసరించాలని ఎంపీలు కోరారు. సైబర్ క్రైమ్లను అరికట్టేందుకు, ఇటీవల పెరుగుతున్న చోరీ, ఫ్రాడ్ కేసులను అడ్డుకునేందుకు ఈ ప్రతిపాదన గణనీయంగా దోహదపడుతుందని ఎంపీలు వాదిస్తున్నారు.
తాజా వార్తలు
- ప్రధాని మోదీ జన్మదిన వేడుకల్లో రక్తదాన మహోత్సవం
- ప్రభుత్వ సలహాదారుగా NVS రెడ్డి
- నేడు లండన్లో మంత్రి నారా లోకేశ్ నేతృత్వంలో రోడ్ షో
- సౌదీ అరేబియాలో భారీగా మాదకద్రవ్య పిల్స్ సీజ్..!!
- సమాహీజ్ ఇంట్లో అగ్నిప్రమాదం..ఒకరు మృతి..!!
- దుబాయ్ లో టెనంట్స్ కు బంపర్ డీల్స్..!!
- సోషల్ మీడియా ద్వారా ట్రాఫిక్ ఉల్లంఘనల పర్యవేక్షణ.!.!
- వాహనాల నుండి వస్తువుల చోరీ.. వ్యక్తి అరెస్టు..!!
- ఖతార్ కు సంఘీభావంగా నిలిచిన అరబ్-ఇస్లామిక్ దేశాలు..!!
- శ్రీవారి బ్రహ్మోత్సవాల బుక్లెట్ విడుదల