మదీనాలో విమానం మెట్లపై నుంచి పడి మహిళా ప్యాసింజర్ మృతి..!!

- October 30, 2024 , by Maagulf
మదీనాలో విమానం మెట్లపై నుంచి పడి మహిళా ప్యాసింజర్ మృతి..!!

మదీనా: మదీనాలోని ప్రిన్స్ మహ్మద్ బిన్ అబ్దుల్ అజీజ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో విమానం దిగుతుండగా నిచ్చెనపై నుంచి పడి ఓ మహిళా ప్రయాణికురాలు మృతి చెందారు. అక్టోబర్ 29న లయన్ ఎయిర్ ఎ330 ఎయిర్‌క్రాఫ్ట్ (ఎల్‌ఎన్‌ఐ 074) ల్యాండ్ అయిన తర్వాత జరిగిన ప్రమాదం గురించి తమకు సమాచారం అందిందని సౌదీ నేషనల్ ట్రాన్స్‌పోర్ట్ సేఫ్టీ సెంటర్ వెల్లడించింది. మెట్లపై నుంచి పడిపోవడంతో తీవ్ర గాయాలపాలైన ప్రయాణికుడిని ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందింది. లయన్ ఎయిర్ జకార్తాలో ఉన్న ఇండోనేషియా తక్కువ-ధర ప్రైవేట్ ఎయిర్‌లైన్ గా గుర్తింపు పొందింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com