అణు సరఫరాదారుల సంఘంలో సభ్యత్వంపై భారత్‌కు నిరాశ

- June 23, 2016 , by Maagulf
అణు సరఫరాదారుల సంఘంలో సభ్యత్వంపై భారత్‌కు నిరాశ

అణు సరఫరాదారుల సంఘం(ఎన్‌ఎస్‌జీ)లో భారత్‌కు సభ్యత్వంపై ఏకాభిప్రాయం కుదరలేదు. దక్షిణ కొరియా రాజధాని సియోల్‌ వేదికగా జరిగిన సమావేశంలో భారత్‌ సభ్యత్వం కల్పించడాన్ని చైనా, ఐర్లాండ్‌, టర్కీ, బ్రెజిల్‌, ఆస్ట్రియా, న్యూజిలాండ్‌ దేశాలు వ్యతిరేకించాయి. అణువ్యాప్తి నిరోధక ఒప్పందంపై భారత్‌ సంతకం చేయనందున భారత్‌కు సభ్యత్వం కల్పించరాదని ఆరు సభ్యదేశాలు తేల్చిచెప్పాయి. మరోవైపు మెక్సికో మాత్రం భారత్‌ సభ్యత్వానికి మద్దతు ప్రకటించింది.. 48 దేశాల సభ్యత్వం ఉన్న ఎన్‌ఎస్‌జీలో భారత్‌ సభ్యత్వం పొందాలంటే ఏకాభిప్రాయం అవసరం. అమెరికా, ఫ్రాన్స్‌ సహా మరో 20 దేశాలు మాత్రమే భారత్‌ సభ్యత్వానికి మద్దతు ప్రకటించాయి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com