అణు సరఫరాదారుల సంఘంలో సభ్యత్వంపై భారత్కు నిరాశ
- June 23, 2016
అణు సరఫరాదారుల సంఘం(ఎన్ఎస్జీ)లో భారత్కు సభ్యత్వంపై ఏకాభిప్రాయం కుదరలేదు. దక్షిణ కొరియా రాజధాని సియోల్ వేదికగా జరిగిన సమావేశంలో భారత్ సభ్యత్వం కల్పించడాన్ని చైనా, ఐర్లాండ్, టర్కీ, బ్రెజిల్, ఆస్ట్రియా, న్యూజిలాండ్ దేశాలు వ్యతిరేకించాయి. అణువ్యాప్తి నిరోధక ఒప్పందంపై భారత్ సంతకం చేయనందున భారత్కు సభ్యత్వం కల్పించరాదని ఆరు సభ్యదేశాలు తేల్చిచెప్పాయి. మరోవైపు మెక్సికో మాత్రం భారత్ సభ్యత్వానికి మద్దతు ప్రకటించింది.. 48 దేశాల సభ్యత్వం ఉన్న ఎన్ఎస్జీలో భారత్ సభ్యత్వం పొందాలంటే ఏకాభిప్రాయం అవసరం. అమెరికా, ఫ్రాన్స్ సహా మరో 20 దేశాలు మాత్రమే భారత్ సభ్యత్వానికి మద్దతు ప్రకటించాయి.
తాజా వార్తలు
- మెటా సేవలకు అంతరాయం..ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ డౌన్!
- ఇరాన్ రాయబారిని పిలిపించిన జోర్డాన్.. క్షిపణి దాడులు వెంటనే నిలిపివేయాలని డిమాండ్
- రాజమండ్రిలో తొలి కరోనా కేసు నమోదు
- అఖిలపక్ష సమావేశంలో పాల్గొన్న జనసేన పార్లమెంటరీ పార్టీ నేత బాలశౌరి
- అకాబా విమానాశ్రయం, పోర్టుకు ఎలాంటి ముప్పు లేదు: జోర్డాన్ ప్రభుత్వం
- సరికొత్త చరిత్ర సృష్టించిన పీవీ సింధు
- తిరుమలలో రూమ్ ఎలా పొందాలో తెలుసా?
- ఇరాన్ రెండో దాడితో కువైట్ విద్యుత్ కేంద్రంలో భారీ అగ్నిప్రమాదం.. అత్యవసర ప్రణాళికలు అమలు
- యూఏఈలో సీబీఎస్ఈ గ్రేడ్ 10 ఫలితాలు విడుదల..నెలల అనిశ్చితికి తెర..!!
- సౌదీలో భారీ స్మగ్లింగ్ యత్నాలు భగ్నం..!!







