ఫుట్బాల్ ఆటగాళ్లకు క్షమాభిక్ష ప్రసాదించిన యూఏఈ ప్రెసిడెంట్..!!
- October 30, 2024
యూఏఈ: అక్టోబర్ 20న అబుదాబిలో జరిగిన మ్యాచ్లో ఘర్షణకు పాల్పడిన ముగ్గురు ఫుట్బాల్ ఆటగాళ్లకు యూఏఈ అధ్యక్షుడు క్షమాభిక్ష ప్రసాదించారు. యూఏఈ, ఈజిప్ట్ల మధ్య ఉన్న సోదర సంబంధాల ఆధారంగా దోషులను క్షమించాలనే నిర్ణయం తీసుకున్నట్లు అధికార యంత్రాంగం వెల్లడించింది. ఈజిప్షియన్ జమాలెక్ క్లబ్కు చెందిన దోషులుగా తేలిన ఆటగాళ్లకు ఒక నెల జైలు శిక్షతోపాటు ఒక్కొక్కరికి Dh200,000 జరిమానా విధించారు.
అక్టోబర్ 21న అబుదాబిలో జరిగిన పిరమిడ్స్ క్లబ్తో జరిగిన ఈజిప్షియన్ సూపర్ కప్ సెమీ-ఫైనల్లో మ్యాచ్లో ప్లేయర్స్ పబ్లిక్ సెక్యూరిటీ సిబ్బందిపై దాడికి పాల్పడ్డారు. నబిల్ ఎమాద్ డొంఘా, ముస్తఫా షాలబీ, ఫుట్బాల్ డైరెక్టర్ అబ్దెల్ వాహెద్ ఎల్ సయ్యద్లను నిందితులుగా గుర్తించారు. విచారణ సందర్భంగా ప్లేయర్స్ తమ తప్పును ఒప్పుకున్నారు. సీసీ ఫుటేజీ ఆధారంగా నిర్ధారించి కోర్టు తీర్పు వెలువరించింది.
తాజా వార్తలు
- గ్లోబల్ పీస్ లీడర్..ఖతార్ పై UN చీఫ్ ప్రశంసలు..!!
- సౌదీలకు మరో ఏడాది పాటు వీసా మినహాయింపు..!!
- 3 రోజులు గడిచినా అందని లగేజీ.. ఎయిర్ ఇండియా తీరుపై ఫైర్..!!
- కువైట్ లో ఆన్లైన్ గ్యాబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఒమన్ సొంతూరులా.. సింగర్ మధుబంటి బాగ్చి ఎమోషనల్..!!
- బహ్రెయిన్ లో స్మార్ట్ ట్రాఫిక్ కెమెరాల ట్రయల్ రన్ సెట్..!!
- ఘనంగా NATS పిట్స్ బర్గ్ వార్షికోత్సం
- అంతరిక్షంలో ఏఐ డేటా కు గూగుల్ శ్రీకారం
- తెలుగు రాష్ట్రాలను అనుసరిస్తున్న న్యూయార్క్ కొత్త మేయర్..
- 'తానా ప్రపంచసాహిత్య వేదిక' ఆధ్వర్యంలో బాలల దినోత్సవం







