ఫుట్బాల్ ఆటగాళ్లకు క్షమాభిక్ష ప్రసాదించిన యూఏఈ ప్రెసిడెంట్..!!
- October 30, 2024
యూఏఈ: అక్టోబర్ 20న అబుదాబిలో జరిగిన మ్యాచ్లో ఘర్షణకు పాల్పడిన ముగ్గురు ఫుట్బాల్ ఆటగాళ్లకు యూఏఈ అధ్యక్షుడు క్షమాభిక్ష ప్రసాదించారు. యూఏఈ, ఈజిప్ట్ల మధ్య ఉన్న సోదర సంబంధాల ఆధారంగా దోషులను క్షమించాలనే నిర్ణయం తీసుకున్నట్లు అధికార యంత్రాంగం వెల్లడించింది. ఈజిప్షియన్ జమాలెక్ క్లబ్కు చెందిన దోషులుగా తేలిన ఆటగాళ్లకు ఒక నెల జైలు శిక్షతోపాటు ఒక్కొక్కరికి Dh200,000 జరిమానా విధించారు.
అక్టోబర్ 21న అబుదాబిలో జరిగిన పిరమిడ్స్ క్లబ్తో జరిగిన ఈజిప్షియన్ సూపర్ కప్ సెమీ-ఫైనల్లో మ్యాచ్లో ప్లేయర్స్ పబ్లిక్ సెక్యూరిటీ సిబ్బందిపై దాడికి పాల్పడ్డారు. నబిల్ ఎమాద్ డొంఘా, ముస్తఫా షాలబీ, ఫుట్బాల్ డైరెక్టర్ అబ్దెల్ వాహెద్ ఎల్ సయ్యద్లను నిందితులుగా గుర్తించారు. విచారణ సందర్భంగా ప్లేయర్స్ తమ తప్పును ఒప్పుకున్నారు. సీసీ ఫుటేజీ ఆధారంగా నిర్ధారించి కోర్టు తీర్పు వెలువరించింది.
తాజా వార్తలు
- సౌదీ నుంచి క్షేమంగా బయలుదేరిన 59 మంది తెలుగు ప్రవాసులు
- ఇండిగో సీఈఓ పీటర్ ఎల్బర్స్ రాజీనామా
- 'మేము ఇక్కడ సురక్షితం'-యుద్ధ సమయంలోనూ ఇరానియన్లకు అండగా నిలుస్తున్న యూఏఈ ప్రజలు!
- విదేశాల్లో చిక్కుకుపోతే కంపెనీ జీతం ఆపేయవచ్చా?
- యూఏఈలో కూరగాయల ధరల పెరుగుదల తాత్కాలికమే
- అమరావతి స్పోర్ట్స్ సిటీపై సీఎం చంద్రబాబు వ్యాఖ్యలు!
- తెలంగాణలో సాయంత్రం పూట బీటెక్ కోర్సులు
- అన్ని రకాల డ్రోన్ల పై యూఏఈ నిషేధం..!!
- 684 మంది ఇంజనీర్లకు SR1.6 మిలియన్ల ఫైన్స్..!!
- 2 ఇండిగో విమానాలు దారి మళ్లింపు.. ప్రయాణికులు అసహనం..!!









