కువైట్ లో డిగ్రీ లేని 60 ఏళ్లు పైబడిన ప్రవాసులకు శుభవార్త..!!
- November 04, 2024
కువైట్: మూడు సంవత్సరాల ఆంక్షలను అమలు చేసిన తర్వాత, కువైట్ ఇప్పుడు యూనివర్సిటీ డిగ్రీ లేకుండా 60 ఏళ్లు పైబడిన ప్రవాస కార్మికుల కోసం నిబంధనలను సడలించాలని యోచిస్తున్నట్లు తెలుస్తోంది. పబ్లిక్ అథారిటీ ఫర్ మ్యాన్పవర్ 60 ఏళ్లు పైబడిన విశ్వవిద్యాలయం లేని ప్రవాసులపై తన నిర్ణయాన్ని పునఃపరిశీలిస్తోంది. ఈ నిర్ణయం కార్మిక మార్కెట్పై ప్రతికూల ప్రభావితం చూపిందని నివేదికలు అందిన నేపథ్యంలో నిబంధనలను సవరించాలని నిర్ణయించినట్లు సమాచారం.
ప్రస్తుత నిబంధనల ప్రకారం.. ఈ కేటగిరీ ప్రజలు తమ రెసిడెన్సీని కొనసాగించడానికి సంవత్సరానికి సుమారు 1000 దినార్లను ఖర్చు చేయాల్సి ఉంటుంది. ఇందులో బీమా ఇతర రుసుములు ఉంటాయి. దీని వల్ల చాలా మంది ప్రత్యేక కార్మికులు 60 సంవత్సరాల తర్వాత దేశం విడిచి వెళ్ళారు. ముఖ్యంగా దశాబ్దాల అనుభవం ఉన్న వేలాది మంది కార్మికులు దేశం విడిచి వెళ్లడం వల్ల ప్రత్యేక వృత్తిపరమైన, సాంకేతిక కార్మికుల కొరత ఏర్పడటంతో ఇది కార్మిక మార్కెట్ను ప్రభావితం చేసింది. ఇటీవల మొదటి ఉప ప్రధానమంత్రి, రక్షణ మంత్రి , అంతర్గత మంత్రి షేక్ ఫహద్ అల్-యూసెఫ్ కార్మిక మార్కెట్లో స్కిల్డ్ లేబర్ సంఖ్యను పెంచడానికి అనేక దిద్దుబాటు చర్యలు తీసుకున్నారు. ఇందులో ప్రభుత్వ కాంట్రాక్టుల నుండి ప్రవాస ఉద్యోగులను ప్రైవేట్ రంగానికి తరలించడంతోపాటు గృహ కార్మికులను బదిలీ చేయడానికి అనుమతించారు.
తాజా వార్తలు
- ప్రధాని మోదీ జన్మదిన వేడుకల్లో రక్తదాన మహోత్సవం
- ప్రభుత్వ సలహాదారుగా NVS రెడ్డి
- నేడు లండన్లో మంత్రి నారా లోకేశ్ నేతృత్వంలో రోడ్ షో
- సౌదీ అరేబియాలో భారీగా మాదకద్రవ్య పిల్స్ సీజ్..!!
- సమాహీజ్ ఇంట్లో అగ్నిప్రమాదం..ఒకరు మృతి..!!
- దుబాయ్ లో టెనంట్స్ కు బంపర్ డీల్స్..!!
- సోషల్ మీడియా ద్వారా ట్రాఫిక్ ఉల్లంఘనల పర్యవేక్షణ.!.!
- వాహనాల నుండి వస్తువుల చోరీ.. వ్యక్తి అరెస్టు..!!
- ఖతార్ కు సంఘీభావంగా నిలిచిన అరబ్-ఇస్లామిక్ దేశాలు..!!
- శ్రీవారి బ్రహ్మోత్సవాల బుక్లెట్ విడుదల