దుబాయ్ - అబుదాబిల మధ్య కొత్త టాక్సీ-షేరింగ్ సర్వీస్.. ట్రయల్ రన్..!!
- November 05, 2024
యూఏఈ: దుబాయ్ - అబుదాబిల మధ్య కొత్త టాక్సీ-షేరింగ్ పైలట్ సర్వీస్ ప్రారంభమైంది. ఈ కొత్త సర్వీస్ తో ప్రయాణీకులకు ప్రయాణ ఖర్చులలో 75% వరకు ఆదా అవుతుందని RTA తెలిపింది. ఆరు నెలల పాటు ట్రయల్ రన్ కొనసాగుతుందని, ఫలితాల ఆధారంగా ఇతర ప్రదేశాలకు విస్తరిస్తామని RTA తెలిపింది. దుబాయ్లోని ఇబ్న్ బటుటా సెంటర్, అబుదాబిలోని అల్ వహ్దా సెంటర్ మధ్య ప్రయాణీకులు ప్రయాణించవచ్చు. ఈ సర్వీస్ ప్రయాణ ఖర్చులను తగ్గించడం లక్ష్యంగా పెట్టుకుందని, ముఖ్యంగా దుబాయ్ - అబుదాబి మధ్య తరచుగా ప్రయాణించే వారి కోసం తీసుకొచ్చినట్టు దుబాయ్ రోడ్స్ అండ్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఏజెన్సీలో ప్లానింగ్ అండ్ బిజినెస్ డెవలప్మెంట్ డైరెక్టర్ అడెల్ షాక్రి అన్నారు. ట్రయల్ సర్వీస్ ప్రతి ప్రయాణీకుడు పూర్తి ఛార్జీని కవర్ చేయడానికి బదులుగా షేర్డ్ రైడ్లో 66 దిర్హామ్లు అవుతుందని, ప్రయాణీకులు తమ బ్యాంక్ కార్డ్లు లేదా నోల్ కార్డ్ల ద్వారా ఛార్జీలను చెల్లించవచ్చని షాక్రి చెప్పారు. ఇద్దరు రైడర్లు ఛార్జీని పంచుకున్నప్పుడు ఒక్కో ప్రయాణీకుడికి Dh132, ముగ్గురు ప్రయాణీకులు కలిసి ప్రయాణించినప్పుడు Dh88 అవుతుందని వివరించారు.
తాజా వార్తలు
- ప్రధాని మోదీ జన్మదిన వేడుకల్లో రక్తదాన మహోత్సవం
- ప్రభుత్వ సలహాదారుగా NVS రెడ్డి
- నేడు లండన్లో మంత్రి నారా లోకేశ్ నేతృత్వంలో రోడ్ షో
- సౌదీ అరేబియాలో భారీగా మాదకద్రవ్య పిల్స్ సీజ్..!!
- సమాహీజ్ ఇంట్లో అగ్నిప్రమాదం..ఒకరు మృతి..!!
- దుబాయ్ లో టెనంట్స్ కు బంపర్ డీల్స్..!!
- సోషల్ మీడియా ద్వారా ట్రాఫిక్ ఉల్లంఘనల పర్యవేక్షణ.!.!
- వాహనాల నుండి వస్తువుల చోరీ.. వ్యక్తి అరెస్టు..!!
- ఖతార్ కు సంఘీభావంగా నిలిచిన అరబ్-ఇస్లామిక్ దేశాలు..!!
- శ్రీవారి బ్రహ్మోత్సవాల బుక్లెట్ విడుదల