ఫేక్‌ పర్మిట్స్‌: మూడు సంస్థలకు జరీమానా

- June 24, 2016 , by Maagulf
ఫేక్‌ పర్మిట్స్‌: మూడు సంస్థలకు జరీమానా

మినిస్ట్రీ ఆఫ్‌ హ్యూమన్‌ రిసోర్సెస్‌ మరియు ఎమిరైటైజేషన్‌ ప్రైవేట్‌ సెక్టార్‌కి చెందిన మూడు సంస్థలు నిబంధనలకు విరుద్ధంగా ఫేక్‌ పర్మిట్స్‌ జారీ చేస్తున్నట్లు అల్‌ అయిన్‌ కోర్ట్‌కి తెలిపింది. విచారణ అనంతరం ఆ మూడు సంస్థలకు జరీమానా విధించింది న్యాయస్థానం. క్యాబినెట్‌ డెసిషన్‌ నెం.40 ఆఫ్‌ 2014 ప్రకారం నిబంధనల్ని అతిక్రమించిన సంస్థలకు 20,000 దిర్హామ్‌ల జరీమానా విధింరబడుతుంది. అల్‌ అయిన్‌ కోర్ట్‌ ఫస్ట్‌ ఇన్‌స్టాన్స్‌, ఆసియాకి చెందిన వ్యాపారవేత్తకు ఏడాదిపాటు జైలు శిక్ష విధించింది. అలాగే ఆయన్ను దేశం నుంచి డిపోర్ట్‌ చేయాలని ఆదేశించింది. అలాగే సంస్థకు 50,000 ఫైన్‌ విధించింది. రెండో కేసులో ఆసియాకి చెందిన బిజినెస్‌ మేన్‌కి ఏడాది జైలు శిక్ష, 50,000 దిర్హామ్‌ల జరీమానా విధించారు. మూడో కేసులో ఆసియాకి చెందిన బిజినెస్‌ మెన్‌ మూడేళ్ళ జైలు శిక్షకు గురయ్యారు. 50,000 అరబ్‌ ఎమిరేట్స్‌ దిర్హామ్స్‌ ఫైన్‌ విధించడం జరిగింది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com