వైఫై స్మార్ట్ ట్రాష్ బిన్స్ ఏర్పాటు చేసిన షార్జా
- June 24, 2016
వైఫై ట్రాష్ బిన్స్ని షార్జాలో ప్రయోగాత్మకంగా ఏర్పాటు చేశారు. ట్రాష్ బిన్స్ నిండిపోగానే, నిర్వాహకులకు సమాచారం అందించేలా వీటిలో సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించారు. తొలి విడతలో మొత్తం 10 స్మార్ట్ ట్రాష్ బిన్స్ని బీయాహ్ ఎన్విరాన్మెంట్ అండ్ వేస్ట్ మేనేజ్మెంట్ ద్వారా షార్జాలోని టూరిస్ట్ ప్రాంతాలకు దగ్గరలో ఏర్పాటు చేశారు. ట్రాష్ బిన్స్ సోలార్ పవర్తో నడుస్తాయి. సాధారణ బిన్స్కన్నా వీటిల్లో ఎక్కువ స్పేస్ ఉంటుంది. డు మరియు షురూక్ సహకారంతో షార్జా వ్యాప్తంగా స్మార్ట్ బిన్స్ ఏర్పాటు చేయనున్నట్లు బియాహ్ గ్రూప్ సిఇఓ ఖాలిద్ అల్ మురైమెల్ చెప్పారు. షురూక్ సిఇఓ మర్వాన్ అల్ సర్కాల్ మాట్లాడుతూ, అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందుబాటులోకి తీసుకురావడం ద్వారా షార్జాకి ప్రపంచంలో మరింత ప్రత్యేకమైన గుర్తింపు తీసుకు రావడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని అన్నారు.
తాజా వార్తలు
- కొత్త రూల్స్ తెచ్చిన బీసీసీఐ..
- సెంట్రల్ ఢిల్లీలో పలు మెట్రో స్టేషన్లు మూసివేత!
- ఢిల్లీలో తీవ్ర ఉద్రిక్తత..
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ..
- ఖతర్లో భారతీయ రాయబారిగా తెలుగు దౌత్యవేత్త శ్రీకర్ రెడ్డి!
- సౌదీ అరేబియాతో 30 ఏళ్ల పౌర అణు ఒప్పందానికి డొనాల్డ్ ట్రంప్ ఆమోదం!
- గ్లోబల్ ఐకాన్స్ ఫోరం సొసైటీకి ఐఎస్వో 9001:2015 ప్రమాణీకృత సంస్థ గుర్తింపు
- కువైట్లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!







