ముస్లిమేతరుల ఇఫ్తార్ పార్టీ
- June 24, 2016
యూఏఈలో ముస్లిమేతరలు పవిత్ర రమదాన్ మాసం సందర్భంగా ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు. దేశంలో వివిద మతాల మధ్య ఐక్యత చాటేలా ఈ కార్యక్రమం జరగడాన్ని పలువురు అభినందిస్తున్నారు. షార్జాలో సెంట్ మైకేల్స్ కేథలిక్ చర్చ్ బుధవారం, 500 మంది కార్మికులకు ఇఫ్తార్ విందును అందించింది. వివిధ మతాల మధ్య ఐకమత్యాన్ని చాటిచెప్పేందుకు పరిష్ ఈ ఇఫ్తార్ విందును ఏర్పాటు చేసినట్లు ప్రీస్ట్ ఫాదర్ వర్గీస్ చెంపోలి చెప్పారు. పోప్ ఫ్రాన్సిస్ 2016ను ఇయర్ ఆఫ్ మెర్సీగా ప్రకటించడంతో ఈ విందును ఆయన గౌరవార్ధం ఏర్పాటు చేశామన్నారాయన. చాలామంది కార్మికులు తొలిసారి ఈ చర్చ్లోకి అడుగు పెట్టారు. వారందరూ ఇఫ్తార్ విందు పట్ల హర్షం వ్యక్తం చేశారు. ఇంకో వైపున గురునానక్ దర్బార్ గురుద్వారాలోనూ ఇఫ్తార్ విందు జరిగింది. ఈ టెంపుల్లో ఇఫ్తార్ విందు సందర్భంగా ఇస్లామిక్ స్పీకర్ అహ్మద్ హమీద్ మాట్లాడుతూ, వివిధ మతాల మధ్య ఐక్యతకు ఇలాంటి కార్యక్రమాలు దోహదపడతాయన్నారు. మూడో ఏడాది వరుసగా తాము ఇఫ్తార్ విందు ఏర్పాటు చేసినట్లు గురునానక్ దర్బార్ గురుద్వారా ఛైర్మన్ సురేందర్ సింగ్ కందారి చెప్పారు.
తాజా వార్తలు
- ఢిల్లీలో తీవ్ర ఉద్రిక్తత..
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ..
- ఖతర్లో భారతీయ రాయబారిగా తెలుగు దౌత్యవేత్త శ్రీకర్ రెడ్డి!
- సౌదీ అరేబియాతో 30 ఏళ్ల పౌర అణు ఒప్పందానికి డొనాల్డ్ ట్రంప్ ఆమోదం!
- గ్లోబల్ ఐకాన్స్ ఫోరం సొసైటీకి ఐఎస్వో 9001:2015 ప్రమాణీకృత సంస్థ గుర్తింపు
- కువైట్లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!







