ముస్లిమేతరుల ఇఫ్తార్‌ పార్టీ

- June 24, 2016 , by Maagulf
ముస్లిమేతరుల ఇఫ్తార్‌ పార్టీ

యూఏఈలో ముస్లిమేతరలు పవిత్ర రమదాన్‌ మాసం సందర్భంగా ఇఫ్తార్‌ విందు ఏర్పాటు చేశారు. దేశంలో వివిద మతాల మధ్య ఐక్యత చాటేలా ఈ కార్యక్రమం జరగడాన్ని పలువురు అభినందిస్తున్నారు. షార్జాలో సెంట్‌ మైకేల్స్‌ కేథలిక్‌ చర్చ్‌ బుధవారం, 500 మంది కార్మికులకు ఇఫ్తార్‌ విందును అందించింది. వివిధ మతాల మధ్య ఐకమత్యాన్ని చాటిచెప్పేందుకు పరిష్‌ ఈ ఇఫ్తార్‌ విందును ఏర్పాటు చేసినట్లు ప్రీస్ట్‌ ఫాదర్‌ వర్గీస్‌ చెంపోలి చెప్పారు. పోప్‌ ఫ్రాన్సిస్‌ 2016ను ఇయర్‌ ఆఫ్‌ మెర్సీగా ప్రకటించడంతో ఈ విందును ఆయన గౌరవార్ధం ఏర్పాటు చేశామన్నారాయన. చాలామంది కార్మికులు తొలిసారి ఈ చర్చ్‌లోకి అడుగు పెట్టారు. వారందరూ ఇఫ్తార్‌ విందు పట్ల హర్షం వ్యక్తం చేశారు. ఇంకో వైపున గురునానక్‌ దర్బార్‌ గురుద్వారాలోనూ ఇఫ్తార్‌ విందు జరిగింది. ఈ టెంపుల్‌లో ఇఫ్తార్‌ విందు సందర్భంగా ఇస్లామిక్‌ స్పీకర్‌ అహ్మద్‌ హమీద్‌ మాట్లాడుతూ, వివిధ మతాల మధ్య ఐక్యతకు ఇలాంటి కార్యక్రమాలు దోహదపడతాయన్నారు. మూడో ఏడాది వరుసగా తాము ఇఫ్తార్‌ విందు ఏర్పాటు చేసినట్లు గురునానక్‌ దర్బార్‌ గురుద్వారా ఛైర్మన్‌ సురేందర్‌ సింగ్‌ కందారి చెప్పారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com