ఏపీలో మరో ఉపఎన్నిక-ఈసీ నోటిఫికేషన్ విడుదల..!
- November 11, 2024
ఏపీలో మరో ఉపఎన్నిక కోసం ఎన్నికల సంఘం ఇవాళ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇప్పటికే రాష్ట్రంలోని శాసనమండలిలో ఖాళీ అయిన స్థానిక సంస్థల, టీచర్స్ ఎమ్మెల్సీ స్ధానాల కోసం నోటిఫికేషన్ విడుదల అయింది.
ఇప్పుడు మరో స్ధానంలో జరగాల్సిన ఉపఎన్నిక కోసం ఎన్నికల సంఘం ఇవాళ గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. దీంతో వచ్చే నెలలో ఈ ఉపఎన్నికల జరగబోతోంది.
రాష్ట్రంలో గోదావరి జిల్లాల టీచర్స్ ఎమ్మెల్సీగా ఉన్న షేక్ సాబ్జీ హఠాన్మరణం కారణంగా ఈ స్ధానం ఖాళీగా ఉంది. దీంతో ఈ ఎమ్మెల్సీ సీటుకు ఉపఎన్నిక నిర్వహించేందుకు ఎన్నికల సంఘం ఇప్పటికే ఏర్పాట్లు ప్రారంభించింది. ఇందులో భాగంగా ఇవాళ నోటిఫికేషన్ విడుదల చేసింది. గోదావరి జిల్లాల టీచర్స్ ఎమ్మెల్సీ స్ధానానికి జరిగే ఉపఎన్నిక కోసం ఇవాళ్టి నుంచి నామినేషన్లు స్వీకరిస్తారు. ఈ నెల 18 వరకూ నామినేషన్ల స్వీకరణ ఉంటుంది.
అనంతరం ఈ నెల 19న నామినేషన్ల పరిశీలన ఉంటుంది. ఈ నెల 21 వరకూ నామినేషన్ల ఉపసంహరణకు గడువు ఉంది. డిసెంబర్ 5న గోదావరి జిల్లాల టీచర్స్ ఎమ్మెల్సీ స్ధానానికి ఉపఎన్నిక నిర్వహిస్తారు. అనంతరం అదే రోజు ఓట్లు లెక్కించి ఫలితం విడుదల చేస్తారు. ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకూ పోలింగ్ ఉంటుందని ఈసీ నోటిఫికేషన్ లో పేర్కొంది. రాష్ట్రంలో కొత్తగా అధికారంలోకి వచ్చిన కూటమి సర్కార్ టీచర్ల విషయంలో అనుసరిస్తున్న వైఖరిపై వారు ఇందులో తీర్పు ఇవ్వబోతున్నారు.
తాజా వార్తలు
- ఎలిమినేటర్లో హైదరాబాద్కు బిగ్ షాక్..
- ఫైటర్ జెట్ల తయారీకి గ్రీన్ సిగ్నల్
- ఎవరెస్ట్ శిఖరం పై హైదరాబాదీ మృతి..
- ఏపీ ప్రభుత్వంతో BYST ఒప్పందం!
- ప్రధాని మోదీతో ముగిసిన సీఎం విజయ్ సమావేశం
- ఈద్ అల్-అధా శుభాకాంక్షలు తెలిపిన భారత రాయబారి పరామిత త్రిపాఠి..!!
- సుల్తాన్ ఖబూస్ మస్జీదులో ఈద్ ప్రార్థనలు చేసిన సుల్తాన్..!!
- మినాలో భద్రతను సమీక్షించిన ఇంటీరియర్ మినిస్టర్..!!
- లుసైల్ ప్యాలెస్లో ఈద్ అల్-అధా వేడుకల్లో పాల్గొన్న అమీర్..!!
- మనామా సూక్లో ఈద్ సందడి..జోరుగా సాగిన కొనుగోళ్లు..!!









