యూఏఈలో తరచుగా భూకంపాలు ఎందుకు సంభవిస్తాయి?
- November 12, 2024
యూఏఈ: యూఏఈ పెద్ద భూకంపం జోన్లో లేనప్పటికీ, అది అప్పుడప్పుడు చిన్నపాటి భూ ప్రకంపనలకు గురవుతుంది. ప్రపంచంలోని అత్యంత చురుకైన భూకంప ప్రాంతాలలో ఒకటైన జాగ్రోస్ పర్వత శ్రేణికి దగ్గరలో ఉన్నందునే తరచూ ప్రకంపనలు చోటుచేసుకుంటాయని నిపుణులు చెబుతున్నారు. ఇరాన్, ఇరాక్ గుండా విస్తరించి ఉన్న జాగ్రోస్ శ్రేణి తరచుగా భూకంప కార్యకలాపాలను నమోదు చేస్తుందని, కొన్నిసార్లు శక్తివంతమైన భూకంపాలను సృష్టిస్తుందని యూఏఈ నేషనల్ సెంటర్ ఆఫ్ మెటియోరాలజీ (NCM) సీస్మిక్ మానిటరింగ్ సెక్షన్ యాక్టింగ్ హెడ్ మహమ్మద్ అల్హస్సానీ తెలిపారు. తరచూ తేలికైన భూప్రకంపనలు వస్తున్నప్పటికీ 2002లో ఫుజైరాలోని మసాఫీ ప్రాంతంలో రిక్టర్ స్కేలుపై 5.0 తీవ్రతతో అతిపెద్ద భూకంపం నమోదైనట్లు తెలిపారు. సాధారణంగా భూకంప నష్టం వివిధ వేరియబుల్స్పై ఆధారపడి ఉన్నప్పటికీ, భూకంప తీవ్రత 4 లేదా 5 కంటే ఎక్కువగా ఉండే వరకు సాధారణంగా నష్టం జరగదని తెలిపారు. భూకంపాలు సంభవించే ముందు వాటిని అంచనా కష్టమని వెల్లడించారు. "భూకంపాలను ఎవరూ ఖచ్చితంగా ఊహించలేరు. అది జరిగితే తప్ప. కానీ కొన్ని ప్రాంతాలు భూకంప యాక్టివ్ గా ఉన్నాయని భౌగోళిక అధ్యయనాల ద్వారా తెలుస్తుంది. ఉదాహరణకు, ఒక ప్రాంతంలో తరచుగా భూకంపాలు సంభవించవచ్చు, అయినప్పటికీ ఈ సంఘటనలను ఖచ్చితంగా అంచనా వేయడం అసాధ్యం. మేము తరువాత విశ్లేషణ మాత్రమే చేయగలము. ఇది మా సాఫ్ట్వేర్ ప్రోగ్రామ్లను ఉపయోగించి చేయబడుతుంది. అందువల్ల, కేంద్రం నిరంతర పర్యవేక్షణ, రియల్ టైమ్ డేటా విశ్లేషణపై ఆధారపడుతుంది. ’’ వివరించారు.
తాజా వార్తలు
- అత్యవసర సమయాల్లో పేరెంట్స్ బీ అలెర్ట్: ఖతార్
- మిడిల్ ఈస్ట్ కు పరిమితంగా ఇండియన్ ఎయిర్లైన్స్ ఫ్లైట్స్..!!
- కువైట్లో డ్రోన్ శకలాలు తగిలి 11 ఏళ్ల బాలిక మృతి..!!
- ఒమన్లో డ్రోన్లు, ఏరియల్ వస్తువుల పై అలెర్ట్ జారీ..!!
- యూఏఈలో మెడిసిన్ స్టాక్ పై ఆందోళన వద్దు..!!
- 9 డ్రోన్లను అడ్డుకొని ధ్వంసం చేశాము: సౌదీ
- ఎతిహాద్ రైల్ సాహసోపేత చర్య
- యూఏఈలోని యూఎస్ మిషన్లు క్లోజ్..!!
- ChatGPT ని వదిలేస్తున్న మిలియన్ల మంది యూజర్లు!
- భారతీయుల కోసం ప్రత్యేక హెల్ప్లైన్ నంబర్లు









