ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు..
- November 21, 2024
అమరావతి: ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడుల ప్రవాహం కొనసాగుతోంది. తాజాగా రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ఎన్టీపీసీ (నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్) తో రాష్ట్ర ప్రభుత్వం భారీ ఒప్పందాన్ని కుదుర్చుకుంది. ఏపీ ప్రభుత్వ భాగస్వామ్యంతో పునరుత్పాదక రంగంలో రూ.1.87 లక్షల కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకుంది.
ఈ నేపథ్యంలో గురువారం ఏపీ సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రులు లోకేష్, గొట్టిపాటి రవి సమక్షంలో ఒప్పందం కుదిరింది.
ఈ ప్రాజెక్టు ద్వారా వచ్చే 25 ఏళ్లలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రూ.20,620 కోట్ల ఆదాయం రానున్నట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. అంతేకాకుండా ఎన్టీపీసీ పెట్టే పెట్టుబడులతో 1.06 లక్షల మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభించనున్నట్లు చెప్పాయి.
తాజా వార్తలు
- పేటీఎం నుంచి ట్రావెల్ బుకింగ్ యాప్
- ‘వందే మాతరానికి’ 150 ఏళ్లు
- కువైట్ ఉప ప్రధానమంత్రిని కలిసిన కేరళ సీఎం..!!
- Dh100 మిలియన్ యూఏఈ లాటరీ విజేత ఫ్యూచర్ ప్లాన్ రివీల్..!!
- గ్రేస్ పీరియడ్ను సద్వినియోగం చేసుకోవాలని ఒమన్ పిలుపు..!!
- సౌదీయేతరుల ఆస్తులపై కీలక అప్డేట్..!!
- ఖతార్ లో 25.1% పెరిగిన రెంటల్ కాంట్రాక్టులు..!!
- జీసీసీలో బహ్రెయిన్, ఖతార్ తొలి సముద్ర లింక్ ప్రారంభం..!!
- RBVRR పోలీస్ అకాడమీలో ప్రొబేషనరీ డిప్యూటీ సూపరింటెండెంట్స్ శిక్షణ ప్రారంభం
- 80వేల వీసాలను రద్దు చేసిన డొనాల్డ్ ట్రంప్







