టాలీవుడ్ హీరోయిన్ సమంత తండ్రి జోసెఫ్ ప్రభు కన్ను మూత
- November 29, 2024
టాలీవుడ్ ప్రముఖ నటి సమంత తండ్రి జోసెఫ్ ప్రభు కన్నుమూశారు.ఈ విషాదకర సంఘటన సమంత కుటుంబాన్ని తీవ్ర దుఃఖంలో ముంచింది. జోసెఫ్ ప్రభు మరణానికి గల కారణాలు ఇంకా స్పష్టంగా తెలియరాలేదు, కానీ ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారని సమాచారం. అయితే కార్డియాక్ అరెస్ట్ తో జోసఫ్ ప్రభు నిన్న రాత్రి నిద్రలోనే కన్నుమూసినట్లు సమాచారం. రేపు సామ్ తండ్రి అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు తెలుస్తోంది.
జోసెఫ్ ప్రభు మరణం నవంబర్ 29, 2024న జరిగింది. "మనం మళ్లీ కలిసే వరకు, నాన్న” అంటూ హార్ట్ ఎమోజిని కలిగిన వార్తను సమంత తన ఇన్స్టాగ్రామ్ స్టోరీస్ ద్వారా పంచుకున్నారు.
ఆమె తన తండ్రి మరణం పట్ల తీవ్ర విచారం వ్యక్తం చేశారు.సమంత తండ్రి జోసెఫ్ ప్రభు ఒక సాధారణ వ్యక్తి అయినప్పటికీ, ఆయన తన కూతురు సమంతకు ఎంతో మద్దతుగా నిలిచారు. సమంత తన తండ్రి మరణం పట్ల తన బాధను సోషల్ మీడియాలో పంచుకోవడం ద్వారా అభిమానులకు తెలియజేశారు. సమంత రుతు ప్రభు స్వస్థలం చెన్నై. ఆమె 1987 ఏప్రిల్ 28న జన్మించారు. సమంత తన కెరీర్ ప్రారంభంలో మోడలింగ్ చేసి, ఆ తర్వాత తెలుగు మరియు తమిళ చిత్ర పరిశ్రమల్లో ప్రముఖ నటి గా ఎదిగారు.
తాజా వార్తలు
- సౌదీ నుంచి క్షేమంగా బయలుదేరిన 59 మంది తెలుగు ప్రవాసులు
- ఇండిగో సీఈఓ పీటర్ ఎల్బర్స్ రాజీనామా
- 'మేము ఇక్కడ సురక్షితం'-యుద్ధ సమయంలోనూ ఇరానియన్లకు అండగా నిలుస్తున్న యూఏఈ ప్రజలు!
- విదేశాల్లో చిక్కుకుపోతే కంపెనీ జీతం ఆపేయవచ్చా?
- యూఏఈలో కూరగాయల ధరల పెరుగుదల తాత్కాలికమే
- అమరావతి స్పోర్ట్స్ సిటీపై సీఎం చంద్రబాబు వ్యాఖ్యలు!
- తెలంగాణలో సాయంత్రం పూట బీటెక్ కోర్సులు
- అన్ని రకాల డ్రోన్ల పై యూఏఈ నిషేధం..!!
- 684 మంది ఇంజనీర్లకు SR1.6 మిలియన్ల ఫైన్స్..!!
- 2 ఇండిగో విమానాలు దారి మళ్లింపు.. ప్రయాణికులు అసహనం..!!









