అంకారాలోని నేషన్స్ లైబ్రరీని సందర్శించిన సుల్తాన్

- November 30, 2024 , by Maagulf
అంకారాలోని నేషన్స్ లైబ్రరీని సందర్శించిన సుల్తాన్

అంకారా: అంకారాలో టర్కీ ప్రెసిడెన్షియల్ కాంప్లెక్స్‌లోని నేషన్స్ లైబ్రరీని హిస్ మెజెస్టి సుల్తాన్ హైతం బిన్ తారిక్ సందర్శించారు. ఈ సందర్భంగా లైబ్రరీ విభాగాలను, అందులోని విలువైన ప్రచురణలను, అరుదైన మాన్యుస్క్రిప్ట్‌లను వీక్షించారు. ఒమాన్-టర్కిష్ లకు సంబంధించిన చారిత్రక ఒప్పంద డాక్యుమెంట్లను ప్రత్యేకంగా ప్రదర్శించారు. 

నేషన్స్ లైబ్రరీ రిపబ్లిక్ ఆఫ్ టర్కియేలో సుమారు 4 మిలియన్ ప్రింట్ కాపీలు, 120 మిలియన్ కంటే ఎక్కువ వ్యాసాలు, ఎలక్ట్రానిక్ శాస్త్రీయ ప్రచురణలు, ప్రపంచంలోని వివిధ దేశాల నుండి సేకరించిన వివిధ భాషలలోని 134,000 పుస్తకాలు ఉన్నాయి. లైబ్రరీలో ఒమానీ ప్రచురణల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు ఉంది. అనంతరం మెజెస్టి సుల్తాన్ హైతం బిన్ తారిక్ అల్ సయీద్ రెండు రోజుల (రాష్ట్ర) పర్యటన తర్వాత టర్కీయే నుండి బయలుదేరారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com