దేశంలో తొలి హైడ్రోజన్ రైలు, త్వరలో ట్రయల్ రన్....
- November 30, 2024
హైడ్రోజన్ రైలు అనేది ఒక వినూత్న సాంకేతికత. ఇది హైడ్రోజన్ ఇంధన కణాలను ఉపయోగించి నడుస్తుంది. ఈ రైలు విద్యుత్తును ఉత్పత్తి చేయడానికి నీటిని తన ప్రాథమిక వనరుగా ఉపయోగిస్తుంది. హైడ్రోజన్ ఇంధన కణాలు ఆక్సిజన్తో రసాయన చర్య ద్వారా హైడ్రోజన్ వాయువును విద్యుత్తుగా మారుస్తాయి. ఈ విధంగా ఉత్పత్తి అయిన విద్యుత్తు రైలును నడిపేందుకు ఉపయోగపడుతుంది. ప్రస్తుతం జర్మనీలో మాత్రమే నడుస్తున్న ఈ హైడ్రోజన్ రైళ్లను
ఇండియాలో ప్రవేశపెడుతున్నారు. వీటిని త్వరలోనే ట్రయల్ రన్ చేయబోతున్నారు కూడా. అసలు ఈ హైడ్రోజన్ రైలు అంటే ఏమిటి ? ఇది ఎలా నడుస్తుంది? ఈ రైలు యొక్క ప్రత్యేకతలు గురించి పూర్తిగా తెలుసుకుందాం.
హైడ్రోజన్ రైలు అంటే ఒక్కమాటలో చెప్పాలంటే నీటితో నడిచే రైలు అని చెప్పవచ్చు. ఇవి హైడ్రోజన్ గ్యాస్ను ఇంధనంగా ఉపయోగించి నడిచే రైలు. ఈ రైలు నడవడానికి నీటిని తన ప్రాథమిక వనరుగా ఉపయోగిస్తుంది. ఈ రైళ్లు హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్ టెక్నాలజీని ఉపయోగిస్తాయి, దీని ద్వారా హైడ్రోజన్ మరియు ఆక్సిజన్ కలిసినప్పుడు విద్యుత్తు ఉత్పత్తి అవుతుంది. ఈ విద్యుత్తు రైలును నడిపిస్తుంది.
ఇపుడు భారతదేశంలో తొలిసారిగా హైడ్రోజన్ తో నడిచే రైలును ట్రయల్ రన్ చేయబోతున్నారు. ఇందుకు హరియాణా రాష్ట్రం వేదిక కాబోతోంది. హర్యానా లోని జింద్ మరియు సోనిపట్ స్టేషన్ల మధ్య అతి త్వరలో ఈ రైలు ట్రయల్ రన్ నిర్వహించనున్నారు. ఈ రైలు డిజైన్ను RDSO రూపొందించింది. ప్రస్తుతం ఈ రైలును 'నమో గ్రీన్ రైలు’గా పిలుస్తున్నారు. ఈ రైలులో మొత్తం 8 కోచ్ లు ఉంటాయి. ఒక్కో కోచ్ లో 2,638 మంది ప్రయాణించవచ్చు. దీని వేగం 110km/h నుండి 150km/h ఉంటుంది.
ఈ రైలు ప్రత్యేకతలు ఏమిటంటే.. ఇవి పర్యావరణ హితంగా ఉంటాయి. ఎందుకంటే ఇవి కేవలం నీరు మరియు ఆక్సిజన్ను ఉపయోగించి విద్యుత్తును ఉత్పత్తి చేస్తాయి కనుక. ఇది డీజిల్ లేదా ఇతర ఇంధనాలపై ఆధారపడదు కాబట్టి కార్బన్ ఉద్గారాలు ఉండవు. హైడ్రోజన్ రైలు నడవడానికి అవసరమైన హైడ్రోజన్ను ఉత్పత్తి చేయడం కూడా సులభం మరియు తక్కువ ఖర్చుతో ఉంటుంది.
ఇంకా హైడ్రోజన్ రైళ్ల వల్ల పర్యావరణానికి కలిగే ప్రయోజనాలు అనేకం ఉన్నాయి. మొదటిగా ఇవి గాలి కాలుష్యాన్ని తగ్గిస్తాయి. డీజిల్ రైళ్లతో పోలిస్తే హైడ్రోజన్ రైళ్లు శబ్దం తక్కువగా ఉంటాయి. ఇది శబ్ద కాలుష్యాన్ని తగ్గిస్తుంది. ఇవి పునరుత్పాదక ఇంధన వనరులను ఉపయోగిస్తాయి కాబట్టి భవిష్యత్తులో ఇంధన భద్రతను పెంచుతాయి.
అయితే, హైడ్రోజన్ రైళ్లకు కొన్ని సవాళ్లు కూడా ఉన్నాయి. మొదటిగా హైడ్రోజన్ ఉత్పత్తి మరియు నిల్వ ఖరీదైనవి. హైడ్రోజన్ నిల్వ చేయడానికి ప్రత్యేకమైన టాంకులు అవసరం. ఇవి తక్కువ ఉష్ణోగ్రత వద్ద నిల్వ చేయాలి. హైడ్రోజన్ రైళ్ల తయారీ మరియు నిర్వహణ ఖర్చు ఎక్కువగా ఉంటుంది. ఇంకా హైడ్రోజన్ రైళ్ల టెక్నాలజీ ప్రస్తుతం పరిమితంగా ఉంది కాబట్టి విస్తృతంగా వినియోగించడం కష్టం. ప్రస్తుతం హైడ్రోజన్ రైళ్లు కొన్ని దేశాల్లో మాత్రమే ప్రయోగాత్మకంగా నడుస్తున్నాయి. భవిష్యత్తులో ఇవి మరింత విస్తృతంగా ఉపయోగించబడతాయి.
మొత్తానికి, హైడ్రోజన్ రైళ్లు పర్యావరణ పరిరక్షణలో ఒక ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. ఇవి పర్యావరణానికి మేలు చేస్తాయి కానీ కొన్ని సవాళ్లు కూడా ఉన్నాయి. భవిష్యత్తులో ఈ టెక్నాలజీ మరింత అభివృద్ధి చెందితే హైడ్రోజన్ రైళ్లు మరింత సామర్థ్యవంతమైన మరియు విస్తృతమైనవి అవుతాయి.
--వేణు పెరుమాళ్ల(మాగల్ఫ్ ప్రతినిధి)
తాజా వార్తలు
- ‘వికసిత్ భారత్’లో ఏపీ పాత్ర కీలకం..డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్
- సేవా కార్యక్రమాల్లో శోభా రెడ్డి–ప్రసాద్ రెడ్డి దంపతుల ఆదర్శ ప్రస్థానం
- ప్రజలకు స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన సీఎం చంద్రబాబు
- రైతులకు సాగునీరు, గృహాలకు ఉచిత విద్యుత్ ఇస్తున్నాం: సీఎం రేవంత్
- సమైక్య భారత నిర్మాణానికి కృషి చేద్దాం ..దేశ ప్రజలకు ప్రధాని మోదీ పిలుపు
- దుబాయ్లో ఘనంగా భారత స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు..
- వివక్షలు లేని ప్రగతి ప్రస్థానానికి ప్రతి ఒక్కరూ చోదక శక్తులు కావాలి: వెంకయ్య నాయుడు
- మెట్రోలింక్ బస్సు మార్గం M304లో మార్పులు..!!
- ఇంధన రంగంపై బహ్రెయిన్–థాయ్లాండ్ చర్చలు..!!
- తల్లిచేతిలో కత్తిపోట్లకు గురైన చిన్నారులు.. పరామర్శించిన కువైట్ మంత్రి..!!







