రియల్ ఎస్టేట్ కంపెనీపై 20.5 మిలియన్ దిర్హాంల వ్యాజ్యం..కొట్టివేసిన కోర్టు..!!
- December 01, 2024
దుబాయ్: రియల్ ఎస్టేట్ డెవలప్మెంట్ కంపెనీపై ఆర్థిక అవకతవకలకు పాల్పడిందన్న ఆరోపణలపై దాఖలైన 20.5 మిలియన్ దిర్హామ్ల వ్యాజ్యాన్ని దుబాయ్ కమర్షియల్ కోర్ట్ కొట్టివేసింది. 52 ఏళ్ల ఎమిరాటీ రియల్ ఎస్టేట్ డెవలప్మెంట్ కంపెనీ తనను మోసం చేసిందని కోర్టులో సూట్ దాఖలు చేశారు.
దుబాయ్లోని అల్ బర్షా ప్రాంతంలోని రియల్ ఎస్టేట్ ప్రాజెక్ట్లో యూనిట్లను కొనుగోలు చేయడానికి అతను 23.5 మిలియన్ దిర్హామ్లు చెల్లించినట్టు తెలిపారు. కానీ, సదరు రియల్ కంపెనీ 20.5 మిలియన్ దిర్హామ్లను ప్రాజెక్ట్ ఎస్క్రో ఖాతాలో జమ చేయలేదని, ఫలితంగా ఆర్థిక నష్టం వాటిల్లిందని ఆరోపించారు.
అయితే, న్యాయస్థానం నియమించిన ఆర్థిక నిపుణుడు రియల్ ఎస్టేట్ కంపెనీ ప్రాజెక్ట్ను పూర్తి చేసిందని, పిటిషనర్ చాలా యూనిట్లను లాభం కోసం తిరిగి విక్రయించాడని నిర్ధారించారు. ఆర్థిక నష్టం వచ్చిందన్న వాదనను తిరస్కరించారు. 2023 ప్రారంభంలో సెటిల్మెంట్ ఒప్పందాన్ని చేసుకున్నామని, ఆ సమయంలో అతను వివాదంలో ఉన్న అనేక యూనిట్లను విజయవంతంగా సేల్ చేసేశాడని గుర్తించి కోర్టుకు నివేదిక సమర్పించారు. దాంతో కోర్టు పిటిషన్ నుకొట్టివేయడంతోపాట చట్టపరమైన ఖర్చులను చెల్లించాలని ఆదేశించింది.
తాజా వార్తలు
- యూరప్కు అక్రమంగా తరలిస్తున్న 7 కోట్ల సిగరెట్లను అడ్డుకున్న దుబాయ్ కస్టమ్స్
- ADNOC నౌక పై ఇరాన్ దాడిని ఖండించిన బహ్రెయిన్
- హోర్ముజ్ జలసంధిలో ADNOC నౌకపై దాడిని తీవ్రంగా ఖండించిన యూఏఈ
- తెలంగాణ, ఏపీ మీదుగా మరో 2 అమృత్ భారత్ రైళ్లు!
- భారత స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా రాష్ట్రపతి ముర్ముకు యూఏఈ నేతల శుభాకాంక్షలు
- భార్య అనుకుని మరో మహిళపై దాడి.. షార్జాలో వ్యక్తిపై కేసు..!!
- తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ.. టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు విజ్ఞప్తి
- కువైట్లో ఘనంగా భారత్ 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు..!!
- బహ్రెయిన్కు భారత్ అండగా ఉంటుంది.. జైశంకర్ పర్యటనతో భరోసా..!!
- అల్ సాద్ మెట్రో స్టేషన్లో ఆకట్టుకుంటున్న ఆర్టిస్టిక్ మ్యూరల్స్..!!







