రియల్ ఎస్టేట్ కంపెనీపై 20.5 మిలియన్ దిర్హాంల వ్యాజ్యం..కొట్టివేసిన కోర్టు..!!
- December 01, 2024
దుబాయ్: రియల్ ఎస్టేట్ డెవలప్మెంట్ కంపెనీపై ఆర్థిక అవకతవకలకు పాల్పడిందన్న ఆరోపణలపై దాఖలైన 20.5 మిలియన్ దిర్హామ్ల వ్యాజ్యాన్ని దుబాయ్ కమర్షియల్ కోర్ట్ కొట్టివేసింది. 52 ఏళ్ల ఎమిరాటీ రియల్ ఎస్టేట్ డెవలప్మెంట్ కంపెనీ తనను మోసం చేసిందని కోర్టులో సూట్ దాఖలు చేశారు.
దుబాయ్లోని అల్ బర్షా ప్రాంతంలోని రియల్ ఎస్టేట్ ప్రాజెక్ట్లో యూనిట్లను కొనుగోలు చేయడానికి అతను 23.5 మిలియన్ దిర్హామ్లు చెల్లించినట్టు తెలిపారు. కానీ, సదరు రియల్ కంపెనీ 20.5 మిలియన్ దిర్హామ్లను ప్రాజెక్ట్ ఎస్క్రో ఖాతాలో జమ చేయలేదని, ఫలితంగా ఆర్థిక నష్టం వాటిల్లిందని ఆరోపించారు.
అయితే, న్యాయస్థానం నియమించిన ఆర్థిక నిపుణుడు రియల్ ఎస్టేట్ కంపెనీ ప్రాజెక్ట్ను పూర్తి చేసిందని, పిటిషనర్ చాలా యూనిట్లను లాభం కోసం తిరిగి విక్రయించాడని నిర్ధారించారు. ఆర్థిక నష్టం వచ్చిందన్న వాదనను తిరస్కరించారు. 2023 ప్రారంభంలో సెటిల్మెంట్ ఒప్పందాన్ని చేసుకున్నామని, ఆ సమయంలో అతను వివాదంలో ఉన్న అనేక యూనిట్లను విజయవంతంగా సేల్ చేసేశాడని గుర్తించి కోర్టుకు నివేదిక సమర్పించారు. దాంతో కోర్టు పిటిషన్ నుకొట్టివేయడంతోపాట చట్టపరమైన ఖర్చులను చెల్లించాలని ఆదేశించింది.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో క్షిపణి పడి ఇద్దరు మృతి, 12 మందికి గాయాలు
- కతార్ ఎమిర్–అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మధ్య టెలిఫోన్ సంభాషణ
- ICC Mens T20 World Cup Final: ఫైనల్ మ్యాచ్.. న్యూజిలాండ్ పై భారత్ భారీ స్కోర్
- కువైట్ గగనతలం తాత్కాలిక మూసివేత
- ఇరాన్ పై నెతన్యాహు సంచలన వ్యాఖ్యలు
- ఒమన్ లో సాధారణ స్థితికి రవాణా కార్యకలాపాలు..!!
- ఫుడ్, నాన్ ఫుడ్ లభ్యత పై అవుట్లెట్లు భరోసా..!!
- రియాద్ మీదుగా డ్రోన్లతో ఇరాన్ అటాక్..అడ్డుకున్న ఢిఫెన్స్ సిస్టమ్..!!
- బహ్రెయిన్ లో నీటి సరఫరా పై ప్రభావం చూపని ఇరాన్ దాడి..!!
- సెక్యూరిటీ అలెర్ట్ ను ఎత్తేసిన యూఏఈ..!!









