రేపు బెల్జియం పర్యటనకు వెళ్లనున్న ఒమాన్ సుల్తాన్
- December 01, 2024
మస్కట్: హిజ్ మెజెస్టి సుల్తాన్ హైతం బిన్ తారిక్ సోమవారం రాష్ట్ర పర్యటన నిమిత్తం బెల్జియం ఆఫ్ కింగ్ డం కు వెళ్లనున్నారు. ఈ మేరకు రాయల్ కోర్ట్ దివాన్ ఒక ప్రకటన విడుదల చేసింది. బెల్జియన్ రాజు ఫిలిప్ లియోపోల్డ్ లూయిస్ మేరీ నుండి హిస్ మెజెస్టి సుల్తాన్ హైతం బిన్ తారిక్ అందుకున్న ఆహ్వానానికి ప్రతిస్పందనగా హిస్ మెజెస్టి ది సుల్తాన్ డిసెంబర్ 2 సోమవారం రోజున బెల్జియం పర్యటనకు వెళ్లనున్నారు. ఈ పర్యటనలో ఇరువురు నేతలు ప్రాంతీయ, అంతర్జాతీయ అంశాలపై అభిప్రాయాలు పంచుకోనున్నారు.
హిజ్ మెజెస్టి సుల్తాన్ హైతం బిన్ తారిక్ బెల్జియం పర్యటనకు వెళ్లడం వెనుక ప్రధాన ఉద్దేశం రెండు దేశాల మధ్య సంబంధాలను మరింత బలోపేతం చేయడం. ఈ పర్యటనలో, సుల్తాన్ హైతం బిన్ తారిక్ బెల్జియం రాజు మరియు ఇతర ఉన్నతాధికారులతో సమావేశమై, వాణిజ్యం, పెట్టుబడులు, సాంకేతికత, మరియు సాంస్కృతిక మార్పిడి వంటి విభాగాల్లో సహకారాన్ని పెంపొందించడానికి చర్చలు జరుపుతారు. సుల్తాన్ పర్యటన సందర్భంగా హెచ్హెచ్ సయ్యద్ షిహాబ్ బిన్ తారిక్ అల్ సయీద్, రక్షణ వ్యవహారాల ఉప ప్రధాన మంత్రి సయ్యద్ ఖలీద్ బిన్ హిలాల్ అల్ బుసైదీ, దివాన్ ఆఫ్ రాయల్ కోర్ట్ మంత్రి, జనరల్తో కూడిన ఉన్నత స్థాయి అధికారిక ప్రతినిధి బృందం కూడా ఆయనతో ఉంటుంది.
ఈ పర్యటనలో భాగంగా, ఒమాన్ మరియు బెల్జియం మధ్య పలు ఒప్పందాలు కుదుర్చుకునే అవకాశం ఉంది. ముఖ్యంగా, వాణిజ్య మరియు పెట్టుబడుల రంగాల్లో కొత్త అవకాశాలను అన్వేషించడం, సాంకేతికత మరియు శాస్త్ర సాంకేతిక రంగాల్లో సహకారాన్ని పెంపొందించడం, మరియు విద్యా, సాంస్కృతిక మార్పిడి కార్యక్రమాలను ప్రోత్సహించడం వంటి అంశాలు చర్చకు వస్తాయి. ఈ పర్యటన ద్వారా, రెండు దేశాల మధ్య ఉన్న స్నేహపూర్వక సంబంధాలు మరింత బలోపేతం అవుతాయని ఆశిస్తున్నారు. ఈ పర్యటన ఒమాన్ యొక్క అంతర్జాతీయ సంబంధాలను మరింత విస్తరించడంలో కీలక పాత్ర పోషిస్తుంది.
వేణు పెరుమాళ్ల
తాజా వార్తలు
- సౌదీ నుంచి క్షేమంగా బయలుదేరిన 59 మంది తెలుగు ప్రవాసులు
- ఇండిగో సీఈఓ పీటర్ ఎల్బర్స్ రాజీనామా
- 'మేము ఇక్కడ సురక్షితం'-యుద్ధ సమయంలోనూ ఇరానియన్లకు అండగా నిలుస్తున్న యూఏఈ ప్రజలు!
- విదేశాల్లో చిక్కుకుపోతే కంపెనీ జీతం ఆపేయవచ్చా?
- యూఏఈలో కూరగాయల ధరల పెరుగుదల తాత్కాలికమే
- అమరావతి స్పోర్ట్స్ సిటీపై సీఎం చంద్రబాబు వ్యాఖ్యలు!
- తెలంగాణలో సాయంత్రం పూట బీటెక్ కోర్సులు
- అన్ని రకాల డ్రోన్ల పై యూఏఈ నిషేధం..!!
- 684 మంది ఇంజనీర్లకు SR1.6 మిలియన్ల ఫైన్స్..!!
- 2 ఇండిగో విమానాలు దారి మళ్లింపు.. ప్రయాణికులు అసహనం..!!









