రేపు బెల్జియం పర్యటనకు వెళ్లనున్న ఒమాన్ సుల్తాన్
- December 01, 2024
మస్కట్: హిజ్ మెజెస్టి సుల్తాన్ హైతం బిన్ తారిక్ సోమవారం రాష్ట్ర పర్యటన నిమిత్తం బెల్జియం ఆఫ్ కింగ్ డం కు వెళ్లనున్నారు. ఈ మేరకు రాయల్ కోర్ట్ దివాన్ ఒక ప్రకటన విడుదల చేసింది. బెల్జియన్ రాజు ఫిలిప్ లియోపోల్డ్ లూయిస్ మేరీ నుండి హిస్ మెజెస్టి సుల్తాన్ హైతం బిన్ తారిక్ అందుకున్న ఆహ్వానానికి ప్రతిస్పందనగా హిస్ మెజెస్టి ది సుల్తాన్ డిసెంబర్ 2 సోమవారం రోజున బెల్జియం పర్యటనకు వెళ్లనున్నారు. ఈ పర్యటనలో ఇరువురు నేతలు ప్రాంతీయ, అంతర్జాతీయ అంశాలపై అభిప్రాయాలు పంచుకోనున్నారు.
హిజ్ మెజెస్టి సుల్తాన్ హైతం బిన్ తారిక్ బెల్జియం పర్యటనకు వెళ్లడం వెనుక ప్రధాన ఉద్దేశం రెండు దేశాల మధ్య సంబంధాలను మరింత బలోపేతం చేయడం. ఈ పర్యటనలో, సుల్తాన్ హైతం బిన్ తారిక్ బెల్జియం రాజు మరియు ఇతర ఉన్నతాధికారులతో సమావేశమై, వాణిజ్యం, పెట్టుబడులు, సాంకేతికత, మరియు సాంస్కృతిక మార్పిడి వంటి విభాగాల్లో సహకారాన్ని పెంపొందించడానికి చర్చలు జరుపుతారు. సుల్తాన్ పర్యటన సందర్భంగా హెచ్హెచ్ సయ్యద్ షిహాబ్ బిన్ తారిక్ అల్ సయీద్, రక్షణ వ్యవహారాల ఉప ప్రధాన మంత్రి సయ్యద్ ఖలీద్ బిన్ హిలాల్ అల్ బుసైదీ, దివాన్ ఆఫ్ రాయల్ కోర్ట్ మంత్రి, జనరల్తో కూడిన ఉన్నత స్థాయి అధికారిక ప్రతినిధి బృందం కూడా ఆయనతో ఉంటుంది.
ఈ పర్యటనలో భాగంగా, ఒమాన్ మరియు బెల్జియం మధ్య పలు ఒప్పందాలు కుదుర్చుకునే అవకాశం ఉంది. ముఖ్యంగా, వాణిజ్య మరియు పెట్టుబడుల రంగాల్లో కొత్త అవకాశాలను అన్వేషించడం, సాంకేతికత మరియు శాస్త్ర సాంకేతిక రంగాల్లో సహకారాన్ని పెంపొందించడం, మరియు విద్యా, సాంస్కృతిక మార్పిడి కార్యక్రమాలను ప్రోత్సహించడం వంటి అంశాలు చర్చకు వస్తాయి. ఈ పర్యటన ద్వారా, రెండు దేశాల మధ్య ఉన్న స్నేహపూర్వక సంబంధాలు మరింత బలోపేతం అవుతాయని ఆశిస్తున్నారు. ఈ పర్యటన ఒమాన్ యొక్క అంతర్జాతీయ సంబంధాలను మరింత విస్తరించడంలో కీలక పాత్ర పోషిస్తుంది.
వేణు పెరుమాళ్ల
తాజా వార్తలు
- యూరప్కు అక్రమంగా తరలిస్తున్న 7 కోట్ల సిగరెట్లను అడ్డుకున్న దుబాయ్ కస్టమ్స్
- ADNOC నౌక పై ఇరాన్ దాడిని ఖండించిన బహ్రెయిన్
- హోర్ముజ్ జలసంధిలో ADNOC నౌకపై దాడిని తీవ్రంగా ఖండించిన యూఏఈ
- తెలంగాణ, ఏపీ మీదుగా మరో 2 అమృత్ భారత్ రైళ్లు!
- భారత స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా రాష్ట్రపతి ముర్ముకు యూఏఈ నేతల శుభాకాంక్షలు
- భార్య అనుకుని మరో మహిళపై దాడి.. షార్జాలో వ్యక్తిపై కేసు..!!
- తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ.. టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు విజ్ఞప్తి
- కువైట్లో ఘనంగా భారత్ 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు..!!
- బహ్రెయిన్కు భారత్ అండగా ఉంటుంది.. జైశంకర్ పర్యటనతో భరోసా..!!
- అల్ సాద్ మెట్రో స్టేషన్లో ఆకట్టుకుంటున్న ఆర్టిస్టిక్ మ్యూరల్స్..!!







