వాఫ్రాలో ఇండియన్ ఎంబసీ కాన్సులర్ క్యాంపు సక్సెస్..!!
- December 02, 2024కువైట్: కువైట్లోని భారత రాయబార కార్యాలయం నవంబర్ 29న వఫ్రాలో నిర్వహించిన కాన్సులర్ క్యాంపు విజయవంతమైందని ఎంబసీ తెలిపింది. వాఫ్రాలోని ఫైసల్ ఫామ్లో జరిగిన ఈ శిబిరానికి వఫ్రా ప్రాంతంలో నివసిస్తున్న, పనిచేస్తున్న భారతీయ పౌరులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ఈ ప్రాంతంలోని భారతీయ కమ్యూనిటీకి పాస్పోర్ట్ పునరుద్ధరణ, లేబర్ ఫిర్యాదు నమోదు, పిసిసి , ఇతర ధృవీకరణ సేవలు వంటి సేవలను అందించారు. కాన్సులర్ క్యాంపు సందర్భంగా ఇండియన్ డాక్టర్స్ ఫోరమ్ ద్వారా ఉచిత వైద్య శిబిరాన్ని కూడా నిర్వహించారు.
భారతీయ రాయబార కార్యాలయం గతంలో అబ్దాలీలితోపాటు ఇతర మారుమూల ప్రాంతాలలో నివసిస్తున్న భారతీయ కమ్యూనిటీ ప్రయోజనం కోసం అనేక కాన్సులర్ క్యాంపులను నిర్వహించింది. రాయబార కార్యాలయం ఎంబసీ వద్ద సాధారణ ఓపెన్ హౌస్ ను కూడా నిర్వహిస్తుంది. ఇక్కడ భారతీయ కమ్యూనిటీ సభ్యులు రాయబారిని నేరుగా కలుసుకోవచ్చు. తమ సమస్యలకు పరిష్కారం నేరుగా పొందే అవకాశం ఉందని ఎంబసీ అధికారులు వెల్లడించారు.
తాజా వార్తలు
- మనీ ఎక్స్ఛేంజ్లో సాయుధ దోపిడీ..24 గంటల్లో నైజీరియన్ ముఠా అరెస్ట్..!!
- GCC స్థాయిలో మెటర్నిటీ లీవ్స్ రెగ్యులేషన్స్ పై వర్క్ షాప్..!!
- సౌక్ వాకిఫ్ ఈక్వెస్ట్రియన్ ఫెస్టివల్ 2025 సక్సెస్..!!
- దుబాయ్ లో టాక్సీ కంటే చౌకైనది.. బస్సు కంటే వేగవంతం..!!
- కాన్సస్లో దిగ్విజయంగా NATS బ్యాడ్మింటన్ టోర్నమెంట్
- తెలంగాణకు భారీ ఒప్పందం
- డిపోల ప్రైవేటీకరణ దుష్ప్రచారాన్ని ఖండించిన TGSRTC
- మహారాష్ట్రలో ఘోర రైలు ప్రమాదం...11 మంది మృతి
- తిరుపతి తొక్కిసలాట పై న్యాయ విచారణకు ఆదేశం
- ఘనంగా ముగిసిన రాచకొండ కమిషనరేట్ ఆరవ ఎడిషన్ వార్షిక స్పోర్ట్స్ మీట్-2025