వాఫ్రాలో ఇండియన్ ఎంబసీ కాన్సులర్ క్యాంపు సక్సెస్..!!
- December 02, 2024
కువైట్: కువైట్లోని భారత రాయబార కార్యాలయం నవంబర్ 29న వఫ్రాలో నిర్వహించిన కాన్సులర్ క్యాంపు విజయవంతమైందని ఎంబసీ తెలిపింది. వాఫ్రాలోని ఫైసల్ ఫామ్లో జరిగిన ఈ శిబిరానికి వఫ్రా ప్రాంతంలో నివసిస్తున్న, పనిచేస్తున్న భారతీయ పౌరులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ఈ ప్రాంతంలోని భారతీయ కమ్యూనిటీకి పాస్పోర్ట్ పునరుద్ధరణ, లేబర్ ఫిర్యాదు నమోదు, పిసిసి , ఇతర ధృవీకరణ సేవలు వంటి సేవలను అందించారు. కాన్సులర్ క్యాంపు సందర్భంగా ఇండియన్ డాక్టర్స్ ఫోరమ్ ద్వారా ఉచిత వైద్య శిబిరాన్ని కూడా నిర్వహించారు.
భారతీయ రాయబార కార్యాలయం గతంలో అబ్దాలీలితోపాటు ఇతర మారుమూల ప్రాంతాలలో నివసిస్తున్న భారతీయ కమ్యూనిటీ ప్రయోజనం కోసం అనేక కాన్సులర్ క్యాంపులను నిర్వహించింది. రాయబార కార్యాలయం ఎంబసీ వద్ద సాధారణ ఓపెన్ హౌస్ ను కూడా నిర్వహిస్తుంది. ఇక్కడ భారతీయ కమ్యూనిటీ సభ్యులు రాయబారిని నేరుగా కలుసుకోవచ్చు. తమ సమస్యలకు పరిష్కారం నేరుగా పొందే అవకాశం ఉందని ఎంబసీ అధికారులు వెల్లడించారు.
తాజా వార్తలు
- తెలుగు రాష్ట్రాల్లో జూన్ 1 నుంచి సినిమా థియేటర్లు బంద్..
- 17 మంది ప్రాణాలు తీసిన ఏసీ కంప్రెషర్!
- మిస్ వరల్డ్ కంటెస్టంట్లను అలరించిన సెక్రటేరియట్ డ్రోన్ షో
- కారు డోర్ లాక్–నలుగురు చిన్నారులు మృతి
- తన ఆత్మకథ పుస్తకావిష్కరణకు రావలసిందిగా రేవంత్,చంద్రబాబు కు బండారు దత్తాత్రేయ ఆహ్వానం
- త్వరలో తిరుపతిలో ఇంట్రా మోడల్ బస్ టెర్మినల్
- ఐపీఎల్ అభిమానులకు జైన్ కువైట్ బంపరాఫర్.. KD1కే స్ట్రీమింగ్ ఆఫర్..!!
- గ్యాస్ సిలిండర్ పేలి కుప్పకూలిన భవనం.. భారతీయ దంపతులు మృతి..!!
- మస్కట్లో భారతీయుడు సహా నలుగురు శ్రీలంక ప్రవాసులు అరెస్ట్.. !!
- ట్రంప్ మిడ్ ఈస్ట్ పర్యటన: $2 ట్రిలియన్లకు పైగా బిజినెస్ ఒప్పందాలు..!!