వాఫ్రాలో ఇండియన్ ఎంబసీ కాన్సులర్ క్యాంపు సక్సెస్..!!
- December 02, 2024
కువైట్: కువైట్లోని భారత రాయబార కార్యాలయం నవంబర్ 29న వఫ్రాలో నిర్వహించిన కాన్సులర్ క్యాంపు విజయవంతమైందని ఎంబసీ తెలిపింది. వాఫ్రాలోని ఫైసల్ ఫామ్లో జరిగిన ఈ శిబిరానికి వఫ్రా ప్రాంతంలో నివసిస్తున్న, పనిచేస్తున్న భారతీయ పౌరులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ఈ ప్రాంతంలోని భారతీయ కమ్యూనిటీకి పాస్పోర్ట్ పునరుద్ధరణ, లేబర్ ఫిర్యాదు నమోదు, పిసిసి , ఇతర ధృవీకరణ సేవలు వంటి సేవలను అందించారు. కాన్సులర్ క్యాంపు సందర్భంగా ఇండియన్ డాక్టర్స్ ఫోరమ్ ద్వారా ఉచిత వైద్య శిబిరాన్ని కూడా నిర్వహించారు.
భారతీయ రాయబార కార్యాలయం గతంలో అబ్దాలీలితోపాటు ఇతర మారుమూల ప్రాంతాలలో నివసిస్తున్న భారతీయ కమ్యూనిటీ ప్రయోజనం కోసం అనేక కాన్సులర్ క్యాంపులను నిర్వహించింది. రాయబార కార్యాలయం ఎంబసీ వద్ద సాధారణ ఓపెన్ హౌస్ ను కూడా నిర్వహిస్తుంది. ఇక్కడ భారతీయ కమ్యూనిటీ సభ్యులు రాయబారిని నేరుగా కలుసుకోవచ్చు. తమ సమస్యలకు పరిష్కారం నేరుగా పొందే అవకాశం ఉందని ఎంబసీ అధికారులు వెల్లడించారు.
తాజా వార్తలు
- సాదియాత్ ఐలాండ్ లో ‘దార్ అల్ ఫునూన్’ నిర్మాణానికి శ్రీకారం
- ముగ్గురు సీఎంలు ఒకే వేదిక పై.. చంద్రబాబు, రేవంత్, డీకే శివకుమార్..
- యూఏఈ-భారత్ ప్రయాణికులకు కొత్త నిబంధన
- జూలై 9 నుంచి మస్కట్–అబుదాబి మధ్య ఒమన్ ఎయిర్ రోజువారీ విమాన సర్వీసులు
- తెలంగాణ ఉద్యోగులకు భద్రతే భరోసా..
- FIFA ప్రపంచ కప్ ట్రోఫీ విలువ ఎంతో తెలుసా?
- పాస్పోర్ట్ ఫీజుల భారీ పెంపు
- కార్మికుల కోసం దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..
- దుబాయ్లో మూడు వినూత్న ప్రాజెక్టులు..
- ప్రభుత్వ ఉద్యోగుల కోసం ‘అవర్ ఫ్లెక్సిబుల్ సమ్మర్’ కార్యక్రమం అమలు ప్రారంభించిన దుబాయ్







