వాఫ్రాలో ఇండియన్ ఎంబసీ కాన్సులర్ క్యాంపు సక్సెస్..!!
- December 02, 2024
కువైట్: కువైట్లోని భారత రాయబార కార్యాలయం నవంబర్ 29న వఫ్రాలో నిర్వహించిన కాన్సులర్ క్యాంపు విజయవంతమైందని ఎంబసీ తెలిపింది. వాఫ్రాలోని ఫైసల్ ఫామ్లో జరిగిన ఈ శిబిరానికి వఫ్రా ప్రాంతంలో నివసిస్తున్న, పనిచేస్తున్న భారతీయ పౌరులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ఈ ప్రాంతంలోని భారతీయ కమ్యూనిటీకి పాస్పోర్ట్ పునరుద్ధరణ, లేబర్ ఫిర్యాదు నమోదు, పిసిసి , ఇతర ధృవీకరణ సేవలు వంటి సేవలను అందించారు. కాన్సులర్ క్యాంపు సందర్భంగా ఇండియన్ డాక్టర్స్ ఫోరమ్ ద్వారా ఉచిత వైద్య శిబిరాన్ని కూడా నిర్వహించారు.
భారతీయ రాయబార కార్యాలయం గతంలో అబ్దాలీలితోపాటు ఇతర మారుమూల ప్రాంతాలలో నివసిస్తున్న భారతీయ కమ్యూనిటీ ప్రయోజనం కోసం అనేక కాన్సులర్ క్యాంపులను నిర్వహించింది. రాయబార కార్యాలయం ఎంబసీ వద్ద సాధారణ ఓపెన్ హౌస్ ను కూడా నిర్వహిస్తుంది. ఇక్కడ భారతీయ కమ్యూనిటీ సభ్యులు రాయబారిని నేరుగా కలుసుకోవచ్చు. తమ సమస్యలకు పరిష్కారం నేరుగా పొందే అవకాశం ఉందని ఎంబసీ అధికారులు వెల్లడించారు.
తాజా వార్తలు
- కువైట్లో ఉరుములతో కూడిన వర్షాలు..!!
- చార్టర్డ్ విమానాలను నిర్వహిస్తున్న ఇండియన్ అసొసియేషన్స్..!!
- ఆహార వస్తువుల సరఫరా, ధరలపై ఆందోళన వద్దు..!!
- యాస్ ఐలాండ్ లో అటానమస్ టాక్సీల విస్తరణ..!!
- మక్కా, మదీనాలోని భవన యజమానులకు హెచ్చరిక జారీ..!!
- ప్రయాణీకులను హెచ్చరించిన HIA, ఖతార్ ఎయిర్వేస్..!!
- యాదాద్రిలో గవర్నర్ దంపతులు
- తమిళనాడులో వీకే శశికళ కొత్త పార్టీ ప్రారంభం
- తెలుగు రాష్ట్రాల్లో భానుడి ప్రతాపం..తీవ్ర వడగాలులు
- ఇక ఆన్లైన్లోనే వాహనాల రిజిస్ట్రేషన్









