నాసిరకం బంగారు ఉత్పత్తులపై MoCI కఠిన చర్యలు ప్రారంభం..!!
- December 02, 2024
దోహా: నాసిరకం బంగారం ఉత్పత్తులపై ఇటీవల వినియోగదారుల ఫిర్యాదుల నేపథ్యంలో వాణిజ్యం, పరిశ్రమల మంత్రిత్వ శాఖ (MoCI) దేశవ్యాప్తంగా బంగారం మార్కెట్లపై తనిఖీలను ప్రారంభించింది. మంత్రిత్వ శాఖ ప్రధాన కార్యాలయంలో నాణ్యత పరీక్ష కోసం బంగారు రిటైలర్ల నుండి నమూనాలను సేకరింరించారు. కమర్షియల్ ఫ్రాడ్, నకిలీల విభాగం అధిపతి అబ్దుల్లా అలీ సల్మీ మాట్లాడుతూ..రాష్ట్ర ప్రమాణాలకు అనుగుణంగా ఉత్పత్తుల నాణ్యత ఉండడం లేదని, తమ విభాగానికి నిర్దిష్ట ఫిర్యాదులు అందిన తర్వాత ఈ ఆపరేషన్ ప్రారంభించినట్లు వెల్లడించారు.
బంగారు సంస్థలలో క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహించామని, పరీక్ష కోసం వివిధ బులియన్ నమూనాలను సేకరించామని ఇన్స్పెక్టర్ మహ్మద్ అల్-షామ్రీ చెప్పారు. రిటైలర్లకు మంత్రిత్వ శాఖ కఠినమైన హెచ్చరికలు జారీ చేసింది. నిబంధనలను ఉల్లంఘిస్తే తీవ్రమైన జరిమానాలు ఉంటాయి. ఉల్లంఘించిన వారికి రెండు సంవత్సరాల వరకు జైలు శిక్ష, 3,000 నుండి 1,000,000 రియాల్స్ వరకు జరిమానా ఉంటుందన్నారు.
తాజా వార్తలు
- ఖతార్ ఎయిర్కండీషన్డ్ పార్కులకు పెరుగుతున్న ఆదరణ..!!
- కువైట్ పై క్షిపణులు, డ్రోన్ దాడులు..గగనతల రక్షణ వ్యవస్థలు ప్రతిఘటన
- జులై 27న దేశవ్యాప్త బ్యాంక్ సమ్మె..
- ధోఫార్ నుంచి తిరుగు ప్రయాణంలో విషాదం.. టీచర్, ముగ్గురు పిల్లలు మృతి..!!
- సౌదీలో వారం రోజుల్లో 15,836 మంది అరెస్టు..!!
- కువైట్ లో విద్యుత్ పొదుపు ప్రచారానికి విశేష స్పందన..!!
- రోడ్డుపై బట్టలు ఆరేస్తే BD100 జరిమానా..!!
- యూఏఈ లాటరీ 'లక్కీ డే డ్రా'.. ముగ్గురికి చెరో Dh50,000 బహుమతి..!!
- అబుదాబిలో 'యమ్మీ ఇండియన్ బైట్' రెస్టారెంట్ మూసివేత..!!
- సూమ్ యాప్లో ఖైదీల తయారీ ఉత్పత్తుల విక్రయం..!!







