నాసిరకం బంగారు ఉత్పత్తులపై MoCI కఠిన చర్యలు ప్రారంభం..!!
- December 02, 2024
దోహా: నాసిరకం బంగారం ఉత్పత్తులపై ఇటీవల వినియోగదారుల ఫిర్యాదుల నేపథ్యంలో వాణిజ్యం, పరిశ్రమల మంత్రిత్వ శాఖ (MoCI) దేశవ్యాప్తంగా బంగారం మార్కెట్లపై తనిఖీలను ప్రారంభించింది. మంత్రిత్వ శాఖ ప్రధాన కార్యాలయంలో నాణ్యత పరీక్ష కోసం బంగారు రిటైలర్ల నుండి నమూనాలను సేకరింరించారు. కమర్షియల్ ఫ్రాడ్, నకిలీల విభాగం అధిపతి అబ్దుల్లా అలీ సల్మీ మాట్లాడుతూ..రాష్ట్ర ప్రమాణాలకు అనుగుణంగా ఉత్పత్తుల నాణ్యత ఉండడం లేదని, తమ విభాగానికి నిర్దిష్ట ఫిర్యాదులు అందిన తర్వాత ఈ ఆపరేషన్ ప్రారంభించినట్లు వెల్లడించారు.
బంగారు సంస్థలలో క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహించామని, పరీక్ష కోసం వివిధ బులియన్ నమూనాలను సేకరించామని ఇన్స్పెక్టర్ మహ్మద్ అల్-షామ్రీ చెప్పారు. రిటైలర్లకు మంత్రిత్వ శాఖ కఠినమైన హెచ్చరికలు జారీ చేసింది. నిబంధనలను ఉల్లంఘిస్తే తీవ్రమైన జరిమానాలు ఉంటాయి. ఉల్లంఘించిన వారికి రెండు సంవత్సరాల వరకు జైలు శిక్ష, 3,000 నుండి 1,000,000 రియాల్స్ వరకు జరిమానా ఉంటుందన్నారు.
తాజా వార్తలు
- ఎలిమినేటర్లో హైదరాబాద్కు బిగ్ షాక్..
- ఫైటర్ జెట్ల తయారీకి గ్రీన్ సిగ్నల్
- ఎవరెస్ట్ శిఖరం పై హైదరాబాదీ మృతి..
- ఏపీ ప్రభుత్వంతో BYST ఒప్పందం!
- ప్రధాని మోదీతో ముగిసిన సీఎం విజయ్ సమావేశం
- ఈద్ అల్-అధా శుభాకాంక్షలు తెలిపిన భారత రాయబారి పరామిత త్రిపాఠి..!!
- సుల్తాన్ ఖబూస్ మస్జీదులో ఈద్ ప్రార్థనలు చేసిన సుల్తాన్..!!
- మినాలో భద్రతను సమీక్షించిన ఇంటీరియర్ మినిస్టర్..!!
- లుసైల్ ప్యాలెస్లో ఈద్ అల్-అధా వేడుకల్లో పాల్గొన్న అమీర్..!!
- మనామా సూక్లో ఈద్ సందడి..జోరుగా సాగిన కొనుగోళ్లు..!!









