నాసిరకం బంగారు ఉత్పత్తులపై MoCI కఠిన చర్యలు ప్రారంభం..!!

- December 02, 2024 , by Maagulf
నాసిరకం బంగారు ఉత్పత్తులపై MoCI కఠిన చర్యలు ప్రారంభం..!!

దోహా: నాసిరకం బంగారం ఉత్పత్తులపై ఇటీవల వినియోగదారుల ఫిర్యాదుల నేపథ్యంలో వాణిజ్యం, పరిశ్రమల మంత్రిత్వ శాఖ (MoCI) దేశవ్యాప్తంగా బంగారం మార్కెట్‌లపై తనిఖీలను ప్రారంభించింది. మంత్రిత్వ శాఖ ప్రధాన కార్యాలయంలో నాణ్యత పరీక్ష కోసం బంగారు రిటైలర్ల నుండి నమూనాలను సేకరింరించారు. కమర్షియల్ ఫ్రాడ్, నకిలీల విభాగం అధిపతి అబ్దుల్లా అలీ సల్మీ మాట్లాడుతూ..రాష్ట్ర ప్రమాణాలకు అనుగుణంగా ఉత్పత్తుల నాణ్యత ఉండడం లేదని, తమ విభాగానికి నిర్దిష్ట ఫిర్యాదులు అందిన తర్వాత ఈ ఆపరేషన్ ప్రారంభించినట్లు వెల్లడించారు. 
బంగారు సంస్థలలో క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహించామని, పరీక్ష కోసం వివిధ బులియన్ నమూనాలను సేకరించామని ఇన్‌స్పెక్టర్ మహ్మద్ అల్-షామ్రీ చెప్పారు. రిటైలర్‌లకు మంత్రిత్వ శాఖ కఠినమైన హెచ్చరికలు జారీ చేసింది. నిబంధనలను ఉల్లంఘిస్తే తీవ్రమైన జరిమానాలు ఉంటాయి. ఉల్లంఘించిన వారికి రెండు సంవత్సరాల వరకు జైలు శిక్ష, 3,000 నుండి 1,000,000 రియాల్స్ వరకు జరిమానా ఉంటుందన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com