అజ్మాన్ లో అనేక వాహనాలు సీజ్.. భారీగా జరిమానాలు విధింపు..!!
- December 03, 2024
యూఏఈ: 53వ యూఏఈ జాతీయ దినోత్సవ వేడుకల సందర్భంగా అజ్మాన్ పోలీసులు కొరడా ఝులిపించారు. నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేయడం, దుష్ప్రవర్తన కారణంగా అనేక వాహనాలను స్వాధీనం చేసుకున్నట్లు అథారిటీ ప్రకటించింది. అజ్మాన్ బీచ్ రోడ్డులో ఈద్ అల్ ఎతిహాద్ వేడుకల సందర్భంగా ఈ ఉల్లంఘనలు చోటుచేసుకున్నాయని తెలిపారు. వాహనాలను సీజ్ చేసి, డ్రైవర్లను అదుపులోకి తీసుకుని సంబంధిత పోలీస్ స్టేషన్లకు తరలించినట్టు పేర్కొన్నారు. ఉల్లంఘించిన వారికి జరిమానాలు విధించామని, వీటిలో ప్రజలకు ప్రమాదం కలిగించే రీతిలో డ్రైవింగ్ చేయడం, శబ్దానికి అంతరాయం కలిగించడం, వాహన ఇంజిన్లో మార్పులు చేయడం, వాహన అలంకరణ నియమాలను ఉల్లంఘించడం వంటివి ఉన్నాయని తెలిపారు. అదే సమయలో డ్రైవర్లు, ప్రయాణీకులు స్ప్రే సాధనాలను ఉపయోగించడం, వాహనం సన్రూఫ్, కిటికీల నుండి బయటకు నిల్చోవడం వంటి ఉల్లంఘనలు ఉన్నాయని పోలీసులు వెల్లడించారు. వాహనదారులు నిబంధనలు, ట్రాఫిక్ నిబంధనలను పాటించాలని, వీటిని ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
తాజా వార్తలు
- యూఏఈ 5 సంవత్సరాల మల్టిపుల్ ఎంట్రీ టూరిస్ట్ వీసా...
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించిన మొదటి EU దేశంగా ఫ్రాన్స్
- హైడ్రోజన్ రైళ్లు పట్టాలపై కొత్త మలుపు
- సౌదీ విదేశాంగ మంత్రితో ఇటలీ, స్పెయిన్ చర్చలు..!!
- వెయిట్ లాస్ సర్జరీ విషాదం..దర్యాప్తునకు ఎంపీ డిమాండ్..!!
- ఇండియన్ స్కూళ్లలో ఔట్ డోర్ కార్యకలాపాలు నిలిపివేత..!!
- ఖతార్లో అల్ రవాబీ ‘షాప్ అండ్ విన్’ ఆఫర్ ప్రారంభం..!!
- కువైట్ లో భారతీయులే అతిపెద్ద ప్రవాస కమ్యూనిటీ..!!
- దుబాయ్లో భారతీయ పాస్పోర్ట్ కేంద్రాల వద్ద రద్దీ..!!
- కొత్త రూల్స్ తెచ్చిన బీసీసీఐ..







