అజ్మాన్ లో అనేక వాహనాలు సీజ్.. భారీగా జరిమానాలు విధింపు..!!
- December 03, 2024
యూఏఈ: 53వ యూఏఈ జాతీయ దినోత్సవ వేడుకల సందర్భంగా అజ్మాన్ పోలీసులు కొరడా ఝులిపించారు. నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేయడం, దుష్ప్రవర్తన కారణంగా అనేక వాహనాలను స్వాధీనం చేసుకున్నట్లు అథారిటీ ప్రకటించింది. అజ్మాన్ బీచ్ రోడ్డులో ఈద్ అల్ ఎతిహాద్ వేడుకల సందర్భంగా ఈ ఉల్లంఘనలు చోటుచేసుకున్నాయని తెలిపారు. వాహనాలను సీజ్ చేసి, డ్రైవర్లను అదుపులోకి తీసుకుని సంబంధిత పోలీస్ స్టేషన్లకు తరలించినట్టు పేర్కొన్నారు. ఉల్లంఘించిన వారికి జరిమానాలు విధించామని, వీటిలో ప్రజలకు ప్రమాదం కలిగించే రీతిలో డ్రైవింగ్ చేయడం, శబ్దానికి అంతరాయం కలిగించడం, వాహన ఇంజిన్లో మార్పులు చేయడం, వాహన అలంకరణ నియమాలను ఉల్లంఘించడం వంటివి ఉన్నాయని తెలిపారు. అదే సమయలో డ్రైవర్లు, ప్రయాణీకులు స్ప్రే సాధనాలను ఉపయోగించడం, వాహనం సన్రూఫ్, కిటికీల నుండి బయటకు నిల్చోవడం వంటి ఉల్లంఘనలు ఉన్నాయని పోలీసులు వెల్లడించారు. వాహనదారులు నిబంధనలు, ట్రాఫిక్ నిబంధనలను పాటించాలని, వీటిని ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
తాజా వార్తలు
- జయశంకర్ విశ్వనాథన్కు చెంబై సంగీత సంరక్షక పురస్కారం ప్రదానం..!!
- జనవరి 20నుంచి ఉచిత, రాయితీ స్కూల్ సీట్ల రిజిస్ట్రేషన్ ప్రారంభం..!!
- రియాద్ మెట్రో.. రెడ్ లైన్ను దిరియా వరకు పొడిగింపు..!!
- హీరా గ్రూప్ దర్యాప్తులో జోక్యం.. భారత్ లో వ్యక్తి అరెస్టు..!!
- కువైట్ వెదర్ అలెర్ట్..డస్టీ విండ్స్, మోస్తరు వర్షాలు..!!
- ఒమన్ లో సెంట్రల్ పబ్లిక్ హెల్త్ లాబొరేటరీ ప్రారంభం..!!
- వందేభారత్ స్లీపర్.. మినిమమ్ ఛార్జీ రూ.960
- దేశ చరిత్రలో తొలిసారి ఆదివారం బడ్జెట్ ను ప్రవేశ పెడుతున్నారు !!
- సంక్రాంతికి కొత్త ఆఫీసులోకి ప్రధాని..
- గల్ఫ్ కార్మికుల మానవత్వం







