అజ్మాన్ లో అనేక వాహనాలు సీజ్.. భారీగా జరిమానాలు విధింపు..!!
- December 03, 2024
యూఏఈ: 53వ యూఏఈ జాతీయ దినోత్సవ వేడుకల సందర్భంగా అజ్మాన్ పోలీసులు కొరడా ఝులిపించారు. నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేయడం, దుష్ప్రవర్తన కారణంగా అనేక వాహనాలను స్వాధీనం చేసుకున్నట్లు అథారిటీ ప్రకటించింది. అజ్మాన్ బీచ్ రోడ్డులో ఈద్ అల్ ఎతిహాద్ వేడుకల సందర్భంగా ఈ ఉల్లంఘనలు చోటుచేసుకున్నాయని తెలిపారు. వాహనాలను సీజ్ చేసి, డ్రైవర్లను అదుపులోకి తీసుకుని సంబంధిత పోలీస్ స్టేషన్లకు తరలించినట్టు పేర్కొన్నారు. ఉల్లంఘించిన వారికి జరిమానాలు విధించామని, వీటిలో ప్రజలకు ప్రమాదం కలిగించే రీతిలో డ్రైవింగ్ చేయడం, శబ్దానికి అంతరాయం కలిగించడం, వాహన ఇంజిన్లో మార్పులు చేయడం, వాహన అలంకరణ నియమాలను ఉల్లంఘించడం వంటివి ఉన్నాయని తెలిపారు. అదే సమయలో డ్రైవర్లు, ప్రయాణీకులు స్ప్రే సాధనాలను ఉపయోగించడం, వాహనం సన్రూఫ్, కిటికీల నుండి బయటకు నిల్చోవడం వంటి ఉల్లంఘనలు ఉన్నాయని పోలీసులు వెల్లడించారు. వాహనదారులు నిబంధనలు, ట్రాఫిక్ నిబంధనలను పాటించాలని, వీటిని ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
తాజా వార్తలు
- రేషన్ కార్డు సేవలు ఇక మీ ఫోన్లోనే
- గూగుల్ మ్యాప్స్లో సరికొత్త AI ఫీచర్లు
- ఇండిగో ప్రయాణికులకు ‘ఇంధన’ భారం
- అటల్ స్మతిన్యాస్ సొసైటీ కార్యచరణ గురించి పలువురితో చర్చించిన వెంకయ్య నాయుడు
- భారీ నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు
- విలువలతో కూడిన రాజకీయాల్లోకి యువత రావాలి: వెంకయ్య నాయుడు
- అమరావతిలో బిట్స్ పిలాని నిర్మాణ ప్లాన్ లను పరిశీలించిన మంత్రి లోకేష్
- అమెరికా విమానం కూలిన ఘటనలో నలుగురు మృతి
- కువైట్లో ఉరుములతో కూడిన వర్షాలు..!!
- చార్టర్డ్ విమానాలను నిర్వహిస్తున్న ఇండియన్ అసొసియేషన్స్..!!









