బహ్రెయిన్ కు దక్కిన ఆసియా యూత్ గేమ్స్ ఆతిథ్య హక్కులు..!!
- December 03, 2024
మనామా: 2025లో 3వ ఆసియా యూత్ గేమ్స్కు బహ్రెయిన్ ఆతిథ్యం ఇవ్వనుంది. ఈ మేరకు ఒలింపిక్ కౌన్సిల్ ఆఫ్ ఆసియా (OCA) వెల్లడించింది. ఉజ్బెకిస్థాన్లోని తాష్కెంట్లో జరగాల్సిన ఈవెంట్ను రద్దు చేయడంతో.. దానిని బహ్రెయిన్ లో నిర్వహించాలని OCA ఎగ్జిక్యూటివ్ బోర్డు సమావేశంలో నిర్ణయించారు. వాస్తవానికి తాష్కెంట్లో కొత్తగా నిర్మించిన ఒలింపిక్ విలేజ్లో జరగాల్సిన గేమ్స్.. లాజిస్టికల్, స్థానిక సమస్యల కారణంగా ఆలస్యం కానున్నాయి. దీంతో బహ్రెయిన్ లో ఉన్న బలమైన మౌలిక సదుపాయాలను దృష్టిలో పెట్టుకొని అంతర్జాతీయ క్రీడా ఈవెంట్లను హోస్ట్ చేసే అవకాశాన్ని బహ్రెయిన్ కు అప్పగించింది.
ప్రపంచ క్రీడలకు ప్రాంతీయ కేంద్రంగా బహ్రెయిన్ ఎదుగుదలకు ఇది మరో మైలురాయిని సూచిస్తుందని అధికార వర్గాలు తెలిపాయి. అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ల నుండి హై-ప్రొఫైల్ ఫుట్బాల్ టోర్నమెంట్ల వరకు నిర్వహించడంలో ఖలీఫా స్పోర్ట్స్ సిటీ, బహ్రెయిన్ నేషనల్ స్టేడియం వంటి ఆధునిక సౌకర్యాలు క్రీడల నిర్వహణలో కీలక పాత్ర పోషిస్తాయని పేర్కొన్నారు.
తాజా వార్తలు
- ఎలిమినేటర్లో హైదరాబాద్కు బిగ్ షాక్..
- ఫైటర్ జెట్ల తయారీకి గ్రీన్ సిగ్నల్
- ఎవరెస్ట్ శిఖరం పై హైదరాబాదీ మృతి..
- ఏపీ ప్రభుత్వంతో BYST ఒప్పందం!
- ప్రధాని మోదీతో ముగిసిన సీఎం విజయ్ సమావేశం
- ఈద్ అల్-అధా శుభాకాంక్షలు తెలిపిన భారత రాయబారి పరామిత త్రిపాఠి..!!
- సుల్తాన్ ఖబూస్ మస్జీదులో ఈద్ ప్రార్థనలు చేసిన సుల్తాన్..!!
- మినాలో భద్రతను సమీక్షించిన ఇంటీరియర్ మినిస్టర్..!!
- లుసైల్ ప్యాలెస్లో ఈద్ అల్-అధా వేడుకల్లో పాల్గొన్న అమీర్..!!
- మనామా సూక్లో ఈద్ సందడి..జోరుగా సాగిన కొనుగోళ్లు..!!









