బహ్రెయిన్ కు దక్కిన ఆసియా యూత్ గేమ్స్ ఆతిథ్య హక్కులు..!!
- December 03, 2024
మనామా: 2025లో 3వ ఆసియా యూత్ గేమ్స్కు బహ్రెయిన్ ఆతిథ్యం ఇవ్వనుంది. ఈ మేరకు ఒలింపిక్ కౌన్సిల్ ఆఫ్ ఆసియా (OCA) వెల్లడించింది. ఉజ్బెకిస్థాన్లోని తాష్కెంట్లో జరగాల్సిన ఈవెంట్ను రద్దు చేయడంతో.. దానిని బహ్రెయిన్ లో నిర్వహించాలని OCA ఎగ్జిక్యూటివ్ బోర్డు సమావేశంలో నిర్ణయించారు. వాస్తవానికి తాష్కెంట్లో కొత్తగా నిర్మించిన ఒలింపిక్ విలేజ్లో జరగాల్సిన గేమ్స్.. లాజిస్టికల్, స్థానిక సమస్యల కారణంగా ఆలస్యం కానున్నాయి. దీంతో బహ్రెయిన్ లో ఉన్న బలమైన మౌలిక సదుపాయాలను దృష్టిలో పెట్టుకొని అంతర్జాతీయ క్రీడా ఈవెంట్లను హోస్ట్ చేసే అవకాశాన్ని బహ్రెయిన్ కు అప్పగించింది.
ప్రపంచ క్రీడలకు ప్రాంతీయ కేంద్రంగా బహ్రెయిన్ ఎదుగుదలకు ఇది మరో మైలురాయిని సూచిస్తుందని అధికార వర్గాలు తెలిపాయి. అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ల నుండి హై-ప్రొఫైల్ ఫుట్బాల్ టోర్నమెంట్ల వరకు నిర్వహించడంలో ఖలీఫా స్పోర్ట్స్ సిటీ, బహ్రెయిన్ నేషనల్ స్టేడియం వంటి ఆధునిక సౌకర్యాలు క్రీడల నిర్వహణలో కీలక పాత్ర పోషిస్తాయని పేర్కొన్నారు.
తాజా వార్తలు
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ..
- ఖతర్లో భారతీయ రాయబారిగా తెలుగు దౌత్యవేత్త శ్రీకర్ రెడ్డి!
- సౌదీ అరేబియాతో 30 ఏళ్ల పౌర అణు ఒప్పందానికి డొనాల్డ్ ట్రంప్ ఆమోదం!
- గ్లోబల్ ఐకాన్స్ ఫోరం సొసైటీకి ఐఎస్వో 9001:2015 ప్రమాణీకృత సంస్థ గుర్తింపు
- కువైట్లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!







