బహ్రెయిన్ కు దక్కిన ఆసియా యూత్ గేమ్స్ ఆతిథ్య హక్కులు..!!
- December 03, 2024
మనామా: 2025లో 3వ ఆసియా యూత్ గేమ్స్కు బహ్రెయిన్ ఆతిథ్యం ఇవ్వనుంది. ఈ మేరకు ఒలింపిక్ కౌన్సిల్ ఆఫ్ ఆసియా (OCA) వెల్లడించింది. ఉజ్బెకిస్థాన్లోని తాష్కెంట్లో జరగాల్సిన ఈవెంట్ను రద్దు చేయడంతో.. దానిని బహ్రెయిన్ లో నిర్వహించాలని OCA ఎగ్జిక్యూటివ్ బోర్డు సమావేశంలో నిర్ణయించారు. వాస్తవానికి తాష్కెంట్లో కొత్తగా నిర్మించిన ఒలింపిక్ విలేజ్లో జరగాల్సిన గేమ్స్.. లాజిస్టికల్, స్థానిక సమస్యల కారణంగా ఆలస్యం కానున్నాయి. దీంతో బహ్రెయిన్ లో ఉన్న బలమైన మౌలిక సదుపాయాలను దృష్టిలో పెట్టుకొని అంతర్జాతీయ క్రీడా ఈవెంట్లను హోస్ట్ చేసే అవకాశాన్ని బహ్రెయిన్ కు అప్పగించింది.
ప్రపంచ క్రీడలకు ప్రాంతీయ కేంద్రంగా బహ్రెయిన్ ఎదుగుదలకు ఇది మరో మైలురాయిని సూచిస్తుందని అధికార వర్గాలు తెలిపాయి. అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ల నుండి హై-ప్రొఫైల్ ఫుట్బాల్ టోర్నమెంట్ల వరకు నిర్వహించడంలో ఖలీఫా స్పోర్ట్స్ సిటీ, బహ్రెయిన్ నేషనల్ స్టేడియం వంటి ఆధునిక సౌకర్యాలు క్రీడల నిర్వహణలో కీలక పాత్ర పోషిస్తాయని పేర్కొన్నారు.
తాజా వార్తలు
- అటల్ స్మతిన్యాస్ సొసైటీ కార్యచరణ గురించి పలువురితో చర్చించిన వెంకయ్య నాయుడు
- భారీ నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు
- విలువలతో కూడిన రాజకీయాల్లోకి యువత రావాలి: వెంకయ్య నాయుడు
- అమరావతిలో బిట్స్ పిలాని నిర్మాణ ప్లాన్ లను పరిశీలించిన మంత్రి లోకేష్
- అమెరికా విమానం కూలిన ఘటనలో నలుగురు మృతి
- కువైట్లో ఉరుములతో కూడిన వర్షాలు..!!
- చార్టర్డ్ విమానాలను నిర్వహిస్తున్న ఇండియన్ అసొసియేషన్స్..!!
- ఆహార వస్తువుల సరఫరా, ధరలపై ఆందోళన వద్దు..!!
- యాస్ ఐలాండ్ లో అటానమస్ టాక్సీల విస్తరణ..!!
- మక్కా, మదీనాలోని భవన యజమానులకు హెచ్చరిక జారీ..!!









