వాట్సాప్ కొత్త ఫీచర్, గ్రూపులో ఎంతమంది ఆన్ లైన్లో ఉన్నారో తెలుసుకోవడం ఈజీ
- December 14, 2024
వాట్సాప్ యూజర్ల కోసం ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్లతో మరింత మందికి చేరువ అవుతోంది. తాజాగా వాట్సాప్ తన యూజర్ల కోసం ఒక సరికొత్త ఫీచర్ ను తీసుకొచ్చింది. రీసెంట్ గా రిలీజ్ చేసిన ఫీచర్ ద్వారా వాట్సాప్ గ్రూప్ లో ఎంతమంది ఆన్ లైన్లో ఉన్నారో తెలుసుకోవడం ఒక ఈజీ అవుతుంది. ప్రస్తుతం ఈ ఫీచర్ బీటా టెస్టర్లకు మాత్రమే అందుబాటులో ఉంది. త్వరలోనే ఇది ఇతర యూజర్లకు కూడా అందుబాటులోకి రానుంది. ఈ ఫీచర్ ద్వారా గ్రూప్ చాట్స్ లో టాప్ బార్ లో ఆన్ లైన్లో ఉన్న వారి సంఖ్యను డిస్ ప్లే చేస్తుంది. ఇది గ్రూప్ లో సంభాషణలను మరింత మెరుగుపరిచేందుకు ఉపయోగపడుతుంది.
ప్రస్తుతం గ్రూప్ లో ఏదైనా మెసేజ్ చేస్తే అందరూ చూసి స్పందించడానికి చాలా సమయం పడుతుంది. అయితే, ఈ ఫీచర్ ద్వారా గ్రూప్ లోని సభ్యుల్లో ఎంతమంది ఆన్ లైన్లో ఉన్నారో చెక్ చేసుకుని మెసేజ్ చేస్తే ఇతరుల నుంచి రెస్పాన్స్ చాలా తొందరగా పొందే అవకాశం ఉంటుంది. ఎక్కువ మంది యాక్టివ్ గా ఉన్నప్పుడు సందేశాలు షేర్ చేస్తే త్వరగా సమాచారం చేరుతుంది.
ఈ ఫీచర్ ఆన్ లైన్ స్టేటస్ అవైలబుల్ అని సెట్ చేసుకున్న యూజర్లను మాత్రమే ఆన్ లైన్లో ఉన్నారో తెలుపుతుంది. ఆన్ లైన్ స్టేటస్ తెలియకుండా సెట్ చేసుకుంటే మాత్రం వారిని ఆన్ లైన్లో చూపించదు. వారి ప్రైవసీకి భంగం కలిగించకుండా ఈ ఫీచర్ పనిచేస్తుంది. ప్రస్తుతం బీటా వెర్షన్ లో మాత్రమే ఈ ఫీచర్ అందుబాటులో ఉంది. లేటెస్ట్ ఆండ్రాయిడ్ వాట్సాప్ వెర్షన్ కలిగి ఉన్న కొద్దిమంది బీటా టెస్టర్లు ఈ ఫీచర్ ను చెక్ చేసుకోవచ్చు. రాబోయే రోజుల్లో ఎక్కువ మంది యూజర్లకు ఈ ఫీచర్ అందుబాటులోకి రానుంది.
ఈ కొత్త ఫీచర్ వాట్సాప్ గ్రూప్ చాట్స్ లో సంభాషణలను మరింత సులభతరం చేస్తుంది. గ్రూప్ లో ఎంతమంది ఆన్ లైన్లో ఉన్నారో తెలుసుకోవడం ద్వారా మెసేజ్ లకు త్వరగా స్పందన పొందే అవకాశం ఉంటుంది. ఈ ఫీచర్ త్వరలోనే అందరికీ అందుబాటులోకి రానుంది.
తాజా వార్తలు
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!
- బహ్రెయిన్ లో కుటుంబ వ్యవస్థ బలోపేతం..!!
- బహ్రెయిన్, కువైట్ నుంచి క్యారీఫోర్ ఔట్.. త్వరలో యూఏఈ?
- రిమైండర్..ఎయిర్ పోర్టుల్లో క్యాష్, గోల్డ్ వెల్లడిపై రూల్స్..!!
- గాజాలో ఇజ్రాయెల్ నేరాలపై UN నివేదికను స్వాగతించిన సౌదీ అరేబియా..!!
- రికార్డులతో ఖరీఫ్ సీజన్ను ముగించిన ఒమన్ ఎయిర్..!!
- క్రీడల ద్వారా ఏపీ పర్యాటకానికి ప్రచారం: ఏపీటీడీసీ ఎండీ ఆమ్రపాలి