తబలా విద్వాంసుడు జాకీర్‌ హుస్సేన్‌ కన్నుమూత

- December 15, 2024 , by Maagulf
తబలా విద్వాంసుడు జాకీర్‌ హుస్సేన్‌ కన్నుమూత

అమెరికా: ప్రఖ్యాత తబలా విద్వాంసుడు జాకీర్‌ హుస్సేన్ (73) కన్నుమూశారు. ప్రస్తుతం అమెరికాలో ఉంటున్న ఆదివారం శాన్‌ఫ్రాన్సిస్కోలో ఆస్పత్రిలో అడ్మిట్ అయ్యారు.  ఐసీయూలో చికిత్స తీసుకుంటుండగా తుదిశ్వాస విడిచారు. గత కొన్నిరోజులుగా ఆయన గుండె సంబంధిత సమస్యలతో బాధపడుతున్నారు. ఆదివారం జాకీర్ అస్వస్థకు గురవ్వడంతో ఆయన్ని ఆస్పత్రికి తరలించగా.. చికిత్స తీసుకుంటూ ప్రాణాలు విడిచారు.

ఇన్నాళ్లు సంగీత ప్రపంచంలో యాక్టివ్‌గా ఉన్న జాకీర్‌ హుస్సేన్‌కు కోట్లాది మంది అభిమానులున్నారు. జాకీర్‌ మరణవార్తతో ఆయన అభిమానులు సోషల్ మీడియా వేదికగా సంతాపం తెలుపుతున్నారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com