కరుణానిధి మనవడితో వియ్యమందుకుంటున్న విక్రమ్
- June 27, 2016
ప్రముఖ నటుడు విక్రమ్ ఇంట్లో త్వరలో పెళ్లి బాజాలు మోగనున్నాయట. విక్రమ్ కుమార్తె అక్షిత నిశ్చితార్థ వేడుక త్వరలో జరగనున్నట్లు తమిళ సినీ వర్గాలు చెబుతున్నాయి. కేవిన్ కేర్ గ్రూప్ యజమాని సీకే రంగనాథన్ కుమారుడు మను రంజిత్తో అక్షిత వివాహం జరగనున్నట్లు సమాచారం. రంజిత్ డీఎంకే అధినేత ఎం. కరుణానిధికి మునిమనవడు అవుతాడు. కరుణానిధి పెద్ద కుమారుడు ముత్తు కూతురి కొడుకు రంజిత్. ఈ నిశ్చితార్థ కార్యక్రమాన్ని జులై 10న చెన్నైలోని ఓ స్టార్ హోటల్లో నిర్వహిస్తున్నట్లు సమాచారం. కేవలం సన్నిహితులు, బంధువులు ఈ వేడుకకు హాజరౌతున్నట్లు తెలుస్తోంది. 2017లో జరిగే ఈ వివాహానికి చిత్ర పరిశ్రమకు సంబంధించిన తన స్నేహితులందరినీ ఆహ్వానించడానికి విక్రమ్ ప్రయత్నిస్తున్నారట.
తాజా వార్తలు
- యూఏఈ 5 సంవత్సరాల మల్టిపుల్ ఎంట్రీ టూరిస్ట్ వీసా...
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించిన మొదటి EU దేశంగా ఫ్రాన్స్
- హైడ్రోజన్ రైళ్లు పట్టాలపై కొత్త మలుపు
- సౌదీ విదేశాంగ మంత్రితో ఇటలీ, స్పెయిన్ చర్చలు..!!
- వెయిట్ లాస్ సర్జరీ విషాదం..దర్యాప్తునకు ఎంపీ డిమాండ్..!!
- ఇండియన్ స్కూళ్లలో ఔట్ డోర్ కార్యకలాపాలు నిలిపివేత..!!
- ఖతార్లో అల్ రవాబీ ‘షాప్ అండ్ విన్’ ఆఫర్ ప్రారంభం..!!
- కువైట్ లో భారతీయులే అతిపెద్ద ప్రవాస కమ్యూనిటీ..!!
- దుబాయ్లో భారతీయ పాస్పోర్ట్ కేంద్రాల వద్ద రద్దీ..!!
- కొత్త రూల్స్ తెచ్చిన బీసీసీఐ..







