బంగారం ధర మళ్లీ పెరిగింది..

- June 27, 2016 , by Maagulf
బంగారం ధర మళ్లీ పెరిగింది..

బ్రెగ్జిట్‌ ప్రభావంతో రెండేళ్ల గరిష్ఠానికి చేరుకుని, ఆ మరుసటి రోజే కాస్త తగ్గుముఖం పట్టినప్పటికీ.. బంగారం ధర మళ్లీ పెరిగింది. రూ. 150 పెరగడంతో 10గ్రాముల పసిడి ధర నేడు రూ. 30,550కు చేరింది. అంతర్జాతీయ మార్కెట్లు, నగల వ్యాపారుల నుంచి కొనుగోళ్లు ఎక్కువవడంతో ధర పెరిగిందని బులియన్‌ మార్కెట్‌ వర్గాలు వెల్లడించాయి. సింగపూర్‌ మార్కెట్‌లో ఔన్సు పసిడి 1,335.55 డాలర్లుగా ఉంది.
వెండి ధర మాత్రం సోమవారం స్వల్పంగా తగ్గింది. రూ. 290 తగ్గడంతో కేజీ వెండి ధర రూ. 42,100కు చేరింది. పారిశ్రామిక వర్గాలు, నాణేల తయారీదారుల నుంచి కొనుగోళ్లు లేకపోవడంతో ధర తగ్గినట్లు మార్కెట్‌ వర్గాలు తెలిపాయి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com