బలగం మూవీ సింగర్ మొగులయ్య అనారోగ్యంతో కన్నుమూత
- December 19, 2024
హైదరాబాద్: జానపద కళాకారుడు మొగులయ్య, బలగం మూవీలో తన గాత్రంతో ప్రేక్షకుల హృదయాలను కదిలించిన వ్యక్తి అనారోగ్యంతో కన్నుమూశారు. మొగులయ్య కొద్దిరోజులుగా కిడ్నీ సంబంధిత వ్యాధులతో బాధపడుతూ, వరంగల్లోని ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. అయితే, గుండె సంబంధిత సమస్యలు కూడా తలెత్తడంతో ఆయన ఆరోగ్యం మరింత క్షీణించింది. మొగులయ్య ఆరోగ్య పరిస్థితి విషమించడంతో, మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్కు తరలించారు. కానీ, వైద్యుల ప్రయత్నాలు ఫలించకపోవడంతో ఆయన మరణించారు. మొగులయ్య మరణం జానపద కళారంగానికి తీరని లోటు.
మొగులయ్య తన గాత్రంతో బలగం సినిమాలో క్లైమాక్స్ సాంగ్ను అద్భుతంగా ఆలపించి, ప్రేక్షకుల చేత కన్నీరు పెట్టించారు. ఈ పాటతో ఆయనకు ప్రత్యేక గుర్తింపు వచ్చింది. మొగులయ్య కుటుంబం ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతుండటంతో, ఆయన సతీమణి కొమురమ్మ సాయం కోసం ప్రభుత్వాన్ని వేడుకున్నారు. మొగులయ్య మరణం పట్ల సినీ ప్రముఖులు, అభిమానులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. మొగులయ్య వంటి ప్రతిభావంతుల కళాకారులు మన సంస్కృతి, సంప్రదాయాలను నిలబెట్టడంలో కీలక పాత్ర పోషిస్తారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ, ఆయన కుటుంబానికి మనోధైర్యం కలగాలని కోరుకుంటున్నాం.
--వేణు_పెరుమాళ్ల(మాగల్ఫ్ ప్రతినిధి)
తాజా వార్తలు
- ఖతార్ లో 25 కొత్త ఎలక్ట్రానిక్ సేవలు ప్రారంభం..!!
- సౌదీ అరేబియాలో బలమైన గాలులు, భారీ వర్షాలు..!!
- గిన్నిస్ రికార్డ్ అటెంప్ట్.. RAK తీరప్రాంతంలో 15 నిమిషాల ఫైర్ వర్క్స్..!!
- ఇండిగోకు KWD 448,793 ట్యాక్స్ నోటీసులు..!!
- ఒమన్ లో 'రియల్ బెనిఫిషియరీ సర్వీస్' ప్రారంభం..!!
- మారాయీ 2025.. ఫాల్కన్లు, సలుకీలుపై స్పాట్లైట్..!!
- మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ జయంతి సందర్భంగా..సీఎం రేవంత్ నివాళులు..
- పిల్లలకు సోషల్ మీడియా బ్యాన్ చేయాలి: సోనుసూద్
- ఈ నెల 18న గవర్నర్ను కలవనున్న జగన్
- కూటమి పాలనలో ఎన్నో విజయాలు సాధించాం: మంత్రి పార్థసారధి







