మాగ్డేబర్గ్ దాడిని ఖండించిన సౌదీ అరేబియా..!!
- December 21, 2024
రియాద్: జర్మనీలోని మాగ్డేబర్గ్ నగరంలోని సందడిగా ఉన్న క్రిస్మస్ మార్కెట్లో శుక్రవారం సాయంత్రం జరిగిన దాడిని సౌదీ అరేబియా ఖండించింది. ఈ ఘటనలో కారు జనంపైకి దూసుకెళ్లడంతో కనీసం ఇద్దరు వ్యక్తులు మరణించగా, 60 మందికి పైగా గాయపడ్డారు. విదేశాంగ మంత్రిత్వ శాఖ విడుదల చేసిన ఒక ప్రకటనలో, కింగ్డమ్ బాధిత కుటుంబాలకు తన సంతాపాన్ని, జర్మన్ ప్రజలకు సంఘీభావం తెలిపింది. సౌదీ అరేబియా కూడా అన్ని రకాల హింసకు వ్యతిరేకంగా తన దృఢమైన వైఖరిని పునరుద్ఘాటించింది. గాయపడినవారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించింది.
జర్మన్ అధికారుల ప్రకారం.. ఈ దాడి సాయంత్రం 7 గంటలకు జరిగింది. క్రిస్మస్ మార్కెట్ సెలవు దుకాణదారులతో రద్దీగా ఉన్నప్పుడు చోటుచేసుకుంది. ఒక కారు మార్కెట్లోకి దూసుకొచ్చింది. ఈ ఘటనలో ఇద్దరు చనిపోయగా, 15 మంది తీవ్రంగా గాయపడ్డారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ఘటనా స్థలంలో డ్రైవర్ను అదుపులోకి తీసుకున్నారు. దాడి వెనుక ఉగ్రకోణం ఉందని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు.
తాజా వార్తలు
- లూసైల్ స్టేడియం రోడ్డులో ట్రాఫిక్ ఆంక్షలు..!!
- కువైట్లో నాలుగు రోజుల పాటు అధికారిక సంతాప దినాలు..!!
- కువైట్ చమురు క్షేత్రంపై డ్రోన్ దాడి..సరిహద్దుల్లో ఉద్రిక్తత..!!
- ఖతార్ మాజీ అమీర్ మృతికి సౌదీ కింగ్, క్రౌన్ ప్రిన్స్ సంతాపం..!!
- 12 రిక్రూట్మెంట్ సంస్థలపై సౌదీ ప్రభుత్వం కఠిన చర్యలు..!!
- ఏఐ, స్టార్టప్స్ రంగాల్లో బహ్రెయిన్ యువతకు ప్రత్యేక శిక్షణ..!!
- ప్రపంచ యోగాసన ఛాంపియన్షిప్లో ‘వ్యానీతి యోగా’ విద్యార్థుల ప్రతిభ..!!
- యూఏఈలో నాలుగు రోజుల పాటు సంతాప దినాలు..!!
- బహ్రెయిన్, కువైట్, ఖతార్, జోర్డాన్, ఒమాన్పై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన యూఏఈ
- మైసూరులో అధికారిక లాంఛనాలతో జానకమ్మ అంత్యక్రియలు పూర్తి







