మాగ్డేబర్గ్ దాడిని ఖండించిన సౌదీ అరేబియా..!!
- December 21, 2024
రియాద్: జర్మనీలోని మాగ్డేబర్గ్ నగరంలోని సందడిగా ఉన్న క్రిస్మస్ మార్కెట్లో శుక్రవారం సాయంత్రం జరిగిన దాడిని సౌదీ అరేబియా ఖండించింది. ఈ ఘటనలో కారు జనంపైకి దూసుకెళ్లడంతో కనీసం ఇద్దరు వ్యక్తులు మరణించగా, 60 మందికి పైగా గాయపడ్డారు. విదేశాంగ మంత్రిత్వ శాఖ విడుదల చేసిన ఒక ప్రకటనలో, కింగ్డమ్ బాధిత కుటుంబాలకు తన సంతాపాన్ని, జర్మన్ ప్రజలకు సంఘీభావం తెలిపింది. సౌదీ అరేబియా కూడా అన్ని రకాల హింసకు వ్యతిరేకంగా తన దృఢమైన వైఖరిని పునరుద్ఘాటించింది. గాయపడినవారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించింది.
జర్మన్ అధికారుల ప్రకారం.. ఈ దాడి సాయంత్రం 7 గంటలకు జరిగింది. క్రిస్మస్ మార్కెట్ సెలవు దుకాణదారులతో రద్దీగా ఉన్నప్పుడు చోటుచేసుకుంది. ఒక కారు మార్కెట్లోకి దూసుకొచ్చింది. ఈ ఘటనలో ఇద్దరు చనిపోయగా, 15 మంది తీవ్రంగా గాయపడ్డారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ఘటనా స్థలంలో డ్రైవర్ను అదుపులోకి తీసుకున్నారు. దాడి వెనుక ఉగ్రకోణం ఉందని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు.
తాజా వార్తలు
- జయశంకర్ విశ్వనాథన్కు చెంబై సంగీత సంరక్షక పురస్కారం ప్రదానం..!!
- జనవరి 20నుంచి ఉచిత, రాయితీ స్కూల్ సీట్ల రిజిస్ట్రేషన్ ప్రారంభం..!!
- రియాద్ మెట్రో.. రెడ్ లైన్ను దిరియా వరకు పొడిగింపు..!!
- హీరా గ్రూప్ దర్యాప్తులో జోక్యం.. భారత్ లో వ్యక్తి అరెస్టు..!!
- కువైట్ వెదర్ అలెర్ట్..డస్టీ విండ్స్, మోస్తరు వర్షాలు..!!
- ఒమన్ లో సెంట్రల్ పబ్లిక్ హెల్త్ లాబొరేటరీ ప్రారంభం..!!
- వందేభారత్ స్లీపర్.. మినిమమ్ ఛార్జీ రూ.960
- దేశ చరిత్రలో తొలిసారి ఆదివారం బడ్జెట్ ను ప్రవేశ పెడుతున్నారు !!
- సంక్రాంతికి కొత్త ఆఫీసులోకి ప్రధాని..
- గల్ఫ్ కార్మికుల మానవత్వం







