మళ్ళీ మొదలైన 'పందెం కోడి - 2'
- June 27, 2016
విశాల్-లింగుసామి 'పందెంకోడి' సినిమాకి సీక్వెల్ రానుందంటూ ఎన్నాళ్ళుగానో వార్తాలు వినిపిస్తున్నాయి. ఎప్పటికప్పుడు ''ఇదిగో.. అదిగో..'' అంటూ ఈ విషయంపై మాట దాటవేస్తూ వచ్చిన విశాల్ ఈ ఫిబ్రవరిలో 'పందెంకోడి-2' సెట్స్మీదికెళ్ళనుందని ప్రకటించాడు. అయితే దర్శకుడు లింగుసామి తెలుగు, తమిళ భాషల్లో ఓ సినిమా చేసే ప్రయత్నంలో 'పందెంకోడి'ని తిరిగి బుట్ట కింద పెట్టేశాడు. అప్పట్లో ఈ పరిణామంపై స్పందిస్తూ ''కమిటెడ్ ప్రాజెక్ట్స్ నుండి దర్శకులు ఇలా తప్పుకోవడం బాధాకరం'' అంటూ ట్విట్టర్లో తన గోడు వెల్లబోసుకున్న మన నల్లనయ్య మిల్కీ బ్యూటీ తమన్నాతో జంట కట్టి 'కత్తిసండై' అనే సినిమాని మొదలెట్టేశాడు. సురాజ్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో జగపతిబాబు విలన్గా నటిస్తున్నారు. ఇదిలా ఉంటే.. ఏ ద్విభాషా చిత్రం కోసమైతే లింగు లింగు మంటూ లింగుసామి హైదరాబాద్కి ఎగెసుకొచ్చారో ఆ సినిమా అతడి చేజారిపోయింది. ఇక చేసేది లేక విశాల్ వద్దకు చేరుకుని 'పందెంకోడి-2'ని మళ్ళీ బయటికి తీసుకొచ్చే పనుల్లో పడ్డాడు లింగుసామి. విశాల్ కూడా ఎలాంటి పంతానికి పోకుండా 'ప్రొసీడ్' అనడం విశేషం. విశాల్-లింగుసామి-యువన్ శంకర్ రాజా కలయికలో వచ్చిన 'పందెంకోడి' సీక్వెల్కి ఛాయాగ్రాడకుడిగా మది పనిచేయనున్నారు. ఈ సినిమాలో విలన్ పాత్ర చాలా బాగుంటుందన్న విశాల్ మరిన్ని వివరాలు త్వరలో ప్రకటించనున్నట్టు తెలిపాడు.
తాజా వార్తలు
- ధోఫార్ ఖరీఫ్ సీజన్.. వినియోగదారుల రక్షణకు 52 మంది అధికారుల నియామకం..!!
- కలర్వర్స్ ఎక్స్పీరియన్స్తో కుటుంబాలకు వినూత్న వినోదం..!!
- జెడ్డాలో భారీగా పట్టుబడ్డ నకిలీ బ్రాండెడ్ దుస్తులు..!!
- కొత్త మల్టిపుల్ ఎంట్రీ వీసాను ప్రవేశపెట్టిన సౌదీ..!!
- కువైట్ ఎయిర్ పోర్టులో 8.5 కిలోలకుపైగా హషీష్ స్వాధీనం..!!
- భారత్లో బాధ్యతలు చేపట్టిన కొత్త యూఏఈ రాయబారి..క్రెడెన్షియల్స్ సమర్పణ..!!
- పిల్లల ఆన్లైన్ భద్రతపై తల్లిదండ్రులకు బహ్రెయిన్ MOI సూచనలు..!!
- పోలీసుల సంక్షేమమే ప్రథమ ప్రాధాన్యం: డీజీపీ సీవీ ఆనంద్
- తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా రెండు ఎయిర్పోర్ట్ లు..
- నిరసనకారుల రాళ్ల దాడిలో 118 మంది పోలీసులకు గాయాలు







