మళ్ళీ మొదలైన 'పందెం కోడి - 2'
- June 27, 2016
విశాల్-లింగుసామి 'పందెంకోడి' సినిమాకి సీక్వెల్ రానుందంటూ ఎన్నాళ్ళుగానో వార్తాలు వినిపిస్తున్నాయి. ఎప్పటికప్పుడు ''ఇదిగో.. అదిగో..'' అంటూ ఈ విషయంపై మాట దాటవేస్తూ వచ్చిన విశాల్ ఈ ఫిబ్రవరిలో 'పందెంకోడి-2' సెట్స్మీదికెళ్ళనుందని ప్రకటించాడు. అయితే దర్శకుడు లింగుసామి తెలుగు, తమిళ భాషల్లో ఓ సినిమా చేసే ప్రయత్నంలో 'పందెంకోడి'ని తిరిగి బుట్ట కింద పెట్టేశాడు. అప్పట్లో ఈ పరిణామంపై స్పందిస్తూ ''కమిటెడ్ ప్రాజెక్ట్స్ నుండి దర్శకులు ఇలా తప్పుకోవడం బాధాకరం'' అంటూ ట్విట్టర్లో తన గోడు వెల్లబోసుకున్న మన నల్లనయ్య మిల్కీ బ్యూటీ తమన్నాతో జంట కట్టి 'కత్తిసండై' అనే సినిమాని మొదలెట్టేశాడు. సురాజ్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో జగపతిబాబు విలన్గా నటిస్తున్నారు. ఇదిలా ఉంటే.. ఏ ద్విభాషా చిత్రం కోసమైతే లింగు లింగు మంటూ లింగుసామి హైదరాబాద్కి ఎగెసుకొచ్చారో ఆ సినిమా అతడి చేజారిపోయింది. ఇక చేసేది లేక విశాల్ వద్దకు చేరుకుని 'పందెంకోడి-2'ని మళ్ళీ బయటికి తీసుకొచ్చే పనుల్లో పడ్డాడు లింగుసామి. విశాల్ కూడా ఎలాంటి పంతానికి పోకుండా 'ప్రొసీడ్' అనడం విశేషం. విశాల్-లింగుసామి-యువన్ శంకర్ రాజా కలయికలో వచ్చిన 'పందెంకోడి' సీక్వెల్కి ఛాయాగ్రాడకుడిగా మది పనిచేయనున్నారు. ఈ సినిమాలో విలన్ పాత్ర చాలా బాగుంటుందన్న విశాల్ మరిన్ని వివరాలు త్వరలో ప్రకటించనున్నట్టు తెలిపాడు.
తాజా వార్తలు
- IPL 2026: గుజరాత్ పై ముంబై ఘన విజయం
- నటుడు జగపతిబాబు చేతుల మీదగా రామ్ కొణికి సరికొత్త 'కొణికి లక్స్' స్కిన్ కేర్ ప్రారంభం
- మే 1 నుంచి తిరుమలలో శ్రీవారి దర్శనానికి కొత్త నిబంధనలు
- JEE మెయిన్స్ తుది ఫలితాలు వచ్చేశాయ్..
- ఏపీకి కేంద్ర ప్రభుత్వం గొప్ప శుభవార్త
- కాంగ్రెస్ ప్రభుత్వంకు కేసీఆర్ డెడ్లైన్
- కరీంనగర్లో ఘనంగా 'కార్తికేయ జువెలరీస్' ప్రారంభోత్సవం
- యూఏఈలో ఉగ్రవాద సంస్థ భగ్నం: దేశ భద్రతను దెబ్బతీయాలన్న కుట్ర విఫలం
- బహ్లా కోటలో నాలుగు కొత్త మ్యూజియమ్స్ ప్రారంభం..!!
- ఖతార్ మున్సిపాలిటీలో ఈకో ఫ్రెండ్లీ వెహికల్స్, పరికరాలు..!!









