గల్ఫ్ దేశాల చెరశాలలో చిక్కుకున్న భారతీయుల ఇక్కట్లు
- June 28, 2016
ఉన్న ఊళ్లో బతుకుదామంటే కరువు పగపట్టింది. పొట్టకూటి కోసం పక్క దేశానికి వెళితే అమాయకత్వంతోనో, తెలిసీతెలియనితనంతోనో కేసుల ఉచ్చులో చిక్కుకుంటున్నారు. ఉన్న ఊరికి రాలేక, ఉన్న చోట బ్రతకలేక నరకం అనుభవిస్తున్నారు. ఇది ఏ ఒక్కరి కథో కాదు. కొన్ని వందల మంది భారతీయులు గల్ఫ్ దేశాల్లో ఎదుర్కుంటున్న దయనీయ స్థితి. సౌదీ, దుబాయ్ దేశాలకు ఎన్నో కలలతో వెళ్లిన తెలుగు ప్రజలు ఆ కలలన్నీ కల్లలవడంతో కుమిలిపోతున్నారు. డ్రగ్స్ కేసుల్లో శిక్ష అనుభవిస్తున్న తెలుగువారి పరిస్థితి మరీ ఘోరం. గల్ఫ్ దేశాల్లో శిక్షలు అత్యంత కఠినంగా అమలు చేస్తారు. ఈ శిక్షలకు ఎంతోమంది తెలుగువారు బలైపోయారు. బలవుతూనే ఉన్నారు. ఏడాది క్రితం కడప జిల్లా సుండుపల్లికి చెందిన షేక్ సయ్యద్కి డ్రగ్స్ కేసులోనే మరణ శిక్ష పడింది. చిత్తూరు జిల్లా మదనపల్లెకు చెందిన ఓ వ్యక్తికి డ్రగ్స్ కేసులో మరణ శిక్ష పడింది. కడప జిల్లా సుండుపల్లికి చెందిన దాదాపీర్ కువైట్లో తన గదిలో డ్రగ్స్తో దొరికిపోయాడు. ప్రస్తుతం జీవిత ఖైదు అనుభవిస్తున్నాడు. అంతేకాదు పలు కేసుల్లో శిక్ష అనుభవిస్తున్న ముగ్గురు భారతీయులకు మరణ శిక్ష విధించారు. 2007-13 సంవత్సరాల మధ్య కువైట్లో ఉరిశిక్ష అమలును అక్కడి ప్రభుత్వం నిషేధించింది. పెరుగుతున్న అకృత్యాలను దృష్టిలో ఉంచుకుని 2013లో మళ్లీ ఉరిశిక్షను అమల్లోకి తెచ్చింది. ఆ సమయంలోనే వివిధ కేసుల్లో కొందరికి ఉరిశిక్ష పడింది. ఈ ఉరిని అమలు చేసే సమయంలో జర్నలిస్టులను పిలిచి మరీ శిక్షను విధించడం గల్ఫ్ దేశాల్లో మగ్గుతున్న తెలుగువారి దీన స్థితికి నిదర్శనం.
తాజా వార్తలు
- నిరాహార దీక్ష ఆపేది లేదు–సోనమ్ వాంగుక్ ప్రకటన
- ఇరాన్ దాడుల ప్రభావం.. బహ్రెయిన్, కువైట్, ఖతార్ విమానాలకు అంతరాయం
- ఏపీ విద్యార్థులకు సర్కార్ గుడ్ న్యూస్..
- డీజీపీ సీవీ ఆనంద్ ని కలిసిన క్రికెటర్ మహమ్మద్ సిరాజ్
- సెప్టెంబర్లో ప్రారంభం కాబోతున్న బిగ్ బాస్ సీజన్ 10
- బహ్రెయిన్ వైమానిక నావిగేషన్ పరికరాలే లక్ష్యం..అయినా విమాన రాకపోకలకు అంతరాయం లేదు
- ఢిల్లీ ఘటన పై తెలంగాణ సీఎం రేవంత్ ఫైర్..
- ఇరాన్ కొనసాగిస్తున్న దాడులు..కువైట్ పై క్షిపణులు, డ్రోన్లను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- ‘రాజు ఆమ్లెట్’ వ్యవస్థాపకుడు రాజీవ్ మెహెరిష్ కన్నుమూత
- యూఏఈలో భారతీయుల పాస్పోర్ట్ సేవలకు ఊరట.. అల్హింద్ ద్వారా తాత్కాలికంగా కాన్సులర్ సేవలకు సుప్ర







