గల్ఫ్ దేశాల చెరశాలలో చిక్కుకున్న భారతీయుల ఇక్కట్లు
- June 28, 2016
ఉన్న ఊళ్లో బతుకుదామంటే కరువు పగపట్టింది. పొట్టకూటి కోసం పక్క దేశానికి వెళితే అమాయకత్వంతోనో, తెలిసీతెలియనితనంతోనో కేసుల ఉచ్చులో చిక్కుకుంటున్నారు. ఉన్న ఊరికి రాలేక, ఉన్న చోట బ్రతకలేక నరకం అనుభవిస్తున్నారు. ఇది ఏ ఒక్కరి కథో కాదు. కొన్ని వందల మంది భారతీయులు గల్ఫ్ దేశాల్లో ఎదుర్కుంటున్న దయనీయ స్థితి. సౌదీ, దుబాయ్ దేశాలకు ఎన్నో కలలతో వెళ్లిన తెలుగు ప్రజలు ఆ కలలన్నీ కల్లలవడంతో కుమిలిపోతున్నారు. డ్రగ్స్ కేసుల్లో శిక్ష అనుభవిస్తున్న తెలుగువారి పరిస్థితి మరీ ఘోరం. గల్ఫ్ దేశాల్లో శిక్షలు అత్యంత కఠినంగా అమలు చేస్తారు. ఈ శిక్షలకు ఎంతోమంది తెలుగువారు బలైపోయారు. బలవుతూనే ఉన్నారు. ఏడాది క్రితం కడప జిల్లా సుండుపల్లికి చెందిన షేక్ సయ్యద్కి డ్రగ్స్ కేసులోనే మరణ శిక్ష పడింది. చిత్తూరు జిల్లా మదనపల్లెకు చెందిన ఓ వ్యక్తికి డ్రగ్స్ కేసులో మరణ శిక్ష పడింది. కడప జిల్లా సుండుపల్లికి చెందిన దాదాపీర్ కువైట్లో తన గదిలో డ్రగ్స్తో దొరికిపోయాడు. ప్రస్తుతం జీవిత ఖైదు అనుభవిస్తున్నాడు. అంతేకాదు పలు కేసుల్లో శిక్ష అనుభవిస్తున్న ముగ్గురు భారతీయులకు మరణ శిక్ష విధించారు. 2007-13 సంవత్సరాల మధ్య కువైట్లో ఉరిశిక్ష అమలును అక్కడి ప్రభుత్వం నిషేధించింది. పెరుగుతున్న అకృత్యాలను దృష్టిలో ఉంచుకుని 2013లో మళ్లీ ఉరిశిక్షను అమల్లోకి తెచ్చింది. ఆ సమయంలోనే వివిధ కేసుల్లో కొందరికి ఉరిశిక్ష పడింది. ఈ ఉరిని అమలు చేసే సమయంలో జర్నలిస్టులను పిలిచి మరీ శిక్షను విధించడం గల్ఫ్ దేశాల్లో మగ్గుతున్న తెలుగువారి దీన స్థితికి నిదర్శనం.
తాజా వార్తలు
- IPL 2026: గుజరాత్ పై ముంబై ఘన విజయం
- నటుడు జగపతిబాబు చేతుల మీదగా రామ్ కొణికి సరికొత్త 'కొణికి లక్స్' స్కిన్ కేర్ ప్రారంభం
- మే 1 నుంచి తిరుమలలో శ్రీవారి దర్శనానికి కొత్త నిబంధనలు
- JEE మెయిన్స్ తుది ఫలితాలు వచ్చేశాయ్..
- ఏపీకి కేంద్ర ప్రభుత్వం గొప్ప శుభవార్త
- కాంగ్రెస్ ప్రభుత్వంకు కేసీఆర్ డెడ్లైన్
- కరీంనగర్లో ఘనంగా 'కార్తికేయ జువెలరీస్' ప్రారంభోత్సవం
- యూఏఈలో ఉగ్రవాద సంస్థ భగ్నం: దేశ భద్రతను దెబ్బతీయాలన్న కుట్ర విఫలం
- బహ్లా కోటలో నాలుగు కొత్త మ్యూజియమ్స్ ప్రారంభం..!!
- ఖతార్ మున్సిపాలిటీలో ఈకో ఫ్రెండ్లీ వెహికల్స్, పరికరాలు..!!









