గల్ఫ్ దేశాల చెరశాలలో చిక్కుకున్న భారతీయుల ఇక్కట్లు
- June 28, 2016
ఉన్న ఊళ్లో బతుకుదామంటే కరువు పగపట్టింది. పొట్టకూటి కోసం పక్క దేశానికి వెళితే అమాయకత్వంతోనో, తెలిసీతెలియనితనంతోనో కేసుల ఉచ్చులో చిక్కుకుంటున్నారు. ఉన్న ఊరికి రాలేక, ఉన్న చోట బ్రతకలేక నరకం అనుభవిస్తున్నారు. ఇది ఏ ఒక్కరి కథో కాదు. కొన్ని వందల మంది భారతీయులు గల్ఫ్ దేశాల్లో ఎదుర్కుంటున్న దయనీయ స్థితి. సౌదీ, దుబాయ్ దేశాలకు ఎన్నో కలలతో వెళ్లిన తెలుగు ప్రజలు ఆ కలలన్నీ కల్లలవడంతో కుమిలిపోతున్నారు. డ్రగ్స్ కేసుల్లో శిక్ష అనుభవిస్తున్న తెలుగువారి పరిస్థితి మరీ ఘోరం. గల్ఫ్ దేశాల్లో శిక్షలు అత్యంత కఠినంగా అమలు చేస్తారు. ఈ శిక్షలకు ఎంతోమంది తెలుగువారు బలైపోయారు. బలవుతూనే ఉన్నారు. ఏడాది క్రితం కడప జిల్లా సుండుపల్లికి చెందిన షేక్ సయ్యద్కి డ్రగ్స్ కేసులోనే మరణ శిక్ష పడింది. చిత్తూరు జిల్లా మదనపల్లెకు చెందిన ఓ వ్యక్తికి డ్రగ్స్ కేసులో మరణ శిక్ష పడింది. కడప జిల్లా సుండుపల్లికి చెందిన దాదాపీర్ కువైట్లో తన గదిలో డ్రగ్స్తో దొరికిపోయాడు. ప్రస్తుతం జీవిత ఖైదు అనుభవిస్తున్నాడు. అంతేకాదు పలు కేసుల్లో శిక్ష అనుభవిస్తున్న ముగ్గురు భారతీయులకు మరణ శిక్ష విధించారు. 2007-13 సంవత్సరాల మధ్య కువైట్లో ఉరిశిక్ష అమలును అక్కడి ప్రభుత్వం నిషేధించింది. పెరుగుతున్న అకృత్యాలను దృష్టిలో ఉంచుకుని 2013లో మళ్లీ ఉరిశిక్షను అమల్లోకి తెచ్చింది. ఆ సమయంలోనే వివిధ కేసుల్లో కొందరికి ఉరిశిక్ష పడింది. ఈ ఉరిని అమలు చేసే సమయంలో జర్నలిస్టులను పిలిచి మరీ శిక్షను విధించడం గల్ఫ్ దేశాల్లో మగ్గుతున్న తెలుగువారి దీన స్థితికి నిదర్శనం.
తాజా వార్తలు
- ఖమేనీ మృతికి అధికారికంగా సంతాపం తెలిపిన భారత్
- ICC Mens T20 World Cup 2026: భారత్ భారీ స్కోర్..
- అమెరికా ట్యాంకర్ పై దాడి చేసిన ఇరాన్
- గల్ఫ్ దేశాలకు ఇటలీ బాసట
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!
- డ్రోన్, 2 క్రూజ్ మిస్సైళ్లతో ఇరాన్ అటాక్..రాస్ తనురా సేఫ్..!!









